మొత్తానికి సంక్రాంతి సినిమాల పంచాయితీ తెగినట్లే కనిపిస్తోంది. ఐదు సినిమాలకు పండుగ టైంలో థియేటర్లు సర్దుబాటు చేయడం అసాధ్యం కావడంతో చర్చోప చర్చలు, తర్జనభర్జనల అనంతరం ఈగల్ సినిమాను రేసు నుంచి తప్పించారు. ముందు సంక్రాంతి రేసు నుంచి తప్పుకోక తప్పదేమో అనుకున్న హనుమాన్ చివరికి బరిలోనే కొనసాగుతోంది. ఈ మేరకు దిల్ రాజు నేతృత్వంలో సినీ పెద్దలు ప్రకటన చేశారు. అయితే ఈ సందర్భంగా దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు, ఆయన వ్యవహార శైలి కొంత చర్చనీయాంశం అయ్యాయి.
హీరోల రేంజును బట్టి సినిమాల స్థాయిని నిర్దేశించడం.. హనుమాన్ ను చిన్న సినిమాగా పేర్కొంటూ వరుసలో చివర్లో నిలబెట్టడం పట్ల సోషల్ మీడియాలో చాలామంది నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ చిత్రంలో స్టార్ హీరో లేకపోవచ్చు కానీ సినిమాకు బడ్జెట్ అయితే మామూలుగా లేదు. సంక్రాంతి బరిలో ఉన్న మిగతా చిత్రాలకు దీటుగానే నిలిచేలా కనిపిస్తోంది హనుమాన్. కానీ ఈ విషయాన్ని దిల్ రాజు గుర్తించట్లేదు.
మిగతా విషయాలన్నీ పక్కన పెడితే జనవరి 12న హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని మేజర్ సిటీల్లో 90 శాతానికి పైగా స్క్రీన్ లను గుంటూరు కారం చిత్రానికే కేటాయించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. 100 స్క్రీన్లలో కనీసం ఓ 20 అయినా తమ సినిమాకు ఇవ్వాలి కదా అంటూ నిర్మాత ప్రెస్ మీట్ పెట్టి ఆవేదన వ్యక్తం చేయడం తెలిసిందే. హైదరాబాద్ సిటీలో 76 సింగిల్ స్క్రీన్లు ఉంటే 70కి పైగా గుంటూరు కారం తీసుకోవడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశాడు.
ఇదే విషయమై ప్రెస్ మీట్లో దిల్ రాజును విలేకరులు ప్రశ్నించబోతే.. ఆయన సమాధానం దాటవేశాడు. వేరే విషయాలు వద్దు, డీవియేట్ చేయొద్దు.. ఇండస్ట్రీ మంచి కోసం ఆలోచించండి అంటూ పొంతన లేని మాటలు చెప్పి విలేకరుల నోళ్లకు తాళం వేసేశాడు. ఒక నిర్మాత ఆవేదన అర్థం చేసుకోకుండా దిల్ రాజు ఇలా నిరంకుశంగా వ్యవహరించిన పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్ని సినిమాలకు న్యాయం చేస్తాం అంటూ తాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న గుంటూరు కారం చిత్రానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి హనుమాన్ ను ఇలా తొక్కేయడం సబబా అని ప్రశ్నిస్తున్నారు.
This post was last modified on January 5, 2024 11:22 am
కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…
తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…
ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…
ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…
కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…