జనవరి బాక్సాఫీస్ ని విపరీతంగా వేడెక్కించబోతున్న సంక్రాంతి సినిమాల పంచాయితీలో టాలీవుడ్ పెద్దల మంతనాలు ఇంకా కొలిక్కి రావడం లేదని వినికిడి. నిన్న జరిగిన సమావేశంలో ఒకరిద్దరిని వాయిదా లేదా ముందే రిలీజ్ చేసేలా ఒప్పించే క్రమంలో ఎలాంటి ఫలితం కనిపించలేదని ఫిలిం నగర్ టాక్. జనవరి 12 గుంటూరు కారం ఉంది కాబట్టి ఒకరోజు ముందు హనుమాన్ వస్తే ఉభయకుశలోపరిగా ఉంటుందనే ప్రతిపాదన ఫలించలేదట. అలాగే ఎవరో ఒకరు నూతన సంవత్సర కానుకగా ఒకటో తేదీనే తమ సినిమా రిలీజ్ చేస్తే పది రోజుల ఓపెన్ గ్రౌండ్ దొరుకుతుందనే పాయింట్ కూడా చెల్లలేదట.
దిల్ రాజు, నాగవంశీ, సురేష్ బాబు, విశ్వప్రసాద్ తదితరులు దీని గురించి ఎంత రాయబారాలు జరుపుతున్నా పని జరగడం లేదని ఇన్ సైడ్ టాక్. ముందు వెనుక జరిగేందుకు ఇష్టపడకుండా అందరూ మొండిపట్టు పట్టేందుకు కారణం ఉంది. అదే థియేటర్ల సమస్య. చాలా కేంద్రాల్లో అయిదు సినిమాలకు సరిపడా స్క్రీన్లు అందుబాటులో లేవు. మహేష్ బాబు రేంజ్ హీరోకి ఎంత చిన్న సెంటరైనా సరే కనీసం రెండు హాళ్లలో వేయకపోతే డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతారు. ఓవర్ ఫ్లో క్రౌడ్ మిగిలిన సినిమాలకు వెళ్ళిపోతే కలెక్షన్లు పంచుకోవాల్సి ఉంటుంది. దేనికవే విభిన్నంగా అనిపించే జానర్లు కావడం మరో సమస్య.
ఏదున్నా ఈ రెండు మూడు రోజుల్లో తేల్చేయాలి. దానికి అనుగుణంగానే పబ్లిసిటీని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. నా సామిరంగ మాత్రం జనవరి 14 లాక్ చేసుకుందని ఇన్ సైడ్ టాక్. 12 గుంటూరు కారం-హనుమాన్, 13 ఈగల్-సైంధవ్ ప్రస్తుతానికి ఇదే డేట్ల మీద ఉన్నాయి. ధనుష్ కెప్టెన్ మిల్లర్, శివ కార్తికేయన్ అయలన్ లు ట్రైలర్ తో పాటు తేదీలను ప్రకటించబోతున్నాయి. ఇవి తమిళంతో పాటు తెలుగులో సమాంతర విడుదలకు పట్టుబడుతున్నాయి. డబ్బింగ్ సినిమాల విషయంలో ఈసారి కఠినంగా ఉండక తప్పేలా లేదు. ఫైనల్ గా ఎవరు తగ్గుతారో ఎవరు పట్టుమీదే ఉండి పంతం నెగ్గించుకుంటారో వేచి చూడాలి.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…