తన అభిమానులను ఉర్రూతలూగించే అప్ డేట్లు ఇచ్చాడు ప్రభాస్ గత కొన్ని నెలల్లో. ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్తో ఒక సినిమాను అనౌన్స్ చేసిన కొన్ని నెలలకే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్తో ‘ఆదిపురుష్’ చిత్రాన్ని ప్రకటించాడు. రెండు వారాల కిందటే దీని అప్ డేట్ వచ్చింది. దాని బడ్జెట్ రూ.500 కోట్లని.. రామాయణ కథను ప్రస్తుత కాలానికి అన్వయించి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని.. హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తారని.. ఇలా అనేక విశేషాలు బయటికి వచ్చాయి. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్ర చేయనుండగా.. అతణ్ని ఢీకొట్టే రావణుడెవరా అన్న ఆసక్తి అందరిలోనూ కనిపించింది. ఈ పాత్రకు సైఫ్ అలీఖాన్తో పాటు కొందరు బాలీవుడ్ స్టార్ల పేర్లు వినిపించాయి. ఐతే ఈ విషయంలో సస్పెన్స్కు గురువారం తెరదించేయబోతున్నారు.
‘ఆదిపురుష్’ విలన్ పాత్ర గురించి ఆసక్తికర ఇన్పుట్స్తో అప్ డేట్ ఇచ్చాడు దర్శకుడు ఓం రౌత్. 7 వేల ఏళ్ల కిందట ప్రపంచంలోనే అత్యంత తెలివైన దుష్టుడు ఉండేవాడని.. అతనెవరన్నది గురువారం ఉదయం 7.11 నిమిషాలకు ప్రకటిస్తామని చెప్పాడు ఓం రౌత్. ఇంతకుముందు ‘ఆది పురుష్’ అనౌన్స్మెంట్ సైతం ఉదయం 7.11 గంటలకే ఇవ్వడం విశేషం. దేవుడి కథతో ముడిపడ్డ సినిమా కావడంతో టైమింగ్ విషయంలో సెంటిమెంట్ నడుస్తున్నట్లుంది. మరి ఆజానుబాహుడైన ప్రభాస్ ముందు అతడికి దీటుగా నిలబడే విలన్ ఎవరో చూడాలి. ఈ చిత్రాన్ని బాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన భూషణ్ కుమార్తో కలిసి ఓం రౌత్, ఇంకో ముగ్గురు ప్రొడ్యూసర్లు నిర్మించనున్నారు. అన్ని భారతీయ ప్రధాన భాషలతో పాటు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. వచ్చే ఏడాది చిత్రీకరణ మొదలుపెట్టి 2022లో రిలీజ్ చేయాలన్నది ప్లాన్.
This post was last modified on September 2, 2020 9:10 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…