ఇప్పుడున్న కాంపిటీషన్ లో శాటిలైట్ ఛానల్స్, ఓటిటిల మనుగడ అంత సులభంగా లేదు. కొత్త కంటెంట్ ఇస్తున్నా ప్రేక్షకులను నిలబెట్టుకోవడం కష్టంగా మారుతున్న తరుణంలో రేసులో వెనుకబడిన ఈటీవీ ఒకేసారి పెద్ద స్ట్రాటజీతో రంగంలో దిగడం విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది. స్టార్ మా, జెమిని, జీ తెలుగుతో పోల్చుకుంటే కొత్త సినిమాలను కొనడం, ప్రసారం చేసే విషయంలో ఈటీవీ ఎప్పుడో వెనుకబడింది. సీరియళ్లు, న్యూస్, రియాలిటీ షోలతో నిలదొక్కుకుంది కానీ ఈటీవీ విన్ పేరుతో ఓటిటిలో అడుగు పెట్టాక ఈ ఎత్తుగడ సరిపోవడం లేదు. అందుకే గేరు మార్చింది.
వెంకటేష్ సైంధవ్ శాటిలైట్ హక్కులు ఈటీవీ సొంతం చేసుకుందనే వార్త కొద్దిరోజుల క్రితమే లీకయ్యింది. దానికి సంబంధించిన ఈవెంట్ల హక్కులను కూడా కొనుగోలు చేసిందని లేటెస్ట్ అప్డేట్. రేపు హైదరాబాద్ లో జరగబోయే వెంకటేష్ 75 ఈవెంట్ కి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు, నాని లాంటి క్రేజీ స్టార్స్ ఎందరో గెస్టులుగా రాబోతున్నారు. సహజంగా దీన్ని చూడాలనే ఎగ్జైట్ మెంట్ ఫ్యాన్స్ లో ఉంటుంది. దీన్ని కొత్త సంవత్సర కానుకగా విన్ ఓటిటి, ఈటీవీ ఛానల్ లో ప్రసారం చేసేందుకు ప్లాన్ చేస్తోందట. దీని వల్ల ఒక్కసారిగా రేటింగ్స్ పెరుగుతాయని ఆశిస్తోంది.
ఇంతేకాదు మీనా, ఖుష్బూ తదితరులతో వెంకీ చేసిన స్పెషల్ ప్రోగ్రాం ఒకటి జనవరి 13 ప్రసారం చేయబోతున్నారు. సైంధవ్ శాటిలైట్ దక్కినా ఈటివికి ఓటిటి రాలేదని సమాచారం. ఇటీవలే బేబీ లాంటి బ్లాక్ బస్టర్ ని ఈటీవీనే ప్రసారం చేసింది. ఇదొక్కటే కాదు ఇంకా కొత్త సినిమాలు చాలానే కొనుగోలు చేసింది. సైంధవ్ కేవలం ప్రారంభం మాత్రమేనని రాబోయే రోజుల్లో పెద్ద హీరోల శాటిలైట్ హక్కులతో పాటు మెల్లగా ఓటిటిని బలోపేతం చేసే విధంగా ఓటిటి డీల్స్ కూడా చేసుకుంటారని ఇన్ సైడ్ టాక్. జనవరి 13 విడుదల కాబోతున్న సైంధవ్ కి హిట్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు.
This post was last modified on December 26, 2023 9:50 pm
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…
గజ్వేల్ నియోజకవర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట. అయితే.. ఇక్కడే పాగా వేయాలని.. వచ్చే…
తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…