కొత్త ఏడాదిలో అసలైన బాక్సాఫీస్ సమరం రేపటి నుంచి మొదలు కాబోతోంది. పేరుకి జనవరి 12 రిలీజనే కానీ హనుమాన్ కి ఇవాళ సాయంత్రం నుంచి వేస్తున్న ప్రీమియర్లకు వస్తున్న అడ్వాన్స్ బుకింగ్స్ స్పందన చూసి బయ్యర్లు షాకవుతున్నారు. హైదరాబాద్ లో రెండు వందల దాకా షోలు వేస్తే దాదాపు అన్నీ ముందస్తుగానే ఫుల్ అవుతున్నాయి. ఏపీ తెలంగాణ జిల్లా కేంద్రాల్లో రెండు షోలతో సరిపోతుందనుకుంటే ఏకంగా తొమ్మిది పైగా పెంచే పరిస్థితి నెలకొంది. రాత్రికి వచ్చే పాజిటివ్ టాక్ రేపటి నుంచి ఉపయోగపడుతుందనే నమ్మకం టీమ్ లో కనిపిస్తోంది. లాంగ్ రన్ ని టార్గెట్ చేసుకున్న హనుమాన్ కి ఇది చాలా కీలకం.
ఇక గుంటూరు కారం ర్యాంపేజ్ మాములుగా లేదు. టికెట్ రేట్ల మీద వంద రూపాయల పెంపున్నా హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ముఖ్యంగా మిడ్ నైట్ షోల డిమాండ్ చూస్తే ఎవరికైనా నోట మాట రాదు. ఒక్క భాగ్యనగరంలోనే 8 కోట్ల గ్రాస్ ఆల్రెడీ వచ్చేసిందని ట్రేడ్ రిపోర్ట్. బాగుందనే మాట వస్తే చాలు రికార్డుల ఊచకోత మాములుగా ఉండదు. శనివారం రాబోతున్న సైంధవ్ సౌండ్ చేయకుండా సైలెంట్ కిల్లర్ అవుతాడని వెంకటేష్ ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. ట్రైలర్, పాటలు భీభత్సమైన హైప్ తేకపోయినా హీరో, దర్శకుడు చేస్తున్న ప్రమోషన్లు, చెబుతున్న విశేషాలు అంచనాలు పెంచుతున్నాయి.
చివరిగా ఆదివారం రిలీజ్ ఎందుకున్న నా సామిరంగ మీద నాగార్జున నమ్మకం మాములుగా లేదు. అతి తక్కువ టైంలో షూటింగ్ పూర్తి చేసుకుని ఇంత పెద్ద క్యాస్టింగ్, కాన్వాస్ ని ఒక కొత్త దర్శకుడి చేతిలో పెట్టడం చిన్న విషయం కాదు. ఈ పండగ మాదే అంటూ పబ్లిసిటీని హోరెత్తిస్తున్నారు. దేనికవే విభిన్నమైన జానర్లు కావడంతో ప్రేక్షకుల పర్సులకు గట్టి చిల్లులు తప్పవు. ఒకవేళ అన్నీ బాగుంటే మాత్రం కనీసం రెండు వారాల పాటు థియేటర్లు జనాలతో కళకళలాడుతూ పండగ శోభను తీసుకొస్తాయి. రెండు వందల కోట్ల దాకా ఈ నాలుగు సినిమాల మీద బిజినెస్ జరిగింది.
This post was last modified on January 11, 2024 4:50 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…