Movie News

నైజాం కింగ్ ప్రభాస్

సలార్ సినిమా మీద నైజాం ఏరియాకు ఏకంగా 65 కోట్ల పెట్టుబడి పెట్టేసింది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన మూడు సినిమాలు డిజాస్టర్లు, పైగా సలార్ ట్రైలర్ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ పరిస్థితుల్లో 65 కోట్ల షేర్ రాబట్టడం అంటే ఆషామాషీ విశయం కాదని అన్నారు ట్రేడ్ పండిట్లు. ఈ నేపథ్యంలో సలార్ కు టాక్ కూడా మిక్స్డ్ గా రావడంతో బ్రేక్ ఈవెన్ అసాధ్యం అన్న చర్చ జరిగింది.

కానీ సలార్ ఆ అంచనాలను తలకిందులు చేసింది. బ్రేక్ ఈవెన్ కావడమే కాదు 10 కోట్ల మేర లాభాలు అందించి ఔరా అనిపించింది. డివైడ్ టాక్ తోనే ఈ సినిమా నైజాంలో వసూళ్ల మోత మోగిస్తూ సాగిపోయింది. ఇప్పటికే సలార్ నైజాంలో 120 కోట్ల మేర గ్రాస్, 75 కోట్లకు పైగా షేర్ రాబట్టి బాహుబలి తర్వాత ఈ ఏరియాలో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

సలార్ ప్రభంజనం చూశాక నైజాం కింగ్ ట్యాగ్ ప్రభాస్ కు ఇచ్చేయాల్సిందే అనిపిస్తోంది. బాహుబలితో ప్రభాస్ ఇమేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఎవ్వరు ఊహించని స్థాయికి చేరుకున్నాయి. కానీ బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన ఒక్కో సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వరుసగా మూడు డిజాస్టర్లు ఎదురైనప్పటికీ ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఇంకా చెక్కుచెదరలేదని సలార్ సినిమా రుజువు చేసింది.

నైజాంలో డిస్ట్రిబ్యూటర్ కోరుకున్న అదనపు రేట్లు, షోలు దక్కడం, రిలీజ్ ప్లాన్ పక్కాగా ఉండటం వల్ల బాక్సాఫీస్ దగ్గర సలార్ అంచనాలను మించి పెర్ఫార్మ్ చేసింది. వరల్డ్ వైడ్ ఈ సినిమా వసూళ్లు 700 కోట్ల మైలురాయికి చేరువగా ఉన్నాయి.

This post was last modified on January 5, 2024 11:53 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago