జూనియర్ ఎన్టీఆర్ దేవర టీజర్ ఎప్పుడు వచ్చేది డేట్ ఇంకా చెప్పలేదు కానీ ఈలోగా దానికి సంబంధించిన అప్డేట్స్ తో అభిమానులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. డెవిల్ కోసం ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న కళ్యాణ్ రామ్ తమ్ముడు సినిమా అద్భుతంగా వస్తోందని, తారక్ ని పవర్ ఫుల్ గా ఆవిష్కరించడంతో పాటు టాలీవుడ్ తెరమీద ఎన్నడూ చూడని విజువల్ ఎఫెక్ట్స్ తో అబ్బురపరుస్తామని హామీ ఇస్తున్నాడు. నిర్మాతే స్వయంగా చెప్పాక ఇక ఫ్యాన్స్ అంచనాలకు అడ్డెక్కడిది. ఇది ఇక్కడితో ఆగలేదు. తాజాగా సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ తోడయ్యాడు.
దేవరకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటల విషయంలో ఏ స్థాయి హైప్ ఉందో చెప్పనక్కర్లేదు. విపరీతమైన బిజీగా ఉన్న అనిరుద్ స్వయంగా టీజర్ గురించి ట్విట్టర్లో చెప్పాడంటే దానికి సంబంధించిన రీ రికార్డింగ్ అయిపోయిందనే అర్థం. ఫ్యామిలీ వెకేషన్ కోసం జపాన్ వెళ్లిన జూనియర్ కి ఫైనల్ కాపీని మరో రెండు మూడు రోజుల్లో పంపించి అంగీకారం తీసుకుంటారట. దేవర ప్రపంచాన్ని ఊహించనంత భారీగా ఆవిష్కరిస్తారని తెలిసింది. సంక్రాంతికి విడుదలయ్యే గుంటూరు కారంతో పాటు థియేటర్లలో దేవర టీజర్ ని స్క్రీనింగ్ చేసేలా ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్లానింగ్ చేస్తున్నట్టు తెలిసింది.
ఏప్రిల్ 5 విడుదల కాబోతున్న దేవరకు ఎక్కువ సమయం లేదు. ఈ ఏడాది అయిపోయింది కాబట్టి చేతిలో మూడు నెలలు మాత్రమే సమయం ఉంటుంది. ఇప్పటికే 80 శాతం పైగానే పూర్తయ్యిందని చెబుతున్న కళ్యాణ్ రామ్ మిగిలిన భాగాన్ని వీలైనంత త్వరగా ఫినిష్ చేస్తామని అంటున్నాడు. ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి ప్రమోషన్ల కోసం ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే మార్చి మొత్తం ఇండియా వైడ్ ప్రమోషన్ టూర్ ప్లాన్ చేయబోతున్నారు. జాన్వీ కపూర్ తెలుగు డెబ్యూ కావడంతో నార్త్ వర్గాల్లో అదనపు ఆసక్తి తోడైంది. దేవర 2 వేసవి తర్వాత ప్రారంభమవ్వొచ్చు.
This post was last modified on December 26, 2023 9:46 pm
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…
ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ…
2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తామే విజయం దక్కించుకుంటామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎవరు ఎన్ని జిమ్మిక్కులు…