Movie News

బాలీవుడ్ వైపు తమన్ అడుగులు

ఇప్పుడున్న జనరేషన్లో అత్యధిక డిమాండ్ ఉన్న తెలుగు సంగీత దర్శకుల్లో తమన్ దే మొదటి స్థానం. దేవిశ్రీ ప్రసాద్ రేసులో ఉన్నాడు కానీ చేస్తున్న ప్రోజెక్టుల సంఖ్యతో పోల్చుకుంటే రెండో స్థానంలో నిలుస్తాడు. పుష్ప, సలార్ లాంటి రెండు మూడు మినహాయించి ఎక్కువ ప్యాన్ ఇండియా సినిమాలు తమన్ చేతిలో ఉన్నాయి. ఇప్పుడు అడుగులు బాలీవుడ్ వైపు వెళ్తున్నాయని ముంబై టాక్. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ దాదాపు ఓకే అయ్యిందని తెలిసింది. తమిళంలోనూ తనేంటో నిరూపించుకున్న తమన్ నెక్స్ట్ బాలీవుడ్ ని టార్గెట్ గా పెట్టుకోవడం విశేషం.

వరుణ్ ధావన్ హీరోగా తేరి రీమేక్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ వెర్షన్ హ్యాండిల్ చేసిన అట్లీ నిర్మాతగా మారి డైరెక్షన్ బాధ్యతలు కలీస్ కి అప్పజెప్పాడు. హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తోంది. వామికా గబ్బి రెండో రెండో కథానాయిక. ఇదే తెలుగులో పవన్ కళ్యాణ్ తో దర్శకుడు హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ గా తీస్తున్న విషయం విదితమే. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ని లాక్ చేసుకున్నారట. గతంలో తమన్ రెండు హిందీ సినిమాలకు కేవలం ఒక్కో పాట కంపోజ్ చేశాడు. అవి గోల్ మాల్ అగైన్, సింబా. పూర్తి స్థాయిలో పని చేయలేదు కాబట్టి కౌంట్ లోకి రావు.

ఇప్పుడీ వరుణ్ ధావన్ మూవీకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సహా మొత్తం తమన్ కే ఇస్తారట. డెబ్యూ కాబట్టి ఖచ్చితంగా బెస్ట్ ఇవ్వడానికి చూస్తాడు. గుంటూరు కారం విడుదల కోసం ఎదురు చూస్తున్న అభిమానులు అందులో పాటలు, బీజీఎమ్ మీద భారీ ఆశలు పెట్టుకున్నారు. గేమ్ ఛేంజర్ రిలీజ్ కూడా ఈ ఏడాది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి శంకర్ కాంబోలో ఎలాంటి ఆల్బమ్ ఇచ్చి ఉంటాడోననే అంచనాలు మెగా ఫాన్స్ లో విపరీతంగా ఉన్నాయి. గత కొంత కాలంగా జోరు తగ్గిన తమన్ కొత్తగా హిందీ మార్కెట్ మీద ఎలాంటి ముద్ర వేస్తాడో చూడాలి.

This post was last modified on January 10, 2024 4:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాలయ్య పుట్టిన రోజు కానుకలు ఇవేనా?

నందమూరి బాలకృష్ణ తన ప్రతి పుట్టిన రోజుకూ అభిమానులకు సినిమాల పరంగా కానుక ఇస్తుంటాడు. అప్పటికి నటిస్తున్న సినిమా నుంచి…

26 minutes ago

కన్నడ నుంచి మరో బిగ్ మూవీ

ఒకప్పుడు కన్నడ సినిమా అంటే రొటీన్ మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆ మాస్ సినిమాలు కూడా ఎక్కువగా తెలుగు, తమిళం…

3 hours ago

ఈ సారి అమరావతికి మోదీ ఎం తెస్తున్నారు?

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…

6 hours ago

పొట్ట తగ్గటానికి ఈ పండ్లు తింటే చాలు

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…

7 hours ago

ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మంత్రులు

ఏపీ మంత్రి వ‌ర్గంలో సీఎం చంద్ర‌బాబు గీస్తున్న ల‌క్ష్మ‌ణ రేఖ‌ల‌కు.. ఆయ‌న ఆదేశాల‌కు కూడా.. పెద్ద‌గా రెస్పాన్స్ ఉండ‌డం లేద‌ని…

7 hours ago

గాయకుడి విమర్శ…రెహమాన్ చెంపపెట్టు సమాధానం

సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…

9 hours ago