ప్రమోషన్లు జోరుగా చేస్తున్నా విడుదల తేదీని ఇప్పటిదాకా ప్రకటించని నా సామిరంగ జనవరి 14 లాక్ చేసుకున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ డేట్ ముందే లీకయ్యింది కానీ గుంటూరు కారం కన్నా ఓ రెండు రోజులు ముందే వస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలు జోరుగా జరిగాయట. అయితే రెండు విషయాలు ఇది సాధ్యం కాకుండా చేశాయని వినికిడి. మొదటిది షూటింగ్, సెన్సార్ పూర్తవ్వడానికి జనవరి మొదటి వారం పట్టేలా ఉంది. ఫైనల్ కాపీ సిద్ధం చేసి సెన్సార్ కు పంపించి బాలన్స్ ఉన్న రీ రికార్డింగ్ పనులను వేగంగా పూర్తి చేసినా సరే పదో తేదీ దాటిపోతుంది. సో జరిగే పని కాదు.
ఒకవేళ సాధ్యమైనా సరే రెండు రోజుల గ్యాప్ లో గుంటూరు కారం వస్తే థియేటర్ల పరంగా ఇబ్బంది ఎదురవుతుంది. ప్రాథమికంగా నా సామిరంగ తెలుగు రాష్ట్రాల్లో 240 స్క్రీన్లు వచ్చేలా అగ్రిమెంట్లు చేస్తోందట. నాగార్జున రేంజ్ కి ఇది పెద్ద నెంబర్ కాకపోయినా విపరీతమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో ఇంత కన్నా ఎక్కువ ఆశిస్తే కష్టమే. మహేష్ బాబు, వెంకటేష్, రవితేజలతో పాటు తేజ సజ్జ నిర్మాతలు ఎవరికి వారు తమ తమ రేంజ్, నెట్ వర్క్ కు తగ్గట్టు మాట్లాడుకుంటున్నారు. టాలీవుడ్ పెద్దలు ఎంత ప్రయత్నిస్తున్నా ఎవరూ రాజీపడే పరిస్థితి లేదని పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి.
చివరిగా రావడం వల్ల నా సామిరంగకు లాభం నష్టం రెండూ ఉన్నాయి. మిగిలిన నాలుగింటి టాక్ ఎలా వస్తుందనేది ఓపెనింగ్స్ ని శాశిస్తుంది. వాటిలో ఏదైనా ఏదైనా యావరేజ్ లేదా డిజాస్టర్ అయితే దాని ప్రయోజనం రెండో వారం నుంచి నా సామిరంగకు షిఫ్ట్ అయిపోతుంది. టాక్ తో సంబంధం లేకుండా గుంటూరు కారం తాకిడి ఎంత లేదన్నా వారం పది రోజులు ఉంటుంది కాబట్టి నాగార్జున మిగిలిన పోటీదారులనే ఎక్కువ పరిగణనలోకి తీసుకుంటున్నారు. విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేస్తున్న నా సామిరంగలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ పాత్రలు ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి.
This post was last modified on December 25, 2023 4:16 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…