Movie News

సీక్వెల్ ప్రకటించేయడం తొందరపాటేమో

తాజాగా విడుదలైన డెవిల్ కు హీరో కళ్యాణ్ రామ్ సీక్వెల్ ప్రకటించేయడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. సాయంత్రం చిన్న సక్సెస్ మీట్ లాంటిది పెట్టుకున్న టీమ్ పరస్పరం కేకులు తినిపించుకున్నాక మంచి జోష్ ఉన్న హీరో అనౌన్స్ మెంట్ ఇచ్చేశాడు. అయితే ఇంకా బాక్సాఫీస్ ఫలితం తేలలేదు. రివ్యూలు మిశ్రమంగా వచ్చాయి. పబ్లిక్ టాక్ కూడా డివైడ్ గానే ఉంది. కానీ గత ఏడాది బింబిసారకు అలా జరగలేదు. మార్నింగ్ షో కావడం ఆలస్యం బాగుందనే మాట బయటికి వచ్చింది. ఫలితంగా ఈవెనింగ్ షోల నుంచే హౌస్ ఫుల్స్ పడి క్రమంగా స్ట్రాంగ్ అవుతూ వెళ్ళింది.

ఇప్పుడు డెవిల్ కి అలాగే జరిగి ఉంటే పార్ట్ టూకి న్యాయం జరుగుతుంది. అసలే దర్శకుడి ఇష్యూ మీద చర్చల్లో నలిగింది. మొదట ప్రాజెక్టు టేకప్ చేసిన నవీన్ మేడారం సినిమా ఎలా ఉందంటూ అభిప్రాయాలు అడుగుతూ సోషల్ మీడియాలో ట్వీట్లు పెట్టాడు. ఇంకో వైపు డైరెక్టర్ చైర్ తీసుకున్న నిర్మాత అభిషేక్ నామా ఇంత అనుభవమున్న నేను తీయలేనా అంటూ లాజికల్ గా సమాధానం చెప్పి విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఫైనల్ గా తీసింది ఆయనైనా లేక నవీనైనా ప్రెజెంటేషన్ లోని అనుభవ లేమి స్పష్టంగా కనిపించింది. ఫైనల్ రన్ అయ్యాకే హిట్టో ఫ్లాపో తేలుతుంది.

నిజానికి ఫ్యాన్స్ డిమాండ్ చేస్తోంది బింబిసార 2ని. కళ్యాణ్ రామ్ ఖచ్చితంగా ఉంటుందని చెబుతున్నాడు కానీ ఎప్పుడు ఎవరితో అనేది తేల్చడం లేదు. మొదటి భాగం తీసిన వశిష్ట చిరంజీవి విశ్వంభరకు వెళ్లిపోవడంతో మరో ఆప్షన్ చూసుకోవాల్సి ఉంది. అలాంటప్పుడు దీని సంగతి చెబితే బాగుంటుంది కానీ ఇంకా రిజల్ట్ రాని డెవిల్ మీద అంత కాన్ఫిడెన్స్ తో రెండో భాగం ప్రకటించడం ఒకరకంగా పొరపాటేనని ఫ్యాన్స్ అభిప్రాయం. కొనసాగంపు మీద ఆసక్తి రావాలంటే బ్లాక్ బస్టర్ల విషయంలోనే అది జరుగుతుంది. అయినా కళ్యాణ్ రామ్ ఇంకొద్ది రోజులు ఆగి చెప్పి ఉంటే బాగుండేదేమో.

This post was last modified on December 29, 2023 10:16 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

తేనెతుట్టెను గెలుకుతున్న రేవంత్ !

లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే తెలంగాణలో ఉన్న 33 జిల్లాలను 17 జిల్లాలకు కుదిస్తారని వస్తున్న వార్తలు…

39 mins ago

సేఫ్ గేమ్ ఆడుతున్న ఆర్ఆర్ఆర్ నిర్మాత

ఇండస్ట్రీలో సుదీర్ఘ అనుభవంతో ఎన్నో బ్లాక్ బస్టర్లు చూసిన డివివి దానయ్య సగటు మాములు ప్రేక్షకుడికి బాగా దగ్గరయ్యింది మాత్రం…

2 hours ago

మాజీ ప్ర‌ధాని మ‌న‌వ‌డి కోసం… బ్లూ కార్నర్ నోటీసు!

భార‌త దేశ చ‌రిత్ర‌లో ఇదోక అనూహ్య‌మైన.. అస‌హ్యించుకునే ఘ‌ట‌న‌. ఈ దేశాన్ని పాలించి, రైతుల మ‌న్న‌న‌లు, మ‌హిళ‌ల మ‌న్న‌న‌లు పొందిన…

2 hours ago

జ‌గ‌న్.. నీరో : జేడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ సీఎం జ‌గ‌న్‌.. నీరో చ‌క్ర‌వ‌ర్తిని త‌ల‌పిస్తున్నారంటూ.. సీబీఐ మాజీ డైరెక్ట‌ర్ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ సంచ ల‌న వ్యాఖ్య‌లు చేశారు.…

3 hours ago

ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో ఆర్సీబీ..కప్ కొడతారా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అత్యంత దురదృష్టకరమైన జట్టు పేరు చెప్పమని అడిగితే…ఠపీమని ఆర్సీబీ పేరు చెప్పేస్తారు క్రికెట్…

4 hours ago

సతీసమేతంగా అమెరికాకు చంద్రబాబు

ఏపీలో ఎన్నికల పోరు ముగియడంతో ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. తమ కుటుంబ సభ్యులు,…

4 hours ago