ఇంకో పదమూడు రోజుల్లో విడుదల కాబోతున్న గుంటూరు కారం మీద మెల్లగా అంచనాలు ఎగబాకుతున్నాయి. ఓ మై బేబీ టైంలో కొంత నీరసం అనిపించినా కుర్చీ మడత పెట్టి వచ్చాక అభిమానుల్లో ఉన్న సందేహాలన్నీ తీరిపోయాయి. ఇందులో మహేష్ బాబు చేసిన క్యారెక్టర్ ఏంటనే ఉత్సుకత ఫ్యాన్స్ లో విపరీతంగా ఉంది. దానికి సంబంధించిన ఒక ఎక్స్ క్లూజివ్ అప్ డేట్ ఒకటి ఆసక్తికరంగా ఉంది. కథ ప్రకారం మహేష్ చేస్తున్న వెంకట రమణారెడ్డి అలియాస్ రవణ గుంటూరులో మిర్చి వ్యాపారం చేస్తుంటాడు. నలుగురికి సహాయం చేయడమే కాదు ఏదైనా తేడా వస్తే చితకొట్టేయడం అతని స్టైల్.
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ పాత్రను తీర్చిదిద్దిన విధానం ఊహించిన దానికన్నా చాలా మాస్ గా ఉంటుందట. జగపతి బాబుతో తలపడే ఫైట్లు, అనుచరులతో చేసే పోరాటాల గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు. వ్యాపారపరంగా అతనితో వచ్చిన శత్రుత్వానికి, తన స్వంత కుటుంబంలోని రాజకీయ అంశాలకు ముడిపెట్టిన తీరు డిఫరెంట్ గా ఉంటుందని వినిపిస్తోంది. తాతయ్యగా ప్రకాష్ రాజ్, తల్లిగా రమ్యకృష్ణల క్యారెక్టర్లకు సంబంధించిన ట్విస్టులు ఎమోషనల్ గా ఉంటాయని తెలిసింది. మొత్తానికి కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా కంప్లీట్ ఫ్యామిలీ ప్యాకేజ్ గా ఉంటుందట.
హయ్యెస్ట్ ఓపెనింగ్ ని ఆశిస్తున్న అభిమానులకు విపరీతమైన పోటీ అసహనం కలిగిస్తోంది. ఎవరూ వెనక్కు తగ్గకపోవడంతో పండగ కలెక్షన్లలో మహేష్ ఎంత డామినేట్ చేసినా సరే మిగిలిన సినిమాలు తీసుకునే రెవిన్యూని ఆ మేరకు తగ్గించుకోవాల్సి వస్తుంది. అదే జరిగితే గుంటూరు కారం బ్లాక్ బస్టర్ అయినా టాప్ వన్ లేదా టూలో నిలిచే అవకాశాన్ని పోగొట్టుకోవచ్చు. పైగా 12, 13 తేదీల్లో ఇంకో నాలుగు రిలీజులు ఉండటం బాక్సాఫీస్ హీట్ ని పెంచుతోంది. వచ్చే వారం విడుదల కాబోతున్న నాలుగో ఆడియో సింగల్ తో పాటల లాంఛనం పూర్తవుతుంది. జనవరి 6 ట్రైలర్ ప్లస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండొచ్చు.
This post was last modified on December 31, 2023 9:02 pm
రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన మదనపల్లి ఏడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా…
గత ఏడాది సెప్టెంబర్ లో ఆంధ్రకింగ్ తాలూకా రిలీజైనప్పుడు పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది.…
వేలంటైన్ప్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య విడుదలైన చిత్రం.. ఫంకీ. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్ను హీరీగా…
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఇళయరాజా సంగీతం అంటే చెవికోసుకునే సంగీత ప్రియులు దక్షిణాదిన కోట్లల్లో ఉన్నారు. దశాబ్దాలుగా ఆయన పాటలను వింటూ వాళ్లు పొందుతున్న…