జనవరి బాక్సాఫీస్ ని విపరీతంగా వేడెక్కించబోతున్న సంక్రాంతి సినిమాల పంచాయితీలో టాలీవుడ్ పెద్దల మంతనాలు ఇంకా కొలిక్కి రావడం లేదని వినికిడి. నిన్న జరిగిన సమావేశంలో ఒకరిద్దరిని వాయిదా లేదా ముందే రిలీజ్ చేసేలా ఒప్పించే క్రమంలో ఎలాంటి ఫలితం కనిపించలేదని ఫిలిం నగర్ టాక్. జనవరి 12 గుంటూరు కారం ఉంది కాబట్టి ఒకరోజు ముందు హనుమాన్ వస్తే ఉభయకుశలోపరిగా ఉంటుందనే ప్రతిపాదన ఫలించలేదట. అలాగే ఎవరో ఒకరు నూతన సంవత్సర కానుకగా ఒకటో తేదీనే తమ సినిమా రిలీజ్ చేస్తే పది రోజుల ఓపెన్ గ్రౌండ్ దొరుకుతుందనే పాయింట్ కూడా చెల్లలేదట.
దిల్ రాజు, నాగవంశీ, సురేష్ బాబు, విశ్వప్రసాద్ తదితరులు దీని గురించి ఎంత రాయబారాలు జరుపుతున్నా పని జరగడం లేదని ఇన్ సైడ్ టాక్. ముందు వెనుక జరిగేందుకు ఇష్టపడకుండా అందరూ మొండిపట్టు పట్టేందుకు కారణం ఉంది. అదే థియేటర్ల సమస్య. చాలా కేంద్రాల్లో అయిదు సినిమాలకు సరిపడా స్క్రీన్లు అందుబాటులో లేవు. మహేష్ బాబు రేంజ్ హీరోకి ఎంత చిన్న సెంటరైనా సరే కనీసం రెండు హాళ్లలో వేయకపోతే డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతారు. ఓవర్ ఫ్లో క్రౌడ్ మిగిలిన సినిమాలకు వెళ్ళిపోతే కలెక్షన్లు పంచుకోవాల్సి ఉంటుంది. దేనికవే విభిన్నంగా అనిపించే జానర్లు కావడం మరో సమస్య.
ఏదున్నా ఈ రెండు మూడు రోజుల్లో తేల్చేయాలి. దానికి అనుగుణంగానే పబ్లిసిటీని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. నా సామిరంగ మాత్రం జనవరి 14 లాక్ చేసుకుందని ఇన్ సైడ్ టాక్. 12 గుంటూరు కారం-హనుమాన్, 13 ఈగల్-సైంధవ్ ప్రస్తుతానికి ఇదే డేట్ల మీద ఉన్నాయి. ధనుష్ కెప్టెన్ మిల్లర్, శివ కార్తికేయన్ అయలన్ లు ట్రైలర్ తో పాటు తేదీలను ప్రకటించబోతున్నాయి. ఇవి తమిళంతో పాటు తెలుగులో సమాంతర విడుదలకు పట్టుబడుతున్నాయి. డబ్బింగ్ సినిమాల విషయంలో ఈసారి కఠినంగా ఉండక తప్పేలా లేదు. ఫైనల్ గా ఎవరు తగ్గుతారో ఎవరు పట్టుమీదే ఉండి పంతం నెగ్గించుకుంటారో వేచి చూడాలి.
పెద్ది ఇప్పుడు రామ్ చరణ్ కెరీర్లో మరో చాలెంజ్ లాంటి ప్రాజెక్టు. RRR తర్వాత వచ్చిన గ్లోబల్ ఇమేజ్ని నిలబెట్టుకోవాలి.…
ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా సినిమా అయినా దాన్ని జనంలోకి తీసుకెళ్లాలంటే ప్రచారం తప్పనిసరి. కంటెంట్ ఉంటే చాలు ఇంకేం…
టాలీవుడ్ టాప్ హీరోలు వేగంగా సినిమాలు చేయాలని, ఏడాదికి ఒకట్రెండు రిలీజ్లు ఉండేలా చూసుకోవాలని ఇటు ఇండస్ట్రీ జనాలు, అటు…
ఒకప్పుడు యాక్షన్ కింగ్ గా మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో అర్జున్. తెలుగులో మా పల్లెలో గోపాలుడు లాంటి…
రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ ఐపీఎల్ సీజన్ను పూర్తిగా తన సొంతం…
ఐపీఎల్ ఫైనల్స్ లో ఆర్సీబీ వరుసగా రెండోసారి కప్పు గెలవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ ఆ…