సలార్, డంకీ లాంటి పెద్ద సినిమాల పోటీ ఉన్నప్పటికీ వాటికి ధీటుగా నిలబడతామనే నమ్మకంతో మొన్న 21న మలయాళంలో నేరు విడుదల చేశారు. కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ హీరోగా రూపొందిన ఈ సినిమా కోర్ట్ రూమ్ డ్రామానే అయినప్పటికీ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో నడిపించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. వసూళ్లు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. దీని గురించి మనకెందకనే పాయింట్ కు వద్దాం. నేరు దర్శకుడు జీతూ జోసెఫ్. ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్ అనే కొత్త జానర్ సృష్టించిన దృశ్యం రూపకర్త. అది సృష్టించిన రికార్డులు కేరళలో ఇప్పటికీ చాలా సెంటర్స్ లో అలాగే ఉన్నాయి.
తెలుగు రీమేక్ మొదటి భాగానికి ఆయన దర్శకత్వం వహించకపోయినా దృశ్యం 2 బాధ్యత ఆయనే తీసుకున్నారు. అప్పటి నుంచే వెంకటేష్ తో మంచి స్నేహం ఏర్పడింది. ప్రస్తుతం మోహన్ లాల్ తోనే దృశ్యం 3 ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే వెంకీ ఇక్కడ చేస్తారా లేదానే క్లారిటీ ఇంకా లేదు కానీ నేరు విక్టరీ హీరోకి బాగా సూటవుతుందనే నమ్మకంతో జీతూ జోసెఫ్ స్వయంగా ఓ సారి చూడమని వెంకీని రిక్వెస్ట్ చేశారట. సైంధవ్ ప్రమోషన్లలో బిజీగా ఉన్న వెంకటేష్ తప్పకుండ చూస్తానని మాటిచ్చి తన టీమ్ తో నేరు సక్సెస్ గురించి ఎంక్వయిరీ చేయిస్తున్నట్టు తెలిసింది.
ఒకవేళ నచ్చితే ఈ కాంబోలో తెరకెక్కే అవకాశాలు లేకపోలేదు. నేరు డబ్బింగ్ రైట్స్ ఎవరికీ లేదు. రీమేక్ అయ్యేంత స్ట్రాంగ్ కంటెంట్ కావడంతో హక్కులు నిర్మాణ సంస్థ తమ వద్దనే ఉంచుకుంది. హైదరాబాద్ లో వేసిన పరిమిత షోలు ఫుల్స్ అవ్వడం చూస్తే ఇక్కడి జనాలకు కూడా కనెక్ట్ అవుతోందని అర్థమవుతోంది. ఒక చూపు లేని అమ్మాయి మానభంగానికి గురైతే దోషులను పట్టించే క్రమంలో లాయరైన హీరో ఎలా సహాయపడ్డాడనే పాయింట్ తో ఇది రూపొందింది. లైన్ సింపుల్ గా అనిపించినా కథనం బిగి సడలకుండా సాగుతుంది. వెంకటేష్ చేస్తే ధర్మచక్రం రేంజ్ లో ఉంటుందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.
This post was last modified on December 23, 2023 10:07 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…