Movie News

అమ్మా నాన్నా అన్నీ మీరే – మహేష్ బాబు

వాయిదాలు, అనుమతులు, టెన్షన్ల మధ్య హైదరాబాద్ నుంచి గుంటూరుకు వేదిక మార్చుకున్న గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఆఘమేఘాల మీద ఏర్పాట్లు చేసి ఫ్యాన్స్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్న వైనం పెద్ద రిలీఫ్. మాములుగా ఇంత పెద్ద ఫంక్షన్ కు కనీసం మూడు రోజులు సమయం ఉంటే తప్ప ఖచ్చితమైన ఫలితాన్ని ఆశించలేం. కానీ ఆర్గనైజ్ చేసిన తీరు విమర్శలకు తావివ్వలేదు. ఈ సందర్భంగా ప్రసంగించిన హీరో మహేష్ బాబు బాగా ఎమోషనల్ అయిపోయి అభిమానుల కంటిని తడి చేశాడు.

స్పీచ్ కన్నా ముందు మహేష్ 25 సంవత్సరాల సినీ ప్రస్థానాన్ని ఏవి రూపంలో చూపించారు. నిజానికి తనకా సంగతి గుర్తులేదట. రాజకుమారుడుకి ఇది సిల్వర్ జూబిలీ ఇయర్. ఆ విషయాన్ని ఆడియోలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. దాన్ని గుర్తు చేస్తూ ప్రతి ఏడాది తన మీద మీ ప్రేమ పెరుగుతోంది కానీ తగ్గడం లేదని, మీకు చేతులెత్తి దండం పెట్టడం తప్ప ఇంకేమి చేయలేనని వెంటనే రెండు చేతులు పైకెత్తి అభివాదం చేయడంతో గ్రౌండ్ ఒక్కసారిగా హర్షధ్వానాలతో హోరెత్తింది. ఇక ఎప్పటికీ అమ్మా నాన్నా అన్నీ మీరేనని చెప్పడంతో ఫ్యాన్స్ ఆనందంతో పరశించిపోయారు.

అతి తక్కువ వ్యవధిలో అన్నయ్య రమేష్ బాబు, తల్లి ఇందిరా దేవి, తండ్రి కృష్ణ గార్లను పోగొట్టుకున్న మహేష్ ఆ సమయంలో చాలా లోటుని అనుభవించాడు. అయినా సరే త్వరగా కోలుకుని తిరిగి సినిమా ప్రపంచంలోకి వచ్చాడు. నాన్న ఇచ్చిన వారసత్వాన్ని నిలబెట్టడమే కానీ అంతకు మించి అనే స్థాయిలో ఎదుగుతున్న మహేష్ వెనుక బలంగా నిలబడింది ఫ్యాన్సే. అందుకే టీజర్ రిలీజ్ కే నిన్న హైదరాబాద్ లో ఏదో ప్రీమియర్ అన్నంత హంగామా చేశారు. జనవరి 12 విడుదల కాబోతున్న గుంటూరు కారంకు కౌంట్ డౌన్ మొదలైపోయింది. అర్ధరాత్రి ఒంటి గంట నుంచే షోలు మొదలవుతున్నాయి.

This post was last modified on January 9, 2024 9:58 pm

Share
Show comments

Recent Posts

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

2 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

3 hours ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

4 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

5 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

6 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

6 hours ago