ఇంకో పదమూడు రోజుల్లో విడుదల కాబోతున్న గుంటూరు కారం మీద మెల్లగా అంచనాలు ఎగబాకుతున్నాయి. ఓ మై బేబీ టైంలో కొంత నీరసం అనిపించినా కుర్చీ మడత పెట్టి వచ్చాక అభిమానుల్లో ఉన్న సందేహాలన్నీ తీరిపోయాయి. ఇందులో మహేష్ బాబు చేసిన క్యారెక్టర్ ఏంటనే ఉత్సుకత ఫ్యాన్స్ లో విపరీతంగా ఉంది. దానికి సంబంధించిన ఒక ఎక్స్ క్లూజివ్ అప్ డేట్ ఒకటి ఆసక్తికరంగా ఉంది. కథ ప్రకారం మహేష్ చేస్తున్న వెంకట రమణారెడ్డి అలియాస్ రవణ గుంటూరులో మిర్చి వ్యాపారం చేస్తుంటాడు. నలుగురికి సహాయం చేయడమే కాదు ఏదైనా తేడా వస్తే చితకొట్టేయడం అతని స్టైల్.
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ పాత్రను తీర్చిదిద్దిన విధానం ఊహించిన దానికన్నా చాలా మాస్ గా ఉంటుందట. జగపతి బాబుతో తలపడే ఫైట్లు, అనుచరులతో చేసే పోరాటాల గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు. వ్యాపారపరంగా అతనితో వచ్చిన శత్రుత్వానికి, తన స్వంత కుటుంబంలోని రాజకీయ అంశాలకు ముడిపెట్టిన తీరు డిఫరెంట్ గా ఉంటుందని వినిపిస్తోంది. తాతయ్యగా ప్రకాష్ రాజ్, తల్లిగా రమ్యకృష్ణల క్యారెక్టర్లకు సంబంధించిన ట్విస్టులు ఎమోషనల్ గా ఉంటాయని తెలిసింది. మొత్తానికి కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా కంప్లీట్ ఫ్యామిలీ ప్యాకేజ్ గా ఉంటుందట.
హయ్యెస్ట్ ఓపెనింగ్ ని ఆశిస్తున్న అభిమానులకు విపరీతమైన పోటీ అసహనం కలిగిస్తోంది. ఎవరూ వెనక్కు తగ్గకపోవడంతో పండగ కలెక్షన్లలో మహేష్ ఎంత డామినేట్ చేసినా సరే మిగిలిన సినిమాలు తీసుకునే రెవిన్యూని ఆ మేరకు తగ్గించుకోవాల్సి వస్తుంది. అదే జరిగితే గుంటూరు కారం బ్లాక్ బస్టర్ అయినా టాప్ వన్ లేదా టూలో నిలిచే అవకాశాన్ని పోగొట్టుకోవచ్చు. పైగా 12, 13 తేదీల్లో ఇంకో నాలుగు రిలీజులు ఉండటం బాక్సాఫీస్ హీట్ ని పెంచుతోంది. వచ్చే వారం విడుదల కాబోతున్న నాలుగో ఆడియో సింగల్ తో పాటల లాంఛనం పూర్తవుతుంది. జనవరి 6 ట్రైలర్ ప్లస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండొచ్చు.
This post was last modified on December 31, 2023 9:02 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…