అక్కినేని నాగార్జున కెరీర్లో చాలా ముఖ్యమైన సినిమా.. నా సామి రంగ. 8 ఏళ్ల కిందట వచ్చిన సోగ్గాడే చిన్నినాయన తర్వాత ఆయనకు సరైన విజయమే లేదు. దేవదాస్, బంగార్రాజు లాంటి చిత్రాలు ఓ మోస్తరుగా అడాయి కానీ నాగ్ కోరుకున్న హిట్ అయితే అందించలేదు. కొన్నేళ్లుగా నాగ్ నటించిన సినిమాలన్నీ డిజాస్టర్లే అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నా సామి రంగతో పుంజుకోవాలని నాగ్ గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ఈ చిత్రంపై ఆయన చాలా కాన్ఫిడెంట్ గా కూడా ఉన్నాడు. బుధవారం జరిగిన నా సామిరంగ ప్రి రిలీజ్ ఈవెంట్లో నా కాన్ఫిడెన్స్ స్పష్టంగా కనిపించింది.
సోగ్గాడే చిన్నినాయన టైంలో చెప్పినట్లే.. ఈసారి పండక్కి కొడుతున్నాం అంటూ అక్కినేని అభిమానులకు భరోసా ఇచ్చాడు నాగ్. ఈ సినిమాకి సంబంధించి తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు ఆశీస్సులు కూడా ఉన్నట్లు నాగ్ చెప్పడం విశేషం. ఈ ఏడాది సెప్టెంబర్ 20న ఏఎన్ఆర్ శతజయంతి జరిగిందని.. అప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో ఆయన విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా నా సామిరంగా సినిమా చేయమంటూ తనకు తండ్రి మనసులో చెప్పినట్లు నాగ్ పేర్కొనడం విశేషం. నాగ్ ఈ మాట అనడంతో ఆడిటోరియం దద్దరిల్లింది.
ఇక తన ప్రసంగం చివర్లో సంక్రాంతి సినిమాలన్నిటికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు అక్కినేని హీరో. హీరోగా 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న మహేష్, 75వ చిత్రంతో వస్తున్న మా వెంకీ, చైల్డ్ ఆర్టిస్ట్ గా తనకు పరిచయం ఉన్న తేజ.. అంటూ ఒక్కొక్కరి పేర్లు ప్రస్తావించి వాళ్ళకి నాగ్ ఆల్ ది బెస్ట్ చెప్పడం విశేషం.
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…