కొత్త సినిమా విడుదల అంటే ప్రమోషన్లు చాలా ముఖ్యం. అందులో అత్యంత ముఖ్యమైన ప్రి రిలీజ్ ఈవెంట్. చిన్న, పెద్ద అని తేడా లేకుండా అన్ని సినిమాలకూ ఈ ఈవెంట్ చేయడం కొన్నేళ్లుగా ఆనవాయితీగా మారింది. అయితే ఆరు నెలలుగా థియేటర్లలో కొత్త సినిమాల విడుదల లేదు. మరి కొన్ని నెలలు ఆ అవకాశాలు కనిపించడం లేదు.
ఇలాంటి టైంలో ఓ కొత్త సినిమాకు ప్రి రిలీజ్ ఫంక్షన్ చేస్తున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇంకో రెండు రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రానున్న ‘వి’ సినిమాకు సంబంధించి ఈ ఈవెంట్ చేస్తుండటం విశేషం. ఈ విషయాన్ని చిత్ర బృందం ప్రకటించింది. సెప్టెంబరు 5న, శనివారం ఈ చిత్రం విడుదల కానుండగా.. ముందు రోజు సాయంత్రం 6 గంటల నుంచి ‘వి’ ప్రి రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది.
ప్రస్తుత కరోనా సమయంలో ఈ ఈవెంట్ ఎక్కడ చేస్తారు.. జనాలను ఎలా అనుమతిస్తారు అని సందేహం కలగొచ్చు. కానీ లాక్ డౌన్ టైంలో అలవాటు పడ్డ వర్చువల్ స్టయిల్లోనే ఈ ఈవెంట్ జరగబోతోంది. ఈ ఈవెంట్కు వెన్యూగా ‘మీ స్క్రీన్లు’ అని చిత్ర బృందం పేర్కొనడం విశేషం. అంటే చిత్ర బృందం అంతా ఒక చోటికి చేరి అక్కడి నుంచే తమ సినిమా గురించి మాట్లాడుతుందన్నమాట.
వాళ్లతో వర్చువల్గా కనెక్ట్ అయి ఈ ఈవెంట్లో భాగం కావచ్చు. ప్రధాన తారాగణం అయిన నాని, సుధీర్ బాబు, అదితి రావు హైదరి, నివేథా థామస్లతో పాటు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, నిర్మాత దిల్ రాజు ఈ ఈవెంట్లో పాల్గొననున్నారు. టాలీవుడ్లో థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి.. నేరుగా ఓటీటీలో రిలీజవుతున్న పెద్ద సినిమా ఇదే కావడంతో దీనిపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది జనాల్లో. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచే ‘వి’ స్ట్రీమ్ కాబోతోంది. ఈ సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందో అని చిత్ర బృందమే కాదు.. ఇండస్ట్రీ జనాలు, ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…