Movie News

డబ్బింగ్ సినిమాలకు నో ఎంట్రీ బోర్డు

వాతావరణం చూస్తుంటే సంక్రాంతికి డబ్బింగ్ సినిమాలకు నో ఎంట్రీ బోర్డు పెట్టక తప్పేలా లేదని ఇండస్ట్రీ టాక్. స్ట్రెయిట్ చిత్రాలకే సరిపడా స్క్రీన్లు లేక డిస్ట్రిబ్యూటర్లు కిందా మీద పడుతున్న తరుణంలో కొత్తగా కెప్టెన్ మిల్లర్, అయలన్ లను నెత్తి మీద పెడితే భరించలేమని బయ్యర్లు తెగేసి చెబుతున్నారట. దీని వల్ల ఈ రెండు ప్యాన్ ఇండియా మూవీస్ కి టాలీవుడ్ రిలీజ్ ఆలస్యమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఓ వారం గ్యాప్ తర్వాత వెసులుబాటు వచ్చేలా చూస్తామని అంటున్నారు. ఫిలిం ఛాంబర్ ఈ విషయంగా చొరవ తీసుకోలేదు కానీ పరిస్థితులే వీటికి దారి తీస్తున్నాయి.

ఒకవేళ ఇది జరిగితే మాత్రం మొదటిసారి కీలకమైన సీజన్ లో తమిళ సినిమాలను నిలువరించిన ఘనత దక్కుతుంది. ఇక్కడ ట్విస్టు ఏంటంటే గుంటూరు కారం, హనుమాన్ లు వస్తున్న జనవరి 12నే కెప్టెన్ మిల్లర్, అయలన్ లను షెడ్యూల్ చేశారు. ఒకటే రోజు నాలుగు రిలీజులంటే వాటిని అకామడేట్ చేయడం కష్టం. ఇప్పటికీ ప్రశాంత్ వర్మ తమకు బెదిరింపులు వస్తున్నాయని, సెన్సార్ కు అడ్డు పడుతున్నారని సంచలన ఆరోపణలు చేసి కొత్త చర్చని లేవనెత్తారు. ఈ నేపథ్యంలో ధనుష్, శివ కార్తికేయన్ ఇలా పక్క హీరోలకు ఎవరు మద్దతు ఇచ్చినా అది నైతికత కాదు.

కథ ఇక్కడితో అయిపోలేదు. విజయ్ సేతుపతి-కత్రినా కైఫ్ ల హిందీ అనువాదం మెర్రి క్రిస్మస్ సైతం జనవరి 12నే వస్తోంది. దీనికి దక్షిణాది రాష్ట్రాల్లో థియేటర్లు  దొరక్కపోయినా ఇబ్బంది లేదు. ఎందుకంటే బాలీవుడ్ మార్కెట్ ని మాత్రమే ఎక్కువ టార్గెట్ చేసుకుంది కాబట్టి నష్టపోయేది ఉండదు. మహా అయితే ఏపీ తెలంగాణ మల్టీప్లెక్సుల్లో సింగల్ డిజిట్ షోలు తప్ప ఇంకేమి దొరకదు. గుంటూరు కారం, సైంధవ్‌, ఈగల్, హనుమాన్, నా సామిరంగలకు సరిపడా షోలు ప్లాన్ చేయడానికే తలప్రాణం తోకకొస్తున్న నేపథ్యంలో పక్క భాషలకు నో ఎంట్రీ బోర్డు పెట్టడం ఖచ్చితంగా అవసరమే. 

Satya

Recent Posts

అయ్యగారి జోరు అదిరింది

పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…

28 minutes ago

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

2 hours ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

3 hours ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

4 hours ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

10 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

10 hours ago