మొత్తానికి సంక్రాంతి సినిమాల పంచాయితీ తెగినట్లే కనిపిస్తోంది. ఐదు సినిమాలకు పండుగ టైంలో థియేటర్లు సర్దుబాటు చేయడం అసాధ్యం కావడంతో చర్చోప చర్చలు, తర్జనభర్జనల అనంతరం ఈగల్ సినిమాను రేసు నుంచి తప్పించారు. ముందు సంక్రాంతి రేసు నుంచి తప్పుకోక తప్పదేమో అనుకున్న హనుమాన్ చివరికి బరిలోనే కొనసాగుతోంది. ఈ మేరకు దిల్ రాజు నేతృత్వంలో సినీ పెద్దలు ప్రకటన చేశారు. అయితే ఈ సందర్భంగా దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు, ఆయన వ్యవహార శైలి కొంత చర్చనీయాంశం అయ్యాయి.
హీరోల రేంజును బట్టి సినిమాల స్థాయిని నిర్దేశించడం.. హనుమాన్ ను చిన్న సినిమాగా పేర్కొంటూ వరుసలో చివర్లో నిలబెట్టడం పట్ల సోషల్ మీడియాలో చాలామంది నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ చిత్రంలో స్టార్ హీరో లేకపోవచ్చు కానీ సినిమాకు బడ్జెట్ అయితే మామూలుగా లేదు. సంక్రాంతి బరిలో ఉన్న మిగతా చిత్రాలకు దీటుగానే నిలిచేలా కనిపిస్తోంది హనుమాన్. కానీ ఈ విషయాన్ని దిల్ రాజు గుర్తించట్లేదు.
మిగతా విషయాలన్నీ పక్కన పెడితే జనవరి 12న హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని మేజర్ సిటీల్లో 90 శాతానికి పైగా స్క్రీన్ లను గుంటూరు కారం చిత్రానికే కేటాయించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. 100 స్క్రీన్లలో కనీసం ఓ 20 అయినా తమ సినిమాకు ఇవ్వాలి కదా అంటూ నిర్మాత ప్రెస్ మీట్ పెట్టి ఆవేదన వ్యక్తం చేయడం తెలిసిందే. హైదరాబాద్ సిటీలో 76 సింగిల్ స్క్రీన్లు ఉంటే 70కి పైగా గుంటూరు కారం తీసుకోవడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశాడు.
ఇదే విషయమై ప్రెస్ మీట్లో దిల్ రాజును విలేకరులు ప్రశ్నించబోతే.. ఆయన సమాధానం దాటవేశాడు. వేరే విషయాలు వద్దు, డీవియేట్ చేయొద్దు.. ఇండస్ట్రీ మంచి కోసం ఆలోచించండి అంటూ పొంతన లేని మాటలు చెప్పి విలేకరుల నోళ్లకు తాళం వేసేశాడు. ఒక నిర్మాత ఆవేదన అర్థం చేసుకోకుండా దిల్ రాజు ఇలా నిరంకుశంగా వ్యవహరించిన పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్ని సినిమాలకు న్యాయం చేస్తాం అంటూ తాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న గుంటూరు కారం చిత్రానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి హనుమాన్ ను ఇలా తొక్కేయడం సబబా అని ప్రశ్నిస్తున్నారు.
This post was last modified on January 5, 2024 11:22 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…