జనవరి బాక్సాఫీస్ ని విపరీతంగా వేడెక్కించబోతున్న సంక్రాంతి సినిమాల పంచాయితీలో టాలీవుడ్ పెద్దల మంతనాలు ఇంకా కొలిక్కి రావడం లేదని వినికిడి. నిన్న జరిగిన సమావేశంలో ఒకరిద్దరిని వాయిదా లేదా ముందే రిలీజ్ చేసేలా ఒప్పించే క్రమంలో ఎలాంటి ఫలితం కనిపించలేదని ఫిలిం నగర్ టాక్. జనవరి 12 గుంటూరు కారం ఉంది కాబట్టి ఒకరోజు ముందు హనుమాన్ వస్తే ఉభయకుశలోపరిగా ఉంటుందనే ప్రతిపాదన ఫలించలేదట. అలాగే ఎవరో ఒకరు నూతన సంవత్సర కానుకగా ఒకటో తేదీనే తమ సినిమా రిలీజ్ చేస్తే పది రోజుల ఓపెన్ గ్రౌండ్ దొరుకుతుందనే పాయింట్ కూడా చెల్లలేదట.
దిల్ రాజు, నాగవంశీ, సురేష్ బాబు, విశ్వప్రసాద్ తదితరులు దీని గురించి ఎంత రాయబారాలు జరుపుతున్నా పని జరగడం లేదని ఇన్ సైడ్ టాక్. ముందు వెనుక జరిగేందుకు ఇష్టపడకుండా అందరూ మొండిపట్టు పట్టేందుకు కారణం ఉంది. అదే థియేటర్ల సమస్య. చాలా కేంద్రాల్లో అయిదు సినిమాలకు సరిపడా స్క్రీన్లు అందుబాటులో లేవు. మహేష్ బాబు రేంజ్ హీరోకి ఎంత చిన్న సెంటరైనా సరే కనీసం రెండు హాళ్లలో వేయకపోతే డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతారు. ఓవర్ ఫ్లో క్రౌడ్ మిగిలిన సినిమాలకు వెళ్ళిపోతే కలెక్షన్లు పంచుకోవాల్సి ఉంటుంది. దేనికవే విభిన్నంగా అనిపించే జానర్లు కావడం మరో సమస్య.
ఏదున్నా ఈ రెండు మూడు రోజుల్లో తేల్చేయాలి. దానికి అనుగుణంగానే పబ్లిసిటీని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. నా సామిరంగ మాత్రం జనవరి 14 లాక్ చేసుకుందని ఇన్ సైడ్ టాక్. 12 గుంటూరు కారం-హనుమాన్, 13 ఈగల్-సైంధవ్ ప్రస్తుతానికి ఇదే డేట్ల మీద ఉన్నాయి. ధనుష్ కెప్టెన్ మిల్లర్, శివ కార్తికేయన్ అయలన్ లు ట్రైలర్ తో పాటు తేదీలను ప్రకటించబోతున్నాయి. ఇవి తమిళంతో పాటు తెలుగులో సమాంతర విడుదలకు పట్టుబడుతున్నాయి. డబ్బింగ్ సినిమాల విషయంలో ఈసారి కఠినంగా ఉండక తప్పేలా లేదు. ఫైనల్ గా ఎవరు తగ్గుతారో ఎవరు పట్టుమీదే ఉండి పంతం నెగ్గించుకుంటారో వేచి చూడాలి.
This post was last modified on December 23, 2023 2:48 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…