పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో సినిమా అంటే ఒక పట్టాన తేలేది కాదు. ఆయన కొంచెం నెమ్మదిగా సినిమాలు చేస్తాడన్న సంగతి తెలిసిందే. సినిమాకు సినిమాకు మధ్య చాలా గ్యాప్ కూడా తీసుకుంటుంటాడు. రాజకీయ పార్టీ పెట్టడానికి ముందు నుంచి పవన్ శైలి ఇంతే.
రాజకీయాల్లో బిజీ అయ్యాక మరీ సినిమాలు తగ్గించేశాడు. ‘అత్తారింటికి దారేది’ తర్వాత బాగా గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. దాని తర్వాత కొంచెం స్పీడు పెంచి ఓ నాలుగు సినిమాలు లాగించేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు.
ఐతే 2024 ఎన్నికలకు ఏడాది, ఏడాదిన్నర ముందు వరకు సినిమాలు చేయాలని చూస్తున్న పవన్.. సాధ్యమైనన్ని ఎక్కువ ప్రాజెక్టులు పూర్తి చేయాలనుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఆల్రెడీ రెండు సినిమాలను సెట్స్ మీదికి తీసుకెళ్లాడు. ఇంకో రెండు సినిమాలు కమిటయ్యాడు. వాటి గురించి పవన్ పుట్టిన రోజు సందర్భంగా అప్డేట్లు కూడా వచ్చాయి.
‘వకీల్ సాబ్’తో పాటుగా క్రిష్ సినిమాను పూర్తి చేశాక హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలు లైన్లోకి వస్తాయి. ఐతే పవన్తో సినిమా కోసం ఆల్రెడీ ఏడాది నుంచి పని చేస్తున్నాడు హరీష్. స్క్రిప్టు కూడా ఆల్రెడీ పూర్తయింది. పవన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తే అప్పుడు సినిమా మొదలుపెట్టడానికి అతను రెడీగా ఉన్నాడు. కానీ కనీసం ఏడాది పాటు పవన్ ఈ సినిమా మొదలుపెట్టే సూచనలు కనిపించట్లేదు.
ఈ గ్యాప్లో హరీష్ ఇంకో సినిమా చేసుకోవడానికి అవకాశముంది. కానీ పవన్తో సినిమా చేయబోతూ తన శక్తి సామర్థ్యాల్ని మరో సినిమా మీదికి మళ్లించనని.. ఆ చిత్రం మొదలయ్యే వరకు ఎదురు చూస్తానని అంటున్నాడు హరీష్. అలా హరీష్ లాక్ అయిపోయాడు. ఇక సురేందర్ రెడ్డిది కూడా ఇదే పరిస్థితి కాబోతోంది.
చిరంజీవితో ‘సైరా’ సినిమా చేశాక పది నెలలుగా ఖాళీగా ఉన్నాడు సురేందర్. ఎవరెవరితోనో సినిమా అనుకున్నాడు. కానీ ఏ కాంబినేషన్ కాలేదు. అనుకోకుండా పవన్తో సినిమా చేసే అరుదైన అవకాశం వచ్చింది. దీని మీదే పూర్తిగా ఫోకస్ పెట్టాలని భావిస్తున్న సురేందర్.. పవన్ అందుబాటులోకి వచ్చేవరకు ఇంకో సినిమా చేయొద్దని ఫిక్సయిపోయాడట. ఇలా పవన్ ఒకరికిద్దరు స్టార్ డైరెక్టర్లను లాక్ చేసి పడేశాడని ఇండస్ట్రీ జనాలు అనుకుంటున్నారు.
This post was last modified on September 3, 2020 12:37 pm
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…