Movie News

ముందు రోజు ప్రీమియర్లు మంచి ప్లానే

జనవరి 12 గుంటూరు కారంతో ఒకే రోజు తలపడటం వల్ల థియేటర్ల సమస్యతో పాటు అధిక శాతం ప్రేక్షకులకు చేరుకోలేమని గుర్తించిన హనుమాన్ ముందు రోజు సాయంత్రం ప్రీమియర్లకు పచ్చ జెండా ఊపేసింది. ఈ వార్త నాలుగైదు రోజుల క్రితమే వచ్చినప్పటికీ అధికారిక ప్రకటన కోసం ప్రేక్షకులు ఎదురు చూశారు. ఎట్టకేలకు బుకింగ్స్ మొదలైపోయాయి. మొదటి షో హైదరాబాద్ సంధ్య 70 ఎంఎంలో గురువారం సాయంత్రం 6.15 నిమిషాలకు మొదలుకానుంది. అక్కడి నుంచి అన్ని ప్రధాన కేంద్రాల్లో రాత్రి పది గంటల లోపు సమయానుకూలంగా ప్రదర్శనలు వేయబోతున్నారు.

ఇప్పటిదాకా అమలాపురం, కర్నూలు, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, కాకినాడ, ఏలూరు సంబంధించిన బుకింగ్స్ పెట్టేయగా గంటల వ్యవధిలోనే హౌస్ ఫుల్ కి దగ్గరగా ఉన్నాయి. హనుమాన్ నిర్మాతల ఆలోచన ఈ రకంగా మంచి ఫలితాన్నే ఇస్తోంది. గుంటూరు కారం చూశాక మళ్ళీ ఇంకో సినిమాకు వెళ్లేందుకు టైం లేని మూవీ లవర్స్ హ్యాపీగా ఇప్పుడు ముందు రోజు సాయంత్రమే హనుమాన్ చూసేస్తారు. దానికి తోడు టీమ్ నమ్మకం వ్యక్తం చేస్తున్న స్థాయిలో కంటెంట్ ఉంటే మాత్రం ఆ పాజిటివ్ టాక్ ఎలాగూ సోషల్ మీడియా ద్వారా వెంటనే, ఆపై ఉదయం రివ్యూల రూపంలో వచ్చేస్తుంది.

హీరో ఇమేజ్ కన్నా హనుమంతుడి బ్రాండ్ మీద బుకింగ్స్ జరుగుతున్న హనుమాన్ ప్రమోషన్ల కోసం ప్రశాంత్ వర్మ టీమ్ ఇప్పటికే ముంబై, ఢిల్లీ చుట్టేస్తోంది. పబ్లిసిటీ విషయంలో దూకుడు చూపిస్తున్న తీరు ఓపెనింగ్స్ కి దోహదపడాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి రావడం కొంత మైలేజ్ ఇచ్చినట్టే కనిపిస్తోంది. సరిగ్గా పది రోజుల వ్యవధిలో అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం జరుగుతున్న నేపథ్యంలో ఆ సెంటిమెంట్ సినిమాకు పని చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి మహేష్ మాస్ కన్నా ముందు తేజ సజ్జ హీరోయిజం రిపోర్ట్స్ ముందే వచ్చేస్తాయన్న మాట.

Satya

Recent Posts

అయ్యగారి జోరు అదిరింది

పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…

60 minutes ago

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

3 hours ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

3 hours ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

5 hours ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

10 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

11 hours ago