ప్రమోషన్లు జోరుగా చేస్తున్నా విడుదల తేదీని ఇప్పటిదాకా ప్రకటించని నా సామిరంగ జనవరి 14 లాక్ చేసుకున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ డేట్ ముందే లీకయ్యింది కానీ గుంటూరు కారం కన్నా ఓ రెండు రోజులు ముందే వస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలు జోరుగా జరిగాయట. అయితే రెండు విషయాలు ఇది సాధ్యం కాకుండా చేశాయని వినికిడి. మొదటిది షూటింగ్, సెన్సార్ పూర్తవ్వడానికి జనవరి మొదటి వారం పట్టేలా ఉంది. ఫైనల్ కాపీ సిద్ధం చేసి సెన్సార్ కు పంపించి బాలన్స్ ఉన్న రీ రికార్డింగ్ పనులను వేగంగా పూర్తి చేసినా సరే పదో తేదీ దాటిపోతుంది. సో జరిగే పని కాదు.
ఒకవేళ సాధ్యమైనా సరే రెండు రోజుల గ్యాప్ లో గుంటూరు కారం వస్తే థియేటర్ల పరంగా ఇబ్బంది ఎదురవుతుంది. ప్రాథమికంగా నా సామిరంగ తెలుగు రాష్ట్రాల్లో 240 స్క్రీన్లు వచ్చేలా అగ్రిమెంట్లు చేస్తోందట. నాగార్జున రేంజ్ కి ఇది పెద్ద నెంబర్ కాకపోయినా విపరీతమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో ఇంత కన్నా ఎక్కువ ఆశిస్తే కష్టమే. మహేష్ బాబు, వెంకటేష్, రవితేజలతో పాటు తేజ సజ్జ నిర్మాతలు ఎవరికి వారు తమ తమ రేంజ్, నెట్ వర్క్ కు తగ్గట్టు మాట్లాడుకుంటున్నారు. టాలీవుడ్ పెద్దలు ఎంత ప్రయత్నిస్తున్నా ఎవరూ రాజీపడే పరిస్థితి లేదని పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి.
చివరిగా రావడం వల్ల నా సామిరంగకు లాభం నష్టం రెండూ ఉన్నాయి. మిగిలిన నాలుగింటి టాక్ ఎలా వస్తుందనేది ఓపెనింగ్స్ ని శాశిస్తుంది. వాటిలో ఏదైనా ఏదైనా యావరేజ్ లేదా డిజాస్టర్ అయితే దాని ప్రయోజనం రెండో వారం నుంచి నా సామిరంగకు షిఫ్ట్ అయిపోతుంది. టాక్ తో సంబంధం లేకుండా గుంటూరు కారం తాకిడి ఎంత లేదన్నా వారం పది రోజులు ఉంటుంది కాబట్టి నాగార్జున మిగిలిన పోటీదారులనే ఎక్కువ పరిగణనలోకి తీసుకుంటున్నారు. విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేస్తున్న నా సామిరంగలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ పాత్రలు ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి.
This post was last modified on December 25, 2023 4:16 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…