ఈ ఏడాది సంక్రాంతి బాక్స్ ఆఫీస్ క్లాష్ గురించి పెద్ద చర్చ నడుస్తుంది కొన్ని రోజులుగా. ఎన్నడూ లేని విధంగా ఈ సంక్రాంతికి ఏకంగా ఐదు క్రేజీ సినిమాలు బరిలో నిలిచాయి. అందులో ఏ ఒక్కటి తగ్గనంటున్నాయి. ఉన్న వాటిలో చిన్న సినిమా అయినా హనుమాన్ ను రేసు నుంచి తప్పించడానికి గట్టి ప్రయత్నమే జరుగుతోంది కానీ ఆ చిత్ర బృందం మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా గుంటూరు కారం రిలీజ్ అయ్యే జనవరి 12న ఆ చిత్రాన్ని కూడా షెడ్యూల్ చేశారు. ఈ విషయంలో మహేష్ ఫ్యాన్స్ కొంచెం ఆగ్రహంతో ఉన్న మాట వాస్తవమే. ఇది చాలా రిస్క్ అంటూ హనుమాన్ టీంను బెదరగొట్టే ప్రయత్నం కూడా జరుగుతోంది. అయితే హనుమాన్ టీంలో అందరూ కూడా తమ సినిమా మీద కాన్ఫిడెన్స్ చూపిస్తూనే, బరిలో ఉన్న మిగతా చిత్రాల గురించి పాజిటివ్ గా మాట్లాడుతున్నారు.
తాజాగా ట్విట్టర్లో ఒక నెటిజన్.. హనుమాన్ హీరో తేజ సజ్జ గురించి ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. 20 ఏళ్ల కిందట తేజ బాల నటుడిగా ఉన్నపుడు మహేష్ బాబు సినిమా యువరాజులో అతడి కొడుకు పాత్ర పోషించిన తేజ.. ఇప్పుడు మహేష్ బాబుకు పోటీగా సినిమాను రిలీజ్ చేస్తున్నాడన్నది ఆ పోస్టు సారాంశం. అయితే దీనిపై తేజ వెంటనే స్పందించాడు.
తాను సూపర్ స్టార్ మహేష్ తో పోటీ పడటం ఏంటని ప్రశ్నించాడు. మహేష్ కు పోటీగా కాకుండా మహేష్ తో పాటుగా వస్తున్నానని పేర్కొన్నాడు. ఈ కామెంట్ సోషల్ మీడియా జనాలను ఆకట్టుకుంది. హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ సైతం చాలా బాగా చెప్పావు అంటూ తేజను అభినందించాడు. ప్రశాంత్ సైతం తాను మహేష్ బాబు ఫ్యాన్ అని, జనవరి 12న తాను గుంటూరు కారం ఫ్యాన్స్ షో చూస్తానని ఇంతకుముందు మీడియాతో చెప్పిన సంగతి తెలిసిందే.
This post was last modified on January 2, 2024 8:32 pm
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…
అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…
వైసీపీ అధినేత జగన్ హయాంలో ఓ కుటుంబం రోడ్డున పడింది. కేవలం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి…
కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలకు, కార్యకర్తలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో పిచ్చి పిచ్చి…