పరిశ్రమలో ఎందరో హీరోలకు లెజెండరీ మ్యుజిషియన్ ఏఆర్ రెహమాన్ తో ఒక్క సినిమా అయినా చేయించుకోవాలని ఉంటుంది. సీనియర్లలో ఆ కోరిక అందరికీ నెరవేరింది. బాలకృష్ణ నిప్పురవ్వకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మొదలైన ఈ సంగీత దిగ్గజ ప్రస్థానం వెంకటేష్ సూపర్ పోలీస్, నాగార్జున రక్షకుడు, రాజశేఖర్ గ్యాంగ్ మాస్టర్, కృష్ణంరాజు పల్నాటి పౌరుషం నుంచి పవన్ కళ్యాణ్ కొమరం పులి, మహేష్ బాబు నాని దాకా చాలా దూరం ప్రయాణించింది. నాగచైతన్య కెరీర్ లో క్లాసిక్ గా నిలిచిపోయిన ఏ మాయ చేసావేకి ఆయన ఇచ్చిన పాటలు ఎప్పటికీ ఎవర్ గ్రీనని చెప్పుకోవాలి.
ఒక్క చిరంజీవితో మాత్రమే రెహమాన్ కాంబో సాధ్యపడలేదు. ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం అబు బాగ్దాద్ గజదొంగ కోసం రెహమాన్ ను తీసుకున్నారు కానీ షూటింగ్ కొంత భాగం అయ్యాక ప్రాజెక్టు అర్థాంతరంగా ఆగిపోయింది. తిరిగి మళ్ళీ ఈ కలయిక సాధ్యపడలేదు. సైరా నరసింహారెడ్డి కోసం అడిగారు కానీ డేట్ల సమస్య వల్ల ఆ అవకాశం కాస్త అమిత్ త్రివేదికి వెళ్లిపోయింది. ఇలా తండ్రి కోరుకుని చేయలేకపోయిన కాంబినేషన్ ఫైనల్ గా రామ్ చరణ్ కి దక్కింది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందబోయే ఆర్సి 16కి ఏఆర్ రెహమాన్ పేరు అఫీషియల్ గా ప్రకటించారు.
ఇది ఎప్పుడో తెలిసిన వార్తే అయినా అధికారికంగా ముద్ర పడింది కాబట్టి ఇంకే డౌట్లు ఉండవు. ఆల్రెడీ రెండు పాటల తాలూకు మ్యూజిక్ సిట్టింగ్స్ అయ్యాయని తెలిసింది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీలో విజయ్ సేతుపతి, శివరాజ్ కుమార్ లాంటి క్రేజీ క్యాస్టింగ్ ని సెట్ చేస్తున్నారని ఆల్రెడీ టాక్ ఉంది. దేవిశ్రీప్రసాద్ తో ఉప్పెన కోసం అద్భుతమైన పాటలు చేయించుకున్న బుచ్చిబాబు ఇప్పుడు చరణ్ కోసం రెహమాన్ నుంచి ఎలాంటి సాంగ్స్ రాబట్టుకుంటాడో చూడాలి. వేసవి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
This post was last modified on January 6, 2024 5:39 pm
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…
కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…
కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…
అయేషా మీరా. ఉమ్మడి ఏపీలో 2007లో ఓ వ్యక్తి కామ దాహానికి బలి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…