అనుకున్నదే అయింది. కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్నదే నిజమైంది. మన ప్రభాస్ చేయబోతున్న తొలి బాలీవుడ్ మూవీ ‘ఆది పురుష్’లో విలన్గా సైఫ్ అలీ ఖాన్ ఖరారయ్యాడు. ప్రభాస్ ఇందులో రాముడి పాత్రను చేయనుండగా.. అతణ్ని ఢీకొట్టే రావణాసురుడి పాత్రలో సైఫ్ కనిపించనున్నాడు. ఆ పాత్ర పేరు లంకేష్ అని కూడా వెల్లడించారు.
ఐతే ప్రభాస్కు సైఫ్ ఎంతమాత్రం దీటైన విలన్ కాదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. హిందీ ప్రేక్షకులే ఈ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆరడుగుల రెండంగులాల ఎత్తుతో చాలా మ్యాన్లీగా కనిపిస్తాడు ప్రభాస్. ఆకారం విషయంలో అతడి ముందు సైఫ్ కచ్చితంగా తేలిపోతాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రావణాసురుడి పాత్ర అనగానే క్రూరంగా కనిపించే, రౌద్ర రసాన్ని బాగా పలికించగల, ఓ భారీకాయుడిని ఊహించుకుంటారు జనాలు. సైఫ్లో ఆ లక్షణాలు ఎవరికీ కనిపించడం లేదు. సైఫ్ నటుడిగా తనేంటో రుజువు చేసుకున్నా.. కొన్ని అద్భుతమైన పాత్రలు చేసి మెప్పించినా.. రావణాసురుడి పాత్రకు మాత్రం అతను సూట్ కాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కొందరు బాలీవుడ్ సినీ విశ్లేషకులే సైఫ్ ఎంపిక పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ప్రభాస్ హీరోగా ‘ఆదిపురుష్’ అనౌన్స్ చేసినపుడున్న ఎగ్జైట్మెంట్ సైఫ్ను విలన్ పాత్రకు ఎంపిక చేసినపుడు కనిపించడం లేదు. ఈ పాత్రలో ఏ అక్షయ్ కుమార్ లాంటి వాళ్లో అయితే బాగుండేదని.. ప్రభాస్కు దీటుగా ఉండేవాడని అంటున్నారు.
ఐతే సౌత్ నుంచి వచ్చి నార్త్లో హవా సాగిస్తున్న ప్రభాస్ విషయంలో బాలీవుడ్ స్టార్లు ఇప్పటికే అసూయతో ఉన్నారు. అలాంటిది ఇప్పుడు అతను రాముడిగా నటించే సినిమాలో తాము విలన్ పాత్ర చేయడమేంటని వాళ్లు వెనుకంజ వేసి ఉండొచ్చు. దీంతో సైఫ్తో సర్దుకుపోతున్నట్లున్నారు.
This post was last modified on September 3, 2020 2:43 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…