Movie News

ప్రభాస్‌ను ఢీకొట్టేది ఎవరో చెప్పేస్తున్నారు

తన అభిమానులను ఉర్రూతలూగించే అప్ డేట్‌లు ఇచ్చాడు ప్రభాస్ గత కొన్ని నెలల్లో. ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్‌తో ఒక సినిమాను అనౌన్స్ చేసిన కొన్ని నెలలకే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌తో ‘ఆదిపురుష్’ చిత్రాన్ని ప్రకటించాడు. రెండు వారాల కిందటే దీని అప్ డేట్ వచ్చింది. దాని బడ్జెట్ రూ.500 కోట్లని.. రామాయణ కథను ప్రస్తుత కాలానికి అన్వయించి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని.. హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తారని.. ఇలా అనేక విశేషాలు బయటికి వచ్చాయి. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్ర చేయనుండగా.. అతణ్ని ఢీకొట్టే రావణుడెవరా అన్న ఆసక్తి అందరిలోనూ కనిపించింది. ఈ పాత్రకు సైఫ్ అలీఖాన్‌తో పాటు కొందరు బాలీవుడ్ స్టార్ల పేర్లు వినిపించాయి. ఐతే ఈ విషయంలో సస్పెన్స్‌కు గురువారం తెరదించేయబోతున్నారు.

‘ఆదిపురుష్’ విలన్ పాత్ర గురించి ఆసక్తికర ఇన్‌పుట్స్‌తో అప్ డేట్ ఇచ్చాడు దర్శకుడు ఓం రౌత్. 7 వేల ఏళ్ల కిందట ప్రపంచంలోనే అత్యంత తెలివైన దుష్టుడు ఉండేవాడని.. అతనెవరన్నది గురువారం ఉదయం 7.11 నిమిషాలకు ప్రకటిస్తామని చెప్పాడు ఓం రౌత్. ఇంతకుముందు ‘ఆది పురుష్’ అనౌన్స్‌మెంట్ సైతం ఉదయం 7.11 గంటలకే ఇవ్వడం విశేషం. దేవుడి కథతో ముడిపడ్డ సినిమా కావడంతో టైమింగ్ విషయంలో సెంటిమెంట్ నడుస్తున్నట్లుంది. మరి ఆజానుబాహుడైన ప్రభాస్ ముందు అతడికి దీటుగా నిలబడే విలన్ ఎవరో చూడాలి. ఈ చిత్రాన్ని బాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన భూషణ్ కుమార్‌తో కలిసి ఓం రౌత్, ఇంకో ముగ్గురు ప్రొడ్యూసర్లు నిర్మించనున్నారు. అన్ని భారతీయ ప్రధాన భాషలతో పాటు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. వచ్చే ఏడాది చిత్రీకరణ మొదలుపెట్టి 2022లో రిలీజ్ చేయాలన్నది ప్లాన్.

This post was last modified on September 2, 2020 9:10 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

17 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

19 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

1 hour ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

2 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

6 hours ago