బింబిసార రూపంలో డెబ్యూతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు వశిష్ట ప్రస్తుతం చిరంజీవితో భారీ ప్యాన్ ఇండియా మూవీ విశ్వంభర చేస్తున్న సంగతి తెలిసిందే. సెట్స్ లో ఇంకా హీరో అడుగుపెట్టలేదు కానీ ఆయన అవసరం లేని సీన్లను మిగిలిన ఆర్టిస్టులతో చకా చకా పూర్తి చేస్తున్నారు. హీరోయిన్లుగా త్రిష, మృణాల్ ఠాకూర్ పేర్లు వినిపిస్తున్నాయి కానీ ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సంక్రాంతికి ఏదైనా పోస్టర్ లేదా కీలక అనౌన్స్ మెంట్ ఉండొచ్చని ఫిలిం నగర్ టాక్. ఇప్పుడు లేటెస్ట్ గా అందుతున్న అప్డేట్ అభిమానులను మరింత ఎగ్జైట్ చేసేలా ఉంది.
దాని ప్రకారం విశ్వంభరలో ఒక కీలక క్యామియో కోసం దీపికా పదుకునేని సంప్రదించారట. కథలో భాగంగా దొరబాబు (ప్రచారంలో ఉన్న చిరు పాత్ర పేరు) ఓ దేవకన్యని కలుస్తాడట. ఆ సందర్భంగా వచ్చే చిన్న ఎపిసోడ్లో స్పెషల్ సాంగ్ ఉంటుందట. కళ్ళు చెదిరే సెట్ల మధ్య భారీ కాస్ట్యూమ్స్ తో అప్సరసను తలదన్నే అందమైన భామతో చిరు డాన్స్ చేసే పాట కోసం ఆమెను అడిగినట్టు తెలిసింది. రెమ్యునరేషన్ ఎంతైనా పర్వాలేదనే రీతిలో యువి క్రియేషన్స్ సిద్ధంగా ఉన్నట్టు వినికిడి. ప్రస్తుతం దీపికా పదుకునే ప్రభాస్ సరసన కల్కి ఏడి 2898లో మెయిన్ హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.
అఫీషియలయ్యే దాకా ధృవీకరించలేం కానీ నిజమైతే మాత్రం మెగా ఫ్యాన్స్ కి కిక్కే. ప్రస్తుతం చిరంజీవి ఇంకా విశ్రాంతిలోనే ఉన్నారు. సంక్రాంతి అయ్యాక షూటింగ్ లో పాల్గొనేలా షెడ్యూల్స్ ని ప్లాన్ చేశారు. విజువల్ ఎఫెక్ట్స్ కి అధిక ప్రాధాన్యం ఉన్న సినిమా కావడంతో దానికి అనుగుణంగా ఆరోగ్యంగా ఉండేందుకు ఎక్కువ గ్యాప్ తీసుకున్న చిరు ఫిబ్రవరి నుంచి పూర్తిగా దీని మీద ఫోకస్ పెట్టబోతున్నారు. ఎంఎం కీరవాణితో రెండు పాటల కంపోజింగ్ ఆల్రెడీ పూర్తయిపోగా బాలన్స్ ఉన్నవి మిగిలినవి త్వరలోనే మొదలుపెట్టబోతున్నారు. 2025 సంక్రాంతి విడుదల లక్ష్యంగా పెట్టుకున్నారు.
This post was last modified on January 11, 2024 2:10 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…