సంక్రాంతి సినిమాల హడావిడి వాడివేడిగా జరుగుతోంది. ఒకపక్క హనుమాన్ బుకింగ్స్ ఆశ్చర్యం కలిగిస్తుండగా ఇంకోవైపు గుంటూరు కారం థియేటర్లను షోలు పడక ముందే ఉక్కిరిబిక్కిరి చేస్తోంది, ఈ నేపథ్యంలో సైంధవ్, నా సామిరంగ సౌండ్ తక్కువగా వినిపించడం చూసి ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. నిజానికి ఇద్దరూ తమ శాయశక్తులా ప్రమోషన్లు చాలా యాక్టివ్ గా చేస్తున్నారు. రెండింటికి ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరిగాయి. కానీ ఎందుకనో ఆశించిన స్థాయిలో సోషల్ మీడియాలో హైలైట్ కాలేదు. ఇంటర్వ్యూలు గట్రా గట్టిగానే ఇచ్చారు. రీచ్ మాత్రం ఇంకా ఊపందుకోవాల్సి ఉంది.
దీనికి కారణాలు లేకపోలేదు. గుంటూరు కారం జపంలో ఆడియన్స్ మునిగి తేలుతున్నారు. టికెట్ల గురించిన చర్చలతోనే ట్విట్టర్ హోరెత్తిపోతోంది. అటుపక్క హనుమాన్ షోల తాలూకు అప్డేట్స్ ని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు క్రమం తప్పకుండ అప్డేట్ చేస్తూ హైప్ ని పెంచుకుంటూ పోతున్నారు. ప్రముఖ బాలీవుడ్ అనలిస్ట్ తరన్ ఆదర్శ్ కి షో వేసి శభాష్ అనిపించుకున్నారు. ఇతర నార్త్ జర్నలిస్టులకి మధ్యాహ్నం షో రన్ అవుతోంది. తెలుగు మీడియాకి ఇవాళ సాయంత్రం ప్రీమియర్ జరుగుతుంది. ఈ పరిణామాలు గుంటూరు కారం, హనుమాన్ లకు సానుకూలంగా పనిచేస్తున్నాయి.
సైంధవ్, నా సామిరంగలు ఎదురు చూస్తోంది ఒకటే. తమ పోటీ సినిమాలకు ఇంకొద్ది గంటల్లో రాబోయే టాక్ ఎలా ఉంటుందనే. దాన్ని బట్టి స్పీడ్ ఎంత పెంచాలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. స్వంత డిస్ట్రిబ్యూషన్ ఎంత బలంగా ఉన్నా వెంకటేష్ కు తగినన్ని స్క్రీన్లు రాలేదని ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు. నా సామిరంగ ఆదివారం రిలీజ్ ని ఎంచుకోవడంతో హిట్ టాక్ వచ్చినా చేతిలో ఉన్న థియేటర్లు సరిపోవనే టెన్షన్ లో అక్కినేని అభిమానులున్నారు. ఇదంతా తీరాలంటే రేపు మధ్యాన్నం దాకా ఆగాలి. మహేష్ బాబు, తేజలు కూల్ అయ్యాక అప్పుడు వెంకీ, నాగ్ సౌండ్ గట్టిగా వినొచ్చు.
This post was last modified on January 11, 2024 4:49 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…