అనుకున్నదే అయింది. కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్నదే నిజమైంది. మన ప్రభాస్ చేయబోతున్న తొలి బాలీవుడ్ మూవీ ‘ఆది పురుష్’లో విలన్గా సైఫ్ అలీ ఖాన్ ఖరారయ్యాడు. ప్రభాస్ ఇందులో రాముడి పాత్రను చేయనుండగా.. అతణ్ని ఢీకొట్టే రావణాసురుడి పాత్రలో సైఫ్ కనిపించనున్నాడు. ఆ పాత్ర పేరు లంకేష్ అని కూడా వెల్లడించారు.
ఐతే ప్రభాస్కు సైఫ్ ఎంతమాత్రం దీటైన విలన్ కాదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. హిందీ ప్రేక్షకులే ఈ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆరడుగుల రెండంగులాల ఎత్తుతో చాలా మ్యాన్లీగా కనిపిస్తాడు ప్రభాస్. ఆకారం విషయంలో అతడి ముందు సైఫ్ కచ్చితంగా తేలిపోతాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రావణాసురుడి పాత్ర అనగానే క్రూరంగా కనిపించే, రౌద్ర రసాన్ని బాగా పలికించగల, ఓ భారీకాయుడిని ఊహించుకుంటారు జనాలు. సైఫ్లో ఆ లక్షణాలు ఎవరికీ కనిపించడం లేదు. సైఫ్ నటుడిగా తనేంటో రుజువు చేసుకున్నా.. కొన్ని అద్భుతమైన పాత్రలు చేసి మెప్పించినా.. రావణాసురుడి పాత్రకు మాత్రం అతను సూట్ కాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కొందరు బాలీవుడ్ సినీ విశ్లేషకులే సైఫ్ ఎంపిక పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ప్రభాస్ హీరోగా ‘ఆదిపురుష్’ అనౌన్స్ చేసినపుడున్న ఎగ్జైట్మెంట్ సైఫ్ను విలన్ పాత్రకు ఎంపిక చేసినపుడు కనిపించడం లేదు. ఈ పాత్రలో ఏ అక్షయ్ కుమార్ లాంటి వాళ్లో అయితే బాగుండేదని.. ప్రభాస్కు దీటుగా ఉండేవాడని అంటున్నారు.
ఐతే సౌత్ నుంచి వచ్చి నార్త్లో హవా సాగిస్తున్న ప్రభాస్ విషయంలో బాలీవుడ్ స్టార్లు ఇప్పటికే అసూయతో ఉన్నారు. అలాంటిది ఇప్పుడు అతను రాముడిగా నటించే సినిమాలో తాము విలన్ పాత్ర చేయడమేంటని వాళ్లు వెనుకంజ వేసి ఉండొచ్చు. దీంతో సైఫ్తో సర్దుకుపోతున్నట్లున్నారు.
This post was last modified on September 3, 2020 2:43 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…