విపరీతమైన పోటీ, వాయిదా వేసుకోమనే ఒత్తిడి మధ్య హనుమాన్ కు మైత్రి అండ దొరికేసింది. నైజామ్ హక్కులను సుమారు ఏడు కోట్ల ఇరవై లక్షలకు ఆ సంస్థ స్వంతం చేసుకున్నట్టు ట్రేడ్ టాక్. జనవరి 12 విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండబోవడం లేదు. ఏవో చర్చలు, సంప్రదింపులని వార్తలు వస్తున్నాయి వాటి ఫలితం మాత్రం సున్నా. ఎవరూ పండగ బరి నుంచి తప్పుకోవడం లేదనే క్లారిటీ వచ్చేసింది. అదే ప్రాంతంలో గుంటూరు కారంని దిల్ రాజు పంపిణి చేస్తున్న నేపథ్యంలో థియేటర్ల పంపకాలకు సంబంధించిన పోటీ వాడివేడిగా, రసవత్తరంగా మారేలా కనిపిస్తోంది.
హనుమాన్ ని ఎవరూ తక్కువంచనా వేయడం లేదు కానీ గుంటూరు కారం మాస్ ని తట్టుకుని నిలబడుతుందా అనేదే అసలు ప్రశ్న. అయితే నిర్మాతల వైపు నుంచి ఉన్న ధైర్యం వెనుక మరో కోణం ఉంది. ఈ సినిమా త్రీడి వెర్షన్ లో వస్తోంది. మొదటిసారి చూసినవాళ్లు ఖచ్చితంగా పిల్లలకు రికమండ్ చేసే స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని యూనిట్ ఊరిస్తోంది. ఈ నమ్మకంతోనే నార్త్ లో వెయ్యికి పైగా స్క్రీన్లతో పెద్ద ఎత్తున ప్లానింగ్ చేసుకుంటోంది. పైగా మహేష్ మూవీకి మొదటి వారం అందరికీ అంత సులభంగా టికెట్లు దొరికే పరిస్థితి ఉండదు. అలాంటప్పుడు ఓవర్ ఫ్లోస్ మొదట ప్లసయ్యేది హనుమాన్ కే.
అగ్రిమెంట్లు, కేటాయింపులు దాదాపు ఒక కొలిక్కి వచ్చాయి. మొదటి వారంలో షోలు తగ్గినా సెకండ్ వీక్ నుంచి అమాంతం పెరుగుతాయనే ధీమా హనుమాన్ మేకర్స్ లో ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. గుంటూరు కారం ట్రైలర్ వచ్చాక అంచనాల బరువులో అది ముందుకు వెళ్లిపోవడం ఖాయమే కానీ స్లో అండ్ స్టడీ సూత్రాన్నే నమ్ముతున్నాడు హనుమాన్. వచ్చే వారం నుంచి పబ్లిసిటీని వినూత్నంగా ప్లాన్ చేయబోతున్నారు. మహేష్, వెంకటేష్, రవితేజ, నాగార్జునల పోటీ తట్టుకోవాలంటే ఆ మాత్రం వైవిధ్యం చూపించక తప్పదు మరి.
This post was last modified on December 28, 2023 9:14 pm
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…