Movie News

డబ్బింగ్ సినిమాలకు నో ఎంట్రీ బోర్డు

వాతావరణం చూస్తుంటే సంక్రాంతికి డబ్బింగ్ సినిమాలకు నో ఎంట్రీ బోర్డు పెట్టక తప్పేలా లేదని ఇండస్ట్రీ టాక్. స్ట్రెయిట్ చిత్రాలకే సరిపడా స్క్రీన్లు లేక డిస్ట్రిబ్యూటర్లు కిందా మీద పడుతున్న తరుణంలో కొత్తగా కెప్టెన్ మిల్లర్, అయలన్ లను నెత్తి మీద పెడితే భరించలేమని బయ్యర్లు తెగేసి చెబుతున్నారట. దీని వల్ల ఈ రెండు ప్యాన్ ఇండియా మూవీస్ కి టాలీవుడ్ రిలీజ్ ఆలస్యమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఓ వారం గ్యాప్ తర్వాత వెసులుబాటు వచ్చేలా చూస్తామని అంటున్నారు. ఫిలిం ఛాంబర్ ఈ విషయంగా చొరవ తీసుకోలేదు కానీ పరిస్థితులే వీటికి దారి తీస్తున్నాయి.

ఒకవేళ ఇది జరిగితే మాత్రం మొదటిసారి కీలకమైన సీజన్ లో తమిళ సినిమాలను నిలువరించిన ఘనత దక్కుతుంది. ఇక్కడ ట్విస్టు ఏంటంటే గుంటూరు కారం, హనుమాన్ లు వస్తున్న జనవరి 12నే కెప్టెన్ మిల్లర్, అయలన్ లను షెడ్యూల్ చేశారు. ఒకటే రోజు నాలుగు రిలీజులంటే వాటిని అకామడేట్ చేయడం కష్టం. ఇప్పటికీ ప్రశాంత్ వర్మ తమకు బెదిరింపులు వస్తున్నాయని, సెన్సార్ కు అడ్డు పడుతున్నారని సంచలన ఆరోపణలు చేసి కొత్త చర్చని లేవనెత్తారు. ఈ నేపథ్యంలో ధనుష్, శివ కార్తికేయన్ ఇలా పక్క హీరోలకు ఎవరు మద్దతు ఇచ్చినా అది నైతికత కాదు.

కథ ఇక్కడితో అయిపోలేదు. విజయ్ సేతుపతి-కత్రినా కైఫ్ ల హిందీ అనువాదం మెర్రి క్రిస్మస్ సైతం జనవరి 12నే వస్తోంది. దీనికి దక్షిణాది రాష్ట్రాల్లో థియేటర్లు  దొరక్కపోయినా ఇబ్బంది లేదు. ఎందుకంటే బాలీవుడ్ మార్కెట్ ని మాత్రమే ఎక్కువ టార్గెట్ చేసుకుంది కాబట్టి నష్టపోయేది ఉండదు. మహా అయితే ఏపీ తెలంగాణ మల్టీప్లెక్సుల్లో సింగల్ డిజిట్ షోలు తప్ప ఇంకేమి దొరకదు. గుంటూరు కారం, సైంధవ్‌, ఈగల్, హనుమాన్, నా సామిరంగలకు సరిపడా షోలు ప్లాన్ చేయడానికే తలప్రాణం తోకకొస్తున్న నేపథ్యంలో పక్క భాషలకు నో ఎంట్రీ బోర్డు పెట్టడం ఖచ్చితంగా అవసరమే. 

This post was last modified on December 31, 2023 8:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేశాడు: చిరంజీవి

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు ఆయన పెద్ద అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి దంపతులు…

2 hours ago

వైరల్ వీడియో… గోరంట్ల మాధవ్ ఏం చేశారంటే?

వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో…

2 hours ago

పోలీసులను వాచ్ మెన్ లతో పోల్చిన జగన్

ఆ పోలీసు అధికారులందరికీ చెబుతున్నా…వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని బట్టలూడదీసి నిలబెడతా అంటూ మాజీ సీఎం జగన్ చేసిన…

3 hours ago

బ్రేకింగ్ : CSK కెప్టెన్ గా ధోనీ.. ఎందుకంటే..!

ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ మరోసారి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రుతురాజ్ గైక్వాడ్‌కు…

3 hours ago

ఏపీలో నోటికి పని చెప్పడం ఇకపై కుదరదు

నిజమే… నిన్నటిదాకా ఏపీలో ఎవరిపై ఎవరైనా నోరు పారేసుకున్నారు. అసలు అవతలి వ్యక్తులు తమకు సంబంధించిన వారా? లేదా? అన్న…

3 hours ago

వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్టు

వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్టు అయ్యారు. ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో…

4 hours ago