తాజాగా విడుదలైన డెవిల్ కు హీరో కళ్యాణ్ రామ్ సీక్వెల్ ప్రకటించేయడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. సాయంత్రం చిన్న సక్సెస్ మీట్ లాంటిది పెట్టుకున్న టీమ్ పరస్పరం కేకులు తినిపించుకున్నాక మంచి జోష్ ఉన్న హీరో అనౌన్స్ మెంట్ ఇచ్చేశాడు. అయితే ఇంకా బాక్సాఫీస్ ఫలితం తేలలేదు. రివ్యూలు మిశ్రమంగా వచ్చాయి. పబ్లిక్ టాక్ కూడా డివైడ్ గానే ఉంది. కానీ గత ఏడాది బింబిసారకు అలా జరగలేదు. మార్నింగ్ షో కావడం ఆలస్యం బాగుందనే మాట బయటికి వచ్చింది. ఫలితంగా ఈవెనింగ్ షోల నుంచే హౌస్ ఫుల్స్ పడి క్రమంగా స్ట్రాంగ్ అవుతూ వెళ్ళింది.
ఇప్పుడు డెవిల్ కి అలాగే జరిగి ఉంటే పార్ట్ టూకి న్యాయం జరుగుతుంది. అసలే దర్శకుడి ఇష్యూ మీద చర్చల్లో నలిగింది. మొదట ప్రాజెక్టు టేకప్ చేసిన నవీన్ మేడారం సినిమా ఎలా ఉందంటూ అభిప్రాయాలు అడుగుతూ సోషల్ మీడియాలో ట్వీట్లు పెట్టాడు. ఇంకో వైపు డైరెక్టర్ చైర్ తీసుకున్న నిర్మాత అభిషేక్ నామా ఇంత అనుభవమున్న నేను తీయలేనా అంటూ లాజికల్ గా సమాధానం చెప్పి విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఫైనల్ గా తీసింది ఆయనైనా లేక నవీనైనా ప్రెజెంటేషన్ లోని అనుభవ లేమి స్పష్టంగా కనిపించింది. ఫైనల్ రన్ అయ్యాకే హిట్టో ఫ్లాపో తేలుతుంది.
నిజానికి ఫ్యాన్స్ డిమాండ్ చేస్తోంది బింబిసార 2ని. కళ్యాణ్ రామ్ ఖచ్చితంగా ఉంటుందని చెబుతున్నాడు కానీ ఎప్పుడు ఎవరితో అనేది తేల్చడం లేదు. మొదటి భాగం తీసిన వశిష్ట చిరంజీవి విశ్వంభరకు వెళ్లిపోవడంతో మరో ఆప్షన్ చూసుకోవాల్సి ఉంది. అలాంటప్పుడు దీని సంగతి చెబితే బాగుంటుంది కానీ ఇంకా రిజల్ట్ రాని డెవిల్ మీద అంత కాన్ఫిడెన్స్ తో రెండో భాగం ప్రకటించడం ఒకరకంగా పొరపాటేనని ఫ్యాన్స్ అభిప్రాయం. కొనసాగంపు మీద ఆసక్తి రావాలంటే బ్లాక్ బస్టర్ల విషయంలోనే అది జరుగుతుంది. అయినా కళ్యాణ్ రామ్ ఇంకొద్ది రోజులు ఆగి చెప్పి ఉంటే బాగుండేదేమో.
This post was last modified on December 29, 2023 10:16 pm
కొందరు నటులు తరచుగా సినిమాల్లో కనిపిస్తుంటారు. చాలా ఫెమిలియర్గా అనిపిస్తారు. కానీ ఆ నటుల పేరేంటో కూడా జనాలకు గుర్తుండదు.…
చారిత్రక నేపథ్యం ఉన్న కథలను, భారీ బడ్జెట్లలో, పాన్ ఇండియా స్థాయిలో తీసే ధైర్యం దర్శక నిర్మాతల్లో పెంచిన ఘనత…
సినిమాలకు టైటిళ్లు పెట్టడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలే వేరు. స్టార్ హీరోల సినిమాలకు సైతం, క్లాస్గా, కొంచెం పొయెటిగ్గా, ఫ్యామిలీ…
సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి తోడు చరణ్కు…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. ఈ కల్తీ వ్యవహారంపై విచారణ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పార్టీ వర్గాలతో చర్చలు జరిపిన ఆయన..…