అనుకున్నదే అయింది. కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్నదే నిజమైంది. మన ప్రభాస్ చేయబోతున్న తొలి బాలీవుడ్ మూవీ ‘ఆది పురుష్’లో విలన్గా సైఫ్ అలీ ఖాన్ ఖరారయ్యాడు. ప్రభాస్ ఇందులో రాముడి పాత్రను చేయనుండగా.. అతణ్ని ఢీకొట్టే రావణాసురుడి పాత్రలో సైఫ్ కనిపించనున్నాడు. ఆ పాత్ర పేరు లంకేష్ అని కూడా వెల్లడించారు.
ఐతే ప్రభాస్కు సైఫ్ ఎంతమాత్రం దీటైన విలన్ కాదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. హిందీ ప్రేక్షకులే ఈ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆరడుగుల రెండంగులాల ఎత్తుతో చాలా మ్యాన్లీగా కనిపిస్తాడు ప్రభాస్. ఆకారం విషయంలో అతడి ముందు సైఫ్ కచ్చితంగా తేలిపోతాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రావణాసురుడి పాత్ర అనగానే క్రూరంగా కనిపించే, రౌద్ర రసాన్ని బాగా పలికించగల, ఓ భారీకాయుడిని ఊహించుకుంటారు జనాలు. సైఫ్లో ఆ లక్షణాలు ఎవరికీ కనిపించడం లేదు. సైఫ్ నటుడిగా తనేంటో రుజువు చేసుకున్నా.. కొన్ని అద్భుతమైన పాత్రలు చేసి మెప్పించినా.. రావణాసురుడి పాత్రకు మాత్రం అతను సూట్ కాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కొందరు బాలీవుడ్ సినీ విశ్లేషకులే సైఫ్ ఎంపిక పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ప్రభాస్ హీరోగా ‘ఆదిపురుష్’ అనౌన్స్ చేసినపుడున్న ఎగ్జైట్మెంట్ సైఫ్ను విలన్ పాత్రకు ఎంపిక చేసినపుడు కనిపించడం లేదు. ఈ పాత్రలో ఏ అక్షయ్ కుమార్ లాంటి వాళ్లో అయితే బాగుండేదని.. ప్రభాస్కు దీటుగా ఉండేవాడని అంటున్నారు.
ఐతే సౌత్ నుంచి వచ్చి నార్త్లో హవా సాగిస్తున్న ప్రభాస్ విషయంలో బాలీవుడ్ స్టార్లు ఇప్పటికే అసూయతో ఉన్నారు. అలాంటిది ఇప్పుడు అతను రాముడిగా నటించే సినిమాలో తాము విలన్ పాత్ర చేయడమేంటని వాళ్లు వెనుకంజ వేసి ఉండొచ్చు. దీంతో సైఫ్తో సర్దుకుపోతున్నట్లున్నారు.
This post was last modified on September 3, 2020 2:43 pm
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…