కొత్త సినిమా విడుదల అంటే ప్రమోషన్లు చాలా ముఖ్యం. అందులో అత్యంత ముఖ్యమైన ప్రి రిలీజ్ ఈవెంట్. చిన్న, పెద్ద అని తేడా లేకుండా అన్ని సినిమాలకూ ఈ ఈవెంట్ చేయడం కొన్నేళ్లుగా ఆనవాయితీగా మారింది. అయితే ఆరు నెలలుగా థియేటర్లలో కొత్త సినిమాల విడుదల లేదు. మరి కొన్ని నెలలు ఆ అవకాశాలు కనిపించడం లేదు.
ఇలాంటి టైంలో ఓ కొత్త సినిమాకు ప్రి రిలీజ్ ఫంక్షన్ చేస్తున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇంకో రెండు రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రానున్న ‘వి’ సినిమాకు సంబంధించి ఈ ఈవెంట్ చేస్తుండటం విశేషం. ఈ విషయాన్ని చిత్ర బృందం ప్రకటించింది. సెప్టెంబరు 5న, శనివారం ఈ చిత్రం విడుదల కానుండగా.. ముందు రోజు సాయంత్రం 6 గంటల నుంచి ‘వి’ ప్రి రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది.
ప్రస్తుత కరోనా సమయంలో ఈ ఈవెంట్ ఎక్కడ చేస్తారు.. జనాలను ఎలా అనుమతిస్తారు అని సందేహం కలగొచ్చు. కానీ లాక్ డౌన్ టైంలో అలవాటు పడ్డ వర్చువల్ స్టయిల్లోనే ఈ ఈవెంట్ జరగబోతోంది. ఈ ఈవెంట్కు వెన్యూగా ‘మీ స్క్రీన్లు’ అని చిత్ర బృందం పేర్కొనడం విశేషం. అంటే చిత్ర బృందం అంతా ఒక చోటికి చేరి అక్కడి నుంచే తమ సినిమా గురించి మాట్లాడుతుందన్నమాట.
వాళ్లతో వర్చువల్గా కనెక్ట్ అయి ఈ ఈవెంట్లో భాగం కావచ్చు. ప్రధాన తారాగణం అయిన నాని, సుధీర్ బాబు, అదితి రావు హైదరి, నివేథా థామస్లతో పాటు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, నిర్మాత దిల్ రాజు ఈ ఈవెంట్లో పాల్గొననున్నారు. టాలీవుడ్లో థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి.. నేరుగా ఓటీటీలో రిలీజవుతున్న పెద్ద సినిమా ఇదే కావడంతో దీనిపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది జనాల్లో. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచే ‘వి’ స్ట్రీమ్ కాబోతోంది. ఈ సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందో అని చిత్ర బృందమే కాదు.. ఇండస్ట్రీ జనాలు, ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
This post was last modified on September 3, 2020 2:38 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…