తాజాగా విడుదలైన డెవిల్ కు హీరో కళ్యాణ్ రామ్ సీక్వెల్ ప్రకటించేయడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. సాయంత్రం చిన్న సక్సెస్ మీట్ లాంటిది పెట్టుకున్న టీమ్ పరస్పరం కేకులు తినిపించుకున్నాక మంచి జోష్ ఉన్న హీరో అనౌన్స్ మెంట్ ఇచ్చేశాడు. అయితే ఇంకా బాక్సాఫీస్ ఫలితం తేలలేదు. రివ్యూలు మిశ్రమంగా వచ్చాయి. పబ్లిక్ టాక్ కూడా డివైడ్ గానే ఉంది. కానీ గత ఏడాది బింబిసారకు అలా జరగలేదు. మార్నింగ్ షో కావడం ఆలస్యం బాగుందనే మాట బయటికి వచ్చింది. ఫలితంగా ఈవెనింగ్ షోల నుంచే హౌస్ ఫుల్స్ పడి క్రమంగా స్ట్రాంగ్ అవుతూ వెళ్ళింది.
ఇప్పుడు డెవిల్ కి అలాగే జరిగి ఉంటే పార్ట్ టూకి న్యాయం జరుగుతుంది. అసలే దర్శకుడి ఇష్యూ మీద చర్చల్లో నలిగింది. మొదట ప్రాజెక్టు టేకప్ చేసిన నవీన్ మేడారం సినిమా ఎలా ఉందంటూ అభిప్రాయాలు అడుగుతూ సోషల్ మీడియాలో ట్వీట్లు పెట్టాడు. ఇంకో వైపు డైరెక్టర్ చైర్ తీసుకున్న నిర్మాత అభిషేక్ నామా ఇంత అనుభవమున్న నేను తీయలేనా అంటూ లాజికల్ గా సమాధానం చెప్పి విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఫైనల్ గా తీసింది ఆయనైనా లేక నవీనైనా ప్రెజెంటేషన్ లోని అనుభవ లేమి స్పష్టంగా కనిపించింది. ఫైనల్ రన్ అయ్యాకే హిట్టో ఫ్లాపో తేలుతుంది.
నిజానికి ఫ్యాన్స్ డిమాండ్ చేస్తోంది బింబిసార 2ని. కళ్యాణ్ రామ్ ఖచ్చితంగా ఉంటుందని చెబుతున్నాడు కానీ ఎప్పుడు ఎవరితో అనేది తేల్చడం లేదు. మొదటి భాగం తీసిన వశిష్ట చిరంజీవి విశ్వంభరకు వెళ్లిపోవడంతో మరో ఆప్షన్ చూసుకోవాల్సి ఉంది. అలాంటప్పుడు దీని సంగతి చెబితే బాగుంటుంది కానీ ఇంకా రిజల్ట్ రాని డెవిల్ మీద అంత కాన్ఫిడెన్స్ తో రెండో భాగం ప్రకటించడం ఒకరకంగా పొరపాటేనని ఫ్యాన్స్ అభిప్రాయం. కొనసాగంపు మీద ఆసక్తి రావాలంటే బ్లాక్ బస్టర్ల విషయంలోనే అది జరుగుతుంది. అయినా కళ్యాణ్ రామ్ ఇంకొద్ది రోజులు ఆగి చెప్పి ఉంటే బాగుండేదేమో.
This post was last modified on December 29, 2023 10:16 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…