Movie News

మహేష్ తో పోటీ.. కుర్రాడు భలే చెప్పాడు

ఈ ఏడాది సంక్రాంతి బాక్స్ ఆఫీస్ క్లాష్ గురించి పెద్ద చర్చ నడుస్తుంది కొన్ని రోజులుగా. ఎన్నడూ లేని విధంగా ఈ సంక్రాంతికి ఏకంగా ఐదు క్రేజీ సినిమాలు బరిలో నిలిచాయి. అందులో ఏ ఒక్కటి తగ్గనంటున్నాయి. ఉన్న వాటిలో చిన్న సినిమా అయినా హనుమాన్ ను రేసు నుంచి తప్పించడానికి గట్టి ప్రయత్నమే జరుగుతోంది కానీ ఆ చిత్ర బృందం మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా గుంటూరు కారం రిలీజ్ అయ్యే జనవరి 12న ఆ చిత్రాన్ని కూడా షెడ్యూల్ చేశారు. ఈ విషయంలో మహేష్ ఫ్యాన్స్ కొంచెం ఆగ్రహంతో ఉన్న మాట వాస్తవమే. ఇది చాలా రిస్క్ అంటూ హనుమాన్ టీంను బెదరగొట్టే ప్రయత్నం కూడా జరుగుతోంది. అయితే హనుమాన్ టీంలో అందరూ కూడా తమ సినిమా మీద కాన్ఫిడెన్స్ చూపిస్తూనే, బరిలో ఉన్న మిగతా చిత్రాల గురించి పాజిటివ్ గా మాట్లాడుతున్నారు.

తాజాగా ట్విట్టర్లో ఒక నెటిజన్.. హనుమాన్ హీరో తేజ సజ్జ గురించి ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. 20 ఏళ్ల కిందట తేజ బాల నటుడిగా ఉన్నపుడు మహేష్ బాబు సినిమా యువరాజులో అతడి కొడుకు పాత్ర పోషించిన తేజ.. ఇప్పుడు మహేష్ బాబుకు పోటీగా సినిమాను రిలీజ్ చేస్తున్నాడన్నది ఆ పోస్టు సారాంశం. అయితే దీనిపై తేజ వెంటనే స్పందించాడు.

తాను సూపర్ స్టార్ మహేష్ తో పోటీ పడటం ఏంటని ప్రశ్నించాడు. మహేష్ కు పోటీగా కాకుండా మహేష్ తో పాటుగా వస్తున్నానని పేర్కొన్నాడు. ఈ కామెంట్ సోషల్ మీడియా జనాలను ఆకట్టుకుంది. హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ సైతం చాలా బాగా చెప్పావు అంటూ తేజను అభినందించాడు. ప్రశాంత్ సైతం తాను మహేష్ బాబు ఫ్యాన్ అని, జనవరి 12న తాను గుంటూరు కారం ఫ్యాన్స్ షో చూస్తానని ఇంతకుముందు మీడియాతో చెప్పిన సంగతి తెలిసిందే. 

This post was last modified on January 2, 2024 8:32 pm

Share

Recent Posts

తారక్ త్రివిక్రమ్ కోసం రెండు టైటిళ్లు

ఇంకా షూటింగ్ మొదలుకుండానే కేవలం ప్రీ లుక్ పోస్టర్ తో జూనియర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా సోషల్…

19 minutes ago

టాక్సిక్ రేట్ల పెంపుని సమర్దించుకోగలరా

ఆగస్ట్ 26 విడుదల కాబోతున్న టాక్సిక్ ఏపీ తెలంగాణలోనూ పెద్ద ఎత్తున రిలీజ్ కానుంది. బడా సంస్థ పంపిణి హక్కులు…

38 minutes ago

సందీప్.. ‘సిగ్మా’తో ఆ లోటు తీరుతుందా?

సందీప్ కిషన్.. హిట్లు ఫ్లాపుల కంటే ముందుగా గుర్తొచ్చేది ఈ హీరో చేసే ప్రయోగాలు. 16 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నా…

2 hours ago

ఉరి స్థానంలో ఇంజెక్షన్? కోర్టు ఏం చెప్పిందంటే…

భారతదేశంలో మరణశిక్ష అమలు విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. ఉరి తీయడానికి బదులుగా ప్రాణాలు తీసేందుకు తక్కువ నొప్పిని…

3 hours ago

కుటుంబానికో ఎకరా… సాధ్యమేనా కవిత గారూ?

2014 ఎన్నికలకు ముందు అప్పటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన హామీలలో దళితులకు 3 ఎకరాల భూమి హామీ ఒకటి.…

3 hours ago

తెలుగుదేశానికి కాపు కాయడానికి జనసేన పెట్టలేదు…

టీడీపీ నేతృత్వంలో జనసేన, బీజేపీలు కలిసి ఏపీలో ఎన్డీఏ కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలకు ముందు ఈ…

4 hours ago