తాజాగా విడుదలైన డెవిల్ కు హీరో కళ్యాణ్ రామ్ సీక్వెల్ ప్రకటించేయడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. సాయంత్రం చిన్న సక్సెస్ మీట్ లాంటిది పెట్టుకున్న టీమ్ పరస్పరం కేకులు తినిపించుకున్నాక మంచి జోష్ ఉన్న హీరో అనౌన్స్ మెంట్ ఇచ్చేశాడు. అయితే ఇంకా బాక్సాఫీస్ ఫలితం తేలలేదు. రివ్యూలు మిశ్రమంగా వచ్చాయి. పబ్లిక్ టాక్ కూడా డివైడ్ గానే ఉంది. కానీ గత ఏడాది బింబిసారకు అలా జరగలేదు. మార్నింగ్ షో కావడం ఆలస్యం బాగుందనే మాట బయటికి వచ్చింది. ఫలితంగా ఈవెనింగ్ షోల నుంచే హౌస్ ఫుల్స్ పడి క్రమంగా స్ట్రాంగ్ అవుతూ వెళ్ళింది.
ఇప్పుడు డెవిల్ కి అలాగే జరిగి ఉంటే పార్ట్ టూకి న్యాయం జరుగుతుంది. అసలే దర్శకుడి ఇష్యూ మీద చర్చల్లో నలిగింది. మొదట ప్రాజెక్టు టేకప్ చేసిన నవీన్ మేడారం సినిమా ఎలా ఉందంటూ అభిప్రాయాలు అడుగుతూ సోషల్ మీడియాలో ట్వీట్లు పెట్టాడు. ఇంకో వైపు డైరెక్టర్ చైర్ తీసుకున్న నిర్మాత అభిషేక్ నామా ఇంత అనుభవమున్న నేను తీయలేనా అంటూ లాజికల్ గా సమాధానం చెప్పి విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఫైనల్ గా తీసింది ఆయనైనా లేక నవీనైనా ప్రెజెంటేషన్ లోని అనుభవ లేమి స్పష్టంగా కనిపించింది. ఫైనల్ రన్ అయ్యాకే హిట్టో ఫ్లాపో తేలుతుంది.
నిజానికి ఫ్యాన్స్ డిమాండ్ చేస్తోంది బింబిసార 2ని. కళ్యాణ్ రామ్ ఖచ్చితంగా ఉంటుందని చెబుతున్నాడు కానీ ఎప్పుడు ఎవరితో అనేది తేల్చడం లేదు. మొదటి భాగం తీసిన వశిష్ట చిరంజీవి విశ్వంభరకు వెళ్లిపోవడంతో మరో ఆప్షన్ చూసుకోవాల్సి ఉంది. అలాంటప్పుడు దీని సంగతి చెబితే బాగుంటుంది కానీ ఇంకా రిజల్ట్ రాని డెవిల్ మీద అంత కాన్ఫిడెన్స్ తో రెండో భాగం ప్రకటించడం ఒకరకంగా పొరపాటేనని ఫ్యాన్స్ అభిప్రాయం. కొనసాగంపు మీద ఆసక్తి రావాలంటే బ్లాక్ బస్టర్ల విషయంలోనే అది జరుగుతుంది. అయినా కళ్యాణ్ రామ్ ఇంకొద్ది రోజులు ఆగి చెప్పి ఉంటే బాగుండేదేమో.
This post was last modified on December 29, 2023 10:16 pm
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…