సంక్రాంతి సినిమాల వ్యవహారం క్రమంగా వేడెక్కుతోంది. తాజాగా హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్ లో చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. నూటా యాభై కోట్లు ఖర్చు పెడితే అది పెద్ద సినిమా ఎలా అవుతుందని, రేపు ప్రేక్షకులు ఏది బాగుందో చూసి నిర్ణయించాక దేని స్థాయి ఎంతో అర్థమవుతుందని చెప్పడం చర్చకు దారి తీస్తోంది. తమకు థియేటర్లలో అన్యాయం జరుగుతోందని, డెబ్భై ఆరు సింగల్ స్క్రీన్లలో పది పదిహేను ఇమ్మన్నా కేవలం అయిదారు మాత్రమే కేటాయించడం అధిపత్యమా లేక చులకన భావమా మీరే చెప్పాలని ప్రశ్నించడం ఆశ్చర్యపరిచింది.
పోటీలో ఉన్న వాటిని పేర్లతో ప్రస్తావించకపోయినా ఆయన అన్నది ఎవరి గురించి అందరికీ అర్థమవుతోంది. జనవరి 12నే గుంటూరు కారంతో తలపడాల్సి రావడం వల్ల హనుమాన్ కి సరిపడా థియేటర్లు దొరకడం లేదన్నది ఓపెన్ సీక్రెట్. అయితే మొదటి రెండు మూడు రోజులు ఇబ్బందిగా ఉన్నా లాంగ్ రన్ లో తమదే నిలబడుతుందన్న ధీమా ఆయన వ్యక్తం కావడం విశేషం. టీమ్ ముందు నుంచి చెబుతున్నది ఇదే. నార్త్ తో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించి ముందే బిజినెస్ చేశాం కాబట్టి ఇప్పుడు వెనుకడుగు వేసే పరిస్థితి లేదనే నిస్సహాయతను వ్యక్తం చేస్తూనే వచ్చారు.
ఈ రెండు మూడు రోజుల్లో జరగబోయే పరిణామాలు కీలకంగా ఉండబోతున్నాయి. ఈగల్ వాయిదా ప్రచారం ప్రపంచమంతా తిరుగుతున్నా నిర్మాతలు మాత్రం నో ఛేంజనే అంటున్నారు. ఇక నా సామిరంగ, సైంధవ్ లు ఎవరి ప్లానింగ్ లో వాళ్ళున్నారు. ఇప్పటికీ పరిశ్రమ పెద్దలు కొందరు ఈ అయిదు సినిమాల క్లాష్ ని వీలైనంత తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారట కానీ సానుకూల సంకేతాలు మాత్రం రావడం లేదు. హనుమాన్ నిర్మాత చేసిన కామెంట్లు క్రమంగా సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ప్రశ్నలు సబబే కానీ సమాధానం దొరకడం కష్టమైన పరిస్థితిలో ఎవరు మాత్రం ఏం చేయగలరు.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…