పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో సినిమా అంటే ఒక పట్టాన తేలేది కాదు. ఆయన కొంచెం నెమ్మదిగా సినిమాలు చేస్తాడన్న సంగతి తెలిసిందే. సినిమాకు సినిమాకు మధ్య చాలా గ్యాప్ కూడా తీసుకుంటుంటాడు. రాజకీయ పార్టీ పెట్టడానికి ముందు నుంచి పవన్ శైలి ఇంతే.
రాజకీయాల్లో బిజీ అయ్యాక మరీ సినిమాలు తగ్గించేశాడు. ‘అత్తారింటికి దారేది’ తర్వాత బాగా గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. దాని తర్వాత కొంచెం స్పీడు పెంచి ఓ నాలుగు సినిమాలు లాగించేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు.
ఐతే 2024 ఎన్నికలకు ఏడాది, ఏడాదిన్నర ముందు వరకు సినిమాలు చేయాలని చూస్తున్న పవన్.. సాధ్యమైనన్ని ఎక్కువ ప్రాజెక్టులు పూర్తి చేయాలనుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఆల్రెడీ రెండు సినిమాలను సెట్స్ మీదికి తీసుకెళ్లాడు. ఇంకో రెండు సినిమాలు కమిటయ్యాడు. వాటి గురించి పవన్ పుట్టిన రోజు సందర్భంగా అప్డేట్లు కూడా వచ్చాయి.
‘వకీల్ సాబ్’తో పాటుగా క్రిష్ సినిమాను పూర్తి చేశాక హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలు లైన్లోకి వస్తాయి. ఐతే పవన్తో సినిమా కోసం ఆల్రెడీ ఏడాది నుంచి పని చేస్తున్నాడు హరీష్. స్క్రిప్టు కూడా ఆల్రెడీ పూర్తయింది. పవన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తే అప్పుడు సినిమా మొదలుపెట్టడానికి అతను రెడీగా ఉన్నాడు. కానీ కనీసం ఏడాది పాటు పవన్ ఈ సినిమా మొదలుపెట్టే సూచనలు కనిపించట్లేదు.
ఈ గ్యాప్లో హరీష్ ఇంకో సినిమా చేసుకోవడానికి అవకాశముంది. కానీ పవన్తో సినిమా చేయబోతూ తన శక్తి సామర్థ్యాల్ని మరో సినిమా మీదికి మళ్లించనని.. ఆ చిత్రం మొదలయ్యే వరకు ఎదురు చూస్తానని అంటున్నాడు హరీష్. అలా హరీష్ లాక్ అయిపోయాడు. ఇక సురేందర్ రెడ్డిది కూడా ఇదే పరిస్థితి కాబోతోంది.
చిరంజీవితో ‘సైరా’ సినిమా చేశాక పది నెలలుగా ఖాళీగా ఉన్నాడు సురేందర్. ఎవరెవరితోనో సినిమా అనుకున్నాడు. కానీ ఏ కాంబినేషన్ కాలేదు. అనుకోకుండా పవన్తో సినిమా చేసే అరుదైన అవకాశం వచ్చింది. దీని మీదే పూర్తిగా ఫోకస్ పెట్టాలని భావిస్తున్న సురేందర్.. పవన్ అందుబాటులోకి వచ్చేవరకు ఇంకో సినిమా చేయొద్దని ఫిక్సయిపోయాడట. ఇలా పవన్ ఒకరికిద్దరు స్టార్ డైరెక్టర్లను లాక్ చేసి పడేశాడని ఇండస్ట్రీ జనాలు అనుకుంటున్నారు.
This post was last modified on September 3, 2020 12:37 pm
ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మహానటి తర్వాత…
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…