జనవరి 12 గుంటూరు కారంతో ఒకే రోజు తలపడటం వల్ల థియేటర్ల సమస్యతో పాటు అధిక శాతం ప్రేక్షకులకు చేరుకోలేమని గుర్తించిన హనుమాన్ ముందు రోజు సాయంత్రం ప్రీమియర్లకు పచ్చ జెండా ఊపేసింది. ఈ వార్త నాలుగైదు రోజుల క్రితమే వచ్చినప్పటికీ అధికారిక ప్రకటన కోసం ప్రేక్షకులు ఎదురు చూశారు. ఎట్టకేలకు బుకింగ్స్ మొదలైపోయాయి. మొదటి షో హైదరాబాద్ సంధ్య 70 ఎంఎంలో గురువారం సాయంత్రం 6.15 నిమిషాలకు మొదలుకానుంది. అక్కడి నుంచి అన్ని ప్రధాన కేంద్రాల్లో రాత్రి పది గంటల లోపు సమయానుకూలంగా ప్రదర్శనలు వేయబోతున్నారు.
ఇప్పటిదాకా అమలాపురం, కర్నూలు, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, కాకినాడ, ఏలూరు సంబంధించిన బుకింగ్స్ పెట్టేయగా గంటల వ్యవధిలోనే హౌస్ ఫుల్ కి దగ్గరగా ఉన్నాయి. హనుమాన్ నిర్మాతల ఆలోచన ఈ రకంగా మంచి ఫలితాన్నే ఇస్తోంది. గుంటూరు కారం చూశాక మళ్ళీ ఇంకో సినిమాకు వెళ్లేందుకు టైం లేని మూవీ లవర్స్ హ్యాపీగా ఇప్పుడు ముందు రోజు సాయంత్రమే హనుమాన్ చూసేస్తారు. దానికి తోడు టీమ్ నమ్మకం వ్యక్తం చేస్తున్న స్థాయిలో కంటెంట్ ఉంటే మాత్రం ఆ పాజిటివ్ టాక్ ఎలాగూ సోషల్ మీడియా ద్వారా వెంటనే, ఆపై ఉదయం రివ్యూల రూపంలో వచ్చేస్తుంది.
హీరో ఇమేజ్ కన్నా హనుమంతుడి బ్రాండ్ మీద బుకింగ్స్ జరుగుతున్న హనుమాన్ ప్రమోషన్ల కోసం ప్రశాంత్ వర్మ టీమ్ ఇప్పటికే ముంబై, ఢిల్లీ చుట్టేస్తోంది. పబ్లిసిటీ విషయంలో దూకుడు చూపిస్తున్న తీరు ఓపెనింగ్స్ కి దోహదపడాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి రావడం కొంత మైలేజ్ ఇచ్చినట్టే కనిపిస్తోంది. సరిగ్గా పది రోజుల వ్యవధిలో అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం జరుగుతున్న నేపథ్యంలో ఆ సెంటిమెంట్ సినిమాకు పని చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి మహేష్ మాస్ కన్నా ముందు తేజ సజ్జ హీరోయిజం రిపోర్ట్స్ ముందే వచ్చేస్తాయన్న మాట.
This post was last modified on January 9, 2024 12:19 pm
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…