Movie News

సలార్ 2 కోసం రెండేళ్లు ఆగాల్సిందే

షారుఖ్ ఖాన్ డంకీని మైళ్ళ దూరంలో వెనక్కు నెట్టేసి క్రిస్మస్ విజేతగా నిలిచిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ఇంకా బాక్సాఫీస్ వద్ద స్టడీగానే ఉంది. యూనిట్ అఫీషియల్ గా వదిలిన పోస్టర్ల ప్రకారం ఆరు వందల కోట్ల గ్రాస్ దాటేసింది కానీ ట్రేడ్ మాత్రం దానికన్నా తక్కువే వచ్చిందని ఆఫ్ ది రికార్డ్ అంటోంది. నిజానిజాల సంగతి పక్కనపెడితే సలార్ 2 శౌర్యంగ పర్వంకి కావాల్సిన బజ్ అయితే సృష్టించి పెట్టడంలో సక్సెస్ అయ్యింది. ఇప్పుడు అభిమానుల చూపు సీక్వెల్ మీద ఉంది. నిర్మాత విజయ్ కిరగందూర్ దీని గురించి చాలా స్పష్టమైన ప్రణాళికతో ఉన్నారు.

ఆయనే స్వయంగా చెప్పిన దాని ప్రకారం సలార్ 2 షూటింగ్ ఈ ఏడాది మొదలవుతుంది కానీ కొంత ఆలస్యమయ్యే అవకాశముంది. తమకు సెంటిమెంట్ గా కలిసి వస్తున్న నెలనే టార్గెట్ గా పెట్టుకుని 2025 డిసెంబర్ లో విడుదల చేసేలా ప్లాన్ చేసుకుంటారట. ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ రిలాక్స్ మోడ్ లో ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ తో చేయాల్సిన ప్యాన్ ఇండియా మూవీని ఈ ఏడాదే మొదలుపెట్టాల్సి ఉంది. మైత్రి మూవీ మేకర్స్ వేసవి నుంచి షెడ్యూల్స్ వేయడానికి సిద్ధంగా ఉంది. అయితే స్క్రిప్ట్ లాక్ అయ్యిందా లేదనేది మాత్రం ఇంకా గుట్టుగానే ఉంది.

సలార్ 2 స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టుకున్నారు. మొదటి భాగాన్ని మించిన ఎలివేషన్లు, డ్రామా, రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు ఇందులో ఉంటాయని విజయ్ ఊరిస్తున్నారు. సీజ్ ఫైర్ కేవలం పాత్రలను పరిచయం చేసిన ట్రైలరని, అసలు కథని శౌర్యంగ పర్వంలో చూస్తారని అంటున్నారు. ప్రభాస్ కల్కి, మారుతీ సినిమాలు పూర్తి చేశాక కానీ సలార్ 2లో చేరలేడు. ఇది అయ్యాక సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ ప్రపంచంలో అడుగుపెట్టాలి. హను రాఘవపూడి కూడా సమాంతరంగా చేస్తారనే టాక్ ఉంది కానీ ఇంకో రెండు మూడు నెలలు ఆగితే కానీ అధికారికంగా స్పష్టత వచ్చేలా లేదు.

This post was last modified on January 3, 2024 7:55 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

సేఫ్ గేమ్ ఆడుతున్న ఆర్ఆర్ఆర్ నిర్మాత

ఇండస్ట్రీలో సుదీర్ఘ అనుభవంతో ఎన్నో బ్లాక్ బస్టర్లు చూసిన డివివి దానయ్య సగటు మాములు ప్రేక్షకుడికి బాగా దగ్గరయ్యింది మాత్రం…

58 mins ago

మాజీ ప్ర‌ధాని మ‌న‌వ‌డి కోసం… బ్లూ కార్నర్ నోటీసు!

భార‌త దేశ చ‌రిత్ర‌లో ఇదోక అనూహ్య‌మైన.. అస‌హ్యించుకునే ఘ‌ట‌న‌. ఈ దేశాన్ని పాలించి, రైతుల మ‌న్న‌న‌లు, మ‌హిళ‌ల మ‌న్న‌న‌లు పొందిన…

1 hour ago

జ‌గ‌న్.. నీరో : జేడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ సీఎం జ‌గ‌న్‌.. నీరో చ‌క్ర‌వ‌ర్తిని త‌ల‌పిస్తున్నారంటూ.. సీబీఐ మాజీ డైరెక్ట‌ర్ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ సంచ ల‌న వ్యాఖ్య‌లు చేశారు.…

2 hours ago

ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో ఆర్సీబీ..కప్ కొడతారా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అత్యంత దురదృష్టకరమైన జట్టు పేరు చెప్పమని అడిగితే…ఠపీమని ఆర్సీబీ పేరు చెప్పేస్తారు క్రికెట్…

3 hours ago

సతీసమేతంగా అమెరికాకు చంద్రబాబు

ఏపీలో ఎన్నికల పోరు ముగియడంతో ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. తమ కుటుంబ సభ్యులు,…

3 hours ago

పుష్ప 2 పోటీ – తగ్గనంటున్న శివన్న

ఇంకో మూడు నెలల్లో ఆగస్ట్ 15 విడుదల కాబోతున్న పుష్ప 2 ది రైజ్ విడుదల తేదీలో ఎలాంటి మార్పు…

3 hours ago