డెవిల్ విడుదలకు ముందు దర్శకుడి మార్పు గురించి ఎంత రచ్చ జరిగిందో చూశాం. తొలుత ప్రకటించిన నవీన్ మేడారం కాకుండా నిర్మాత అభిషేక్ నామానే డైరెక్టర్ కార్డు వేసుకోవడం గురించి గట్టిగానే గుసగుసలు వినిపించాయి. అయితే అనుభవలేమి వల్లే తన చేతుల్లోకి తీసుకోవాల్సి వచ్చిందనే వివరణ ప్రొడ్యూసర్ ఇచ్చారు కానీ అదేమంత హైలైట్ కాలేదు. కట్ చేస్తే డెవిల్ ఫ్లాప్ దిశగా వెళ్తోంది. మొదటి రెండు మూడు రోజులు ప్లస్ న్యూ ఇయర్ సందర్భంగా వసూళ్లు కొంత మెరుగ్గా అనిపించినా చివరికి లాభాల మాటేమో కానీ నష్టాలు ఖాయమనే దిశగా ఫిగర్లు నమోదవుతున్నాయి.
సరే బ్లాక్ బస్టర్ అయ్యుంటే ఎలా ఉండేదో కానీ ఇప్పుడు డెవిల్ గురించి ఎవరూ మాట్లాడ్డం లేదు. నవీన్ మేడారం దీని విషయంలో ఫెయిలైనా వెబ్ సిరీస్ రూపంలో పెద్ద ఊరట దక్కింది. అతనే నిర్మాతగా అతి తక్కువ బడ్జెట్ లో రూపొందిన 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ కి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. దర్శకుడు నవీన్ కానప్పటికీ పర్యవేక్షణ మొత్తం తన ద్వారానే జరిగిందట. ఈటీవీ విన్ లో మొన్నటి నుంచి స్ట్రీమింగ్ అవుతున్న 90స్ కి రివ్యూస్ సైతం పాజిటివ్ గా కనిపిస్తున్నాయి. కుర్రాళ్ళు బాగా కనెక్ట్ అయిపోయి సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు.
దెబ్బకు సెకండ్ సీజన్ కు కావాల్సిన బజ్ వచ్చేయడంతో దాని పనులను వేగవంతం చేశారు. నవీన్ మేడారంకి ఇది పెద్ద ఊరట. ఎందుకంటే హంగామా లేకుండా కేవలం స్కూలు, ఇల్లు రెండే లొకేషన్లతో ఇంత మంచి అవుట్ ఫుట్ వచ్చేలా దర్శకుడు ఆదిత్య హాసన్ ప్రతిభను గుర్తించడం స్థాయిని పెంచేదే. ప్రస్తుతం కొత్త సినిమా కోసం ప్రయత్నాల్లో ఉన్న నవీన్ మేడారం ఒక మీడియం రేంజ్ స్టార్ తో మూవీ ప్లాన్ చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. 90స్ క్రెడిట్ తనదేనని చెప్పలేం కానీ క్రైమ్ రాజ్యమేలుతున్న ఓటిటి ట్రెండ్ లో ఇలాంటి నోస్టాల్జియా ఎంటర్ టైనర్ నిర్మించి హిట్టు కొట్టడం విశేషమే.
This post was last modified on January 7, 2024 8:21 pm
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…