Movie News

మహేష్ తో పోటీ.. కుర్రాడు భలే చెప్పాడు

ఈ ఏడాది సంక్రాంతి బాక్స్ ఆఫీస్ క్లాష్ గురించి పెద్ద చర్చ నడుస్తుంది కొన్ని రోజులుగా. ఎన్నడూ లేని విధంగా ఈ సంక్రాంతికి ఏకంగా ఐదు క్రేజీ సినిమాలు బరిలో నిలిచాయి. అందులో ఏ ఒక్కటి తగ్గనంటున్నాయి. ఉన్న వాటిలో చిన్న సినిమా అయినా హనుమాన్ ను రేసు నుంచి తప్పించడానికి గట్టి ప్రయత్నమే జరుగుతోంది కానీ ఆ చిత్ర బృందం మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా గుంటూరు కారం రిలీజ్ అయ్యే జనవరి 12న ఆ చిత్రాన్ని కూడా షెడ్యూల్ చేశారు. ఈ విషయంలో మహేష్ ఫ్యాన్స్ కొంచెం ఆగ్రహంతో ఉన్న మాట వాస్తవమే. ఇది చాలా రిస్క్ అంటూ హనుమాన్ టీంను బెదరగొట్టే ప్రయత్నం కూడా జరుగుతోంది. అయితే హనుమాన్ టీంలో అందరూ కూడా తమ సినిమా మీద కాన్ఫిడెన్స్ చూపిస్తూనే, బరిలో ఉన్న మిగతా చిత్రాల గురించి పాజిటివ్ గా మాట్లాడుతున్నారు.

తాజాగా ట్విట్టర్లో ఒక నెటిజన్.. హనుమాన్ హీరో తేజ సజ్జ గురించి ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. 20 ఏళ్ల కిందట తేజ బాల నటుడిగా ఉన్నపుడు మహేష్ బాబు సినిమా యువరాజులో అతడి కొడుకు పాత్ర పోషించిన తేజ.. ఇప్పుడు మహేష్ బాబుకు పోటీగా సినిమాను రిలీజ్ చేస్తున్నాడన్నది ఆ పోస్టు సారాంశం. అయితే దీనిపై తేజ వెంటనే స్పందించాడు.

తాను సూపర్ స్టార్ మహేష్ తో పోటీ పడటం ఏంటని ప్రశ్నించాడు. మహేష్ కు పోటీగా కాకుండా మహేష్ తో పాటుగా వస్తున్నానని పేర్కొన్నాడు. ఈ కామెంట్ సోషల్ మీడియా జనాలను ఆకట్టుకుంది. హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ సైతం చాలా బాగా చెప్పావు అంటూ తేజను అభినందించాడు. ప్రశాంత్ సైతం తాను మహేష్ బాబు ఫ్యాన్ అని, జనవరి 12న తాను గుంటూరు కారం ఫ్యాన్స్ షో చూస్తానని ఇంతకుముందు మీడియాతో చెప్పిన సంగతి తెలిసిందే. 

Satya

Recent Posts

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

40 minutes ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

6 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

7 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

7 hours ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

7 hours ago

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

8 hours ago