ఇంకో పదమూడు రోజుల్లో విడుదల కాబోతున్న గుంటూరు కారం మీద మెల్లగా అంచనాలు ఎగబాకుతున్నాయి. ఓ మై బేబీ టైంలో కొంత నీరసం అనిపించినా కుర్చీ మడత పెట్టి వచ్చాక అభిమానుల్లో ఉన్న సందేహాలన్నీ తీరిపోయాయి. ఇందులో మహేష్ బాబు చేసిన క్యారెక్టర్ ఏంటనే ఉత్సుకత ఫ్యాన్స్ లో విపరీతంగా ఉంది. దానికి సంబంధించిన ఒక ఎక్స్ క్లూజివ్ అప్ డేట్ ఒకటి ఆసక్తికరంగా ఉంది. కథ ప్రకారం మహేష్ చేస్తున్న వెంకట రమణారెడ్డి అలియాస్ రవణ గుంటూరులో మిర్చి వ్యాపారం చేస్తుంటాడు. నలుగురికి సహాయం చేయడమే కాదు ఏదైనా తేడా వస్తే చితకొట్టేయడం అతని స్టైల్.
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ పాత్రను తీర్చిదిద్దిన విధానం ఊహించిన దానికన్నా చాలా మాస్ గా ఉంటుందట. జగపతి బాబుతో తలపడే ఫైట్లు, అనుచరులతో చేసే పోరాటాల గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు. వ్యాపారపరంగా అతనితో వచ్చిన శత్రుత్వానికి, తన స్వంత కుటుంబంలోని రాజకీయ అంశాలకు ముడిపెట్టిన తీరు డిఫరెంట్ గా ఉంటుందని వినిపిస్తోంది. తాతయ్యగా ప్రకాష్ రాజ్, తల్లిగా రమ్యకృష్ణల క్యారెక్టర్లకు సంబంధించిన ట్విస్టులు ఎమోషనల్ గా ఉంటాయని తెలిసింది. మొత్తానికి కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా కంప్లీట్ ఫ్యామిలీ ప్యాకేజ్ గా ఉంటుందట.
హయ్యెస్ట్ ఓపెనింగ్ ని ఆశిస్తున్న అభిమానులకు విపరీతమైన పోటీ అసహనం కలిగిస్తోంది. ఎవరూ వెనక్కు తగ్గకపోవడంతో పండగ కలెక్షన్లలో మహేష్ ఎంత డామినేట్ చేసినా సరే మిగిలిన సినిమాలు తీసుకునే రెవిన్యూని ఆ మేరకు తగ్గించుకోవాల్సి వస్తుంది. అదే జరిగితే గుంటూరు కారం బ్లాక్ బస్టర్ అయినా టాప్ వన్ లేదా టూలో నిలిచే అవకాశాన్ని పోగొట్టుకోవచ్చు. పైగా 12, 13 తేదీల్లో ఇంకో నాలుగు రిలీజులు ఉండటం బాక్సాఫీస్ హీట్ ని పెంచుతోంది. వచ్చే వారం విడుదల కాబోతున్న నాలుగో ఆడియో సింగల్ తో పాటల లాంఛనం పూర్తవుతుంది. జనవరి 6 ట్రైలర్ ప్లస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండొచ్చు.
This post was last modified on December 31, 2023 9:02 pm
ఇంకో పద్దెనిమిది రోజుల్లో హిట్ 3 ది థర్డ్ కేస్ విడుదల కానుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 2…
తెలుగు రాష్ట్రాలు సత్తా చాటుతున్నాయి. వృద్ధి రేటులో ఇప్పటికే గణనీయ వృద్ధిని సాధించిన తెలుగు రాష్ట్రాలు తాజాగా ద్రవ్యోల్బణం (Inflation)…
ఈమధ్య AI టెక్నాలజీతో హాట్ టాపిక్ గా నిలిచిన చైనా టారిఫ్ వార్ తో కూడా అమెరికాతో పోటీ పడడం…
తెలుగులో ఒకప్పుడు వెలుగు వెలిగిన నిర్మాతలు చాలామంది కనుమరుగైపోయారు. కానీ అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి కొద్ది మంది…
అగ్రరాజ్యం అమెరికా కొత్తగా సుంకాల పెంపు కారణంగా ఏపీలో ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం పడినా... కూటమి సర్కారు తీసుకున్న…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తో కలిసి…