సలార్, డంకీ లాంటి పెద్ద సినిమాల పోటీ ఉన్నప్పటికీ వాటికి ధీటుగా నిలబడతామనే నమ్మకంతో మొన్న 21న మలయాళంలో నేరు విడుదల చేశారు. కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ హీరోగా రూపొందిన ఈ సినిమా కోర్ట్ రూమ్ డ్రామానే అయినప్పటికీ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో నడిపించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. వసూళ్లు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. దీని గురించి మనకెందకనే పాయింట్ కు వద్దాం. నేరు దర్శకుడు జీతూ జోసెఫ్. ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్ అనే కొత్త జానర్ సృష్టించిన దృశ్యం రూపకర్త. అది సృష్టించిన రికార్డులు కేరళలో ఇప్పటికీ చాలా సెంటర్స్ లో అలాగే ఉన్నాయి.
తెలుగు రీమేక్ మొదటి భాగానికి ఆయన దర్శకత్వం వహించకపోయినా దృశ్యం 2 బాధ్యత ఆయనే తీసుకున్నారు. అప్పటి నుంచే వెంకటేష్ తో మంచి స్నేహం ఏర్పడింది. ప్రస్తుతం మోహన్ లాల్ తోనే దృశ్యం 3 ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే వెంకీ ఇక్కడ చేస్తారా లేదానే క్లారిటీ ఇంకా లేదు కానీ నేరు విక్టరీ హీరోకి బాగా సూటవుతుందనే నమ్మకంతో జీతూ జోసెఫ్ స్వయంగా ఓ సారి చూడమని వెంకీని రిక్వెస్ట్ చేశారట. సైంధవ్ ప్రమోషన్లలో బిజీగా ఉన్న వెంకటేష్ తప్పకుండ చూస్తానని మాటిచ్చి తన టీమ్ తో నేరు సక్సెస్ గురించి ఎంక్వయిరీ చేయిస్తున్నట్టు తెలిసింది.
ఒకవేళ నచ్చితే ఈ కాంబోలో తెరకెక్కే అవకాశాలు లేకపోలేదు. నేరు డబ్బింగ్ రైట్స్ ఎవరికీ లేదు. రీమేక్ అయ్యేంత స్ట్రాంగ్ కంటెంట్ కావడంతో హక్కులు నిర్మాణ సంస్థ తమ వద్దనే ఉంచుకుంది. హైదరాబాద్ లో వేసిన పరిమిత షోలు ఫుల్స్ అవ్వడం చూస్తే ఇక్కడి జనాలకు కూడా కనెక్ట్ అవుతోందని అర్థమవుతోంది. ఒక చూపు లేని అమ్మాయి మానభంగానికి గురైతే దోషులను పట్టించే క్రమంలో లాయరైన హీరో ఎలా సహాయపడ్డాడనే పాయింట్ తో ఇది రూపొందింది. లైన్ సింపుల్ గా అనిపించినా కథనం బిగి సడలకుండా సాగుతుంది. వెంకటేష్ చేస్తే ధర్మచక్రం రేంజ్ లో ఉంటుందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.
This post was last modified on December 23, 2023 10:07 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…