అనుకున్నదే అయింది. కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్నదే నిజమైంది. మన ప్రభాస్ చేయబోతున్న తొలి బాలీవుడ్ మూవీ ‘ఆది పురుష్’లో విలన్గా సైఫ్ అలీ ఖాన్ ఖరారయ్యాడు. ప్రభాస్ ఇందులో రాముడి పాత్రను చేయనుండగా.. అతణ్ని ఢీకొట్టే రావణాసురుడి పాత్రలో సైఫ్ కనిపించనున్నాడు. ఆ పాత్ర పేరు లంకేష్ అని కూడా వెల్లడించారు.
ఐతే ప్రభాస్కు సైఫ్ ఎంతమాత్రం దీటైన విలన్ కాదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. హిందీ ప్రేక్షకులే ఈ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆరడుగుల రెండంగులాల ఎత్తుతో చాలా మ్యాన్లీగా కనిపిస్తాడు ప్రభాస్. ఆకారం విషయంలో అతడి ముందు సైఫ్ కచ్చితంగా తేలిపోతాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రావణాసురుడి పాత్ర అనగానే క్రూరంగా కనిపించే, రౌద్ర రసాన్ని బాగా పలికించగల, ఓ భారీకాయుడిని ఊహించుకుంటారు జనాలు. సైఫ్లో ఆ లక్షణాలు ఎవరికీ కనిపించడం లేదు. సైఫ్ నటుడిగా తనేంటో రుజువు చేసుకున్నా.. కొన్ని అద్భుతమైన పాత్రలు చేసి మెప్పించినా.. రావణాసురుడి పాత్రకు మాత్రం అతను సూట్ కాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కొందరు బాలీవుడ్ సినీ విశ్లేషకులే సైఫ్ ఎంపిక పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ప్రభాస్ హీరోగా ‘ఆదిపురుష్’ అనౌన్స్ చేసినపుడున్న ఎగ్జైట్మెంట్ సైఫ్ను విలన్ పాత్రకు ఎంపిక చేసినపుడు కనిపించడం లేదు. ఈ పాత్రలో ఏ అక్షయ్ కుమార్ లాంటి వాళ్లో అయితే బాగుండేదని.. ప్రభాస్కు దీటుగా ఉండేవాడని అంటున్నారు.
ఐతే సౌత్ నుంచి వచ్చి నార్త్లో హవా సాగిస్తున్న ప్రభాస్ విషయంలో బాలీవుడ్ స్టార్లు ఇప్పటికే అసూయతో ఉన్నారు. అలాంటిది ఇప్పుడు అతను రాముడిగా నటించే సినిమాలో తాము విలన్ పాత్ర చేయడమేంటని వాళ్లు వెనుకంజ వేసి ఉండొచ్చు. దీంతో సైఫ్తో సర్దుకుపోతున్నట్లున్నారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయి ఒక ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఏప్రిల్…
కొన్ని డిజాస్టర్లు ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంటాయి. అందులో పనిచేసిన వాళ్లందరినీ జీవిత కాల చేదు జ్ఞాపకాలుగా మారిపోతుంటాయి. ఆ సినిమాల…
మా ఇంటి బంగారం సినిమా విజయంతో సంబరాల్లో ఉన్న సమంత అభిమానులకు మరో శుభవార్త అందింది. సినిమా సక్సెస్ మీట్…
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ టూర్లో ఊహించని పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. శుక్రవారం ఐర్లాండ్తో జరిగే టీ20 మ్యాచ్తో…
విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల తేదీ ఎప్పుడో ఖరారు చేసుకుంది. అధికారిక ప్రకటన…
రీసెంట్ గా జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో జరిగిన ఒక చిన్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే…