తన అభిమానులను ఉర్రూతలూగించే అప్ డేట్లు ఇచ్చాడు ప్రభాస్ గత కొన్ని నెలల్లో. ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్తో ఒక సినిమాను అనౌన్స్ చేసిన కొన్ని నెలలకే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్తో ‘ఆదిపురుష్’ చిత్రాన్ని ప్రకటించాడు. రెండు వారాల కిందటే దీని అప్ డేట్ వచ్చింది. దాని బడ్జెట్ రూ.500 కోట్లని.. రామాయణ కథను ప్రస్తుత కాలానికి అన్వయించి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని.. హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తారని.. ఇలా అనేక విశేషాలు బయటికి వచ్చాయి. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్ర చేయనుండగా.. అతణ్ని ఢీకొట్టే రావణుడెవరా అన్న ఆసక్తి అందరిలోనూ కనిపించింది. ఈ పాత్రకు సైఫ్ అలీఖాన్తో పాటు కొందరు బాలీవుడ్ స్టార్ల పేర్లు వినిపించాయి. ఐతే ఈ విషయంలో సస్పెన్స్కు గురువారం తెరదించేయబోతున్నారు.
‘ఆదిపురుష్’ విలన్ పాత్ర గురించి ఆసక్తికర ఇన్పుట్స్తో అప్ డేట్ ఇచ్చాడు దర్శకుడు ఓం రౌత్. 7 వేల ఏళ్ల కిందట ప్రపంచంలోనే అత్యంత తెలివైన దుష్టుడు ఉండేవాడని.. అతనెవరన్నది గురువారం ఉదయం 7.11 నిమిషాలకు ప్రకటిస్తామని చెప్పాడు ఓం రౌత్. ఇంతకుముందు ‘ఆది పురుష్’ అనౌన్స్మెంట్ సైతం ఉదయం 7.11 గంటలకే ఇవ్వడం విశేషం. దేవుడి కథతో ముడిపడ్డ సినిమా కావడంతో టైమింగ్ విషయంలో సెంటిమెంట్ నడుస్తున్నట్లుంది. మరి ఆజానుబాహుడైన ప్రభాస్ ముందు అతడికి దీటుగా నిలబడే విలన్ ఎవరో చూడాలి. ఈ చిత్రాన్ని బాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన భూషణ్ కుమార్తో కలిసి ఓం రౌత్, ఇంకో ముగ్గురు ప్రొడ్యూసర్లు నిర్మించనున్నారు. అన్ని భారతీయ ప్రధాన భాషలతో పాటు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. వచ్చే ఏడాది చిత్రీకరణ మొదలుపెట్టి 2022లో రిలీజ్ చేయాలన్నది ప్లాన్.
This post was last modified on September 2, 2020 9:10 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…