సంక్రాంతికి టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలకే తలనెప్పిగా ఉంటే ఇంకా డబ్బింగ్ వాటి గురించి అడుగుతారేంటని ఇటీవలే నిర్మాత దిల్ రాజు ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం గుర్తే. అయితే ధనుష్ కెప్టెన్ మిల్లర్ రేస్ లోకి రావడం ఆసక్తి రేపుతోంది. గుంటూరు కారం, హనుమాన్ వస్తున్న జనవరి 12నే రిలీజ్ చేయబోతున్నట్టు యూనిట్ అధికారికంగా పోస్టర్ తో పాటు ప్రకటించింది. కోలీవుడ్ కి సైతం పొంగల్ చాలా కీలకమైన పండగ కావడంతో స్టార్ హీరోలు ఈ సీజన్ ని మిస్ చేసుకోవడానికి ఇష్టపడరు. పైగా రజినీకాంత్ లాల్ సలామ్ తప్పుకోవడంతో అల్లుడు ధనుష్ కి రూటు క్లియరయిపోయింది.
ఇప్పుడు అసలు సమస్య మరొకటుంది. నిజంగా తెలుగు రాష్ట్రాల్లో కెప్టెన్ మిల్లర్ ని నిలువరించేలా మన నిర్మాతల సమాఖ్య చొరవ తీసుకుంటారా అనేదే భేతాళ ప్రశ్న. ఎందుకంటే ఎవరో ఒకరు హక్కులు కొంటారు. బ్యాకప్ గా పేరున్న డిస్ట్రిబ్యూటర్లు ముందుకొస్తారు. దాంతో సహజంగానే ఎన్నో కొన్ని థియేటర్లు ధనుష్ బొమ్మకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఎన్నో సార్లు వచ్చిన చిక్కే. గతంలో పేట ప్రొడ్యూసర్లు మీడియాకెక్కి మరీ రచ్చ చేశారు. ఈ సంవత్సరం వారసుడుని తెచ్చినందుకు దిల్ రాజు సైతం టార్గెట్ అయ్యారు. ఇప్పుడు కెప్టెన్ మిల్లర్ ని ఎలా అడ్డుకోగలరు.
క్రేజ్ పరంగా గుంటూరు కారం, హనుమాన్ లతో ధనుష్ కి పోలిక లేకపోవచ్చు. కానీ ఏపీ తెలంగాణ కలిపి కనీసం ఒక వంద స్క్రీన్లు ఇచ్చినా ఆ మేరకు మహేష్, వెంకీ, నాగార్జున, రవితేజ, తేజ సజ్జలు ఆ కౌంట్ ని కోల్పోయినట్టే. స్టోరీ ఇక్కడితో అయిపోలేదు. శివ కార్తికేయన్ అయలన్ కూడా వస్తోంది. డబ్బింగ్ కార్యక్రమాలు గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతున్నాయి. ఇతనూ రెండు భాషల్లో ఒకేసారి రిలీజ్ కోరుకుంటాడు. మనం ఇంతగా తలలు పగలగొట్టుకుంటున్నాం కానీ అదే తమిళనాడులో మన సంక్రాంతి సినిమాలకు సింగల్ డిజిట్ థియేటర్లు ఇచ్చినా గొప్పే అనుకోవాలి.
This post was last modified on December 29, 2023 8:36 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…