Movie News

బాలీవుడ్ వైపు తమన్ అడుగులు

ఇప్పుడున్న జనరేషన్లో అత్యధిక డిమాండ్ ఉన్న తెలుగు సంగీత దర్శకుల్లో తమన్ దే మొదటి స్థానం. దేవిశ్రీ ప్రసాద్ రేసులో ఉన్నాడు కానీ చేస్తున్న ప్రోజెక్టుల సంఖ్యతో పోల్చుకుంటే రెండో స్థానంలో నిలుస్తాడు. పుష్ప, సలార్ లాంటి రెండు మూడు మినహాయించి ఎక్కువ ప్యాన్ ఇండియా సినిమాలు తమన్ చేతిలో ఉన్నాయి. ఇప్పుడు అడుగులు బాలీవుడ్ వైపు వెళ్తున్నాయని ముంబై టాక్. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ దాదాపు ఓకే అయ్యిందని తెలిసింది. తమిళంలోనూ తనేంటో నిరూపించుకున్న తమన్ నెక్స్ట్ బాలీవుడ్ ని టార్గెట్ గా పెట్టుకోవడం విశేషం.

వరుణ్ ధావన్ హీరోగా తేరి రీమేక్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ వెర్షన్ హ్యాండిల్ చేసిన అట్లీ నిర్మాతగా మారి డైరెక్షన్ బాధ్యతలు కలీస్ కి అప్పజెప్పాడు. హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తోంది. వామికా గబ్బి రెండో రెండో కథానాయిక. ఇదే తెలుగులో పవన్ కళ్యాణ్ తో దర్శకుడు హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ గా తీస్తున్న విషయం విదితమే. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ని లాక్ చేసుకున్నారట. గతంలో తమన్ రెండు హిందీ సినిమాలకు కేవలం ఒక్కో పాట కంపోజ్ చేశాడు. అవి గోల్ మాల్ అగైన్, సింబా. పూర్తి స్థాయిలో పని చేయలేదు కాబట్టి కౌంట్ లోకి రావు.

ఇప్పుడీ వరుణ్ ధావన్ మూవీకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సహా మొత్తం తమన్ కే ఇస్తారట. డెబ్యూ కాబట్టి ఖచ్చితంగా బెస్ట్ ఇవ్వడానికి చూస్తాడు. గుంటూరు కారం విడుదల కోసం ఎదురు చూస్తున్న అభిమానులు అందులో పాటలు, బీజీఎమ్ మీద భారీ ఆశలు పెట్టుకున్నారు. గేమ్ ఛేంజర్ రిలీజ్ కూడా ఈ ఏడాది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి శంకర్ కాంబోలో ఎలాంటి ఆల్బమ్ ఇచ్చి ఉంటాడోననే అంచనాలు మెగా ఫాన్స్ లో విపరీతంగా ఉన్నాయి. గత కొంత కాలంగా జోరు తగ్గిన తమన్ కొత్తగా హిందీ మార్కెట్ మీద ఎలాంటి ముద్ర వేస్తాడో చూడాలి.

This post was last modified on January 10, 2024 4:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago