సలార్ సినిమా మీద నైజాం ఏరియాకు ఏకంగా 65 కోట్ల పెట్టుబడి పెట్టేసింది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన మూడు సినిమాలు డిజాస్టర్లు, పైగా సలార్ ట్రైలర్ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ పరిస్థితుల్లో 65 కోట్ల షేర్ రాబట్టడం అంటే ఆషామాషీ విశయం కాదని అన్నారు ట్రేడ్ పండిట్లు. ఈ నేపథ్యంలో సలార్ కు టాక్ కూడా మిక్స్డ్ గా రావడంతో బ్రేక్ ఈవెన్ అసాధ్యం అన్న చర్చ జరిగింది.
కానీ సలార్ ఆ అంచనాలను తలకిందులు చేసింది. బ్రేక్ ఈవెన్ కావడమే కాదు 10 కోట్ల మేర లాభాలు అందించి ఔరా అనిపించింది. డివైడ్ టాక్ తోనే ఈ సినిమా నైజాంలో వసూళ్ల మోత మోగిస్తూ సాగిపోయింది. ఇప్పటికే సలార్ నైజాంలో 120 కోట్ల మేర గ్రాస్, 75 కోట్లకు పైగా షేర్ రాబట్టి బాహుబలి తర్వాత ఈ ఏరియాలో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.
సలార్ ప్రభంజనం చూశాక నైజాం కింగ్ ట్యాగ్ ప్రభాస్ కు ఇచ్చేయాల్సిందే అనిపిస్తోంది. బాహుబలితో ప్రభాస్ ఇమేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఎవ్వరు ఊహించని స్థాయికి చేరుకున్నాయి. కానీ బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన ఒక్కో సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వరుసగా మూడు డిజాస్టర్లు ఎదురైనప్పటికీ ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఇంకా చెక్కుచెదరలేదని సలార్ సినిమా రుజువు చేసింది.
నైజాంలో డిస్ట్రిబ్యూటర్ కోరుకున్న అదనపు రేట్లు, షోలు దక్కడం, రిలీజ్ ప్లాన్ పక్కాగా ఉండటం వల్ల బాక్సాఫీస్ దగ్గర సలార్ అంచనాలను మించి పెర్ఫార్మ్ చేసింది. వరల్డ్ వైడ్ ఈ సినిమా వసూళ్లు 700 కోట్ల మైలురాయికి చేరువగా ఉన్నాయి.
This post was last modified on January 5, 2024 11:53 am
గత ఏడాది సెప్టెంబర్ లో ఆంధ్రకింగ్ తాలూకా రిలీజైనప్పుడు పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది.…
వేలంటైన్ప్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య విడుదలైన చిత్రం.. ఫంకీ. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్ను హీరీగా…
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…