శ్రేయా రెడ్డి అంటే ఇప్పటివాళ్లకు వెంటనే గుర్తు రాకపోవచ్చు కానీ విశాల్ పొగరులో లేడీ విలన్ గా బెదరగొట్టిన అమ్మాయంటే వెంటనే ఫ్లాష్ అవుతుంది. తర్వాత ఈవిడే విశాల్ అన్నయ్య విక్రమ్ ని పెళ్లి చేసుకుని గృహిణిగా మారిపోయింది. నిజానికి తన డెబ్యూ తెలుగులోనే జరిగింది. చంద్ర సిద్దార్థ్ దర్శకత్వంలో రాజా హీరోగా 2003లో విడుదలైన అప్పుడప్పుడు తన ఫస్ట్ మూవీ. ఆశించిన ఫలితం అందకపోవడంతో పాటు టాలీవుడ్ డిమాండ్ చేసే స్కిన్ టోన్ కు భిన్నంగా నలుపు వర్ణం కావడంతో అవకాశాలు రాలేదు. అమ్మ చెప్పింది కూడా ఫ్లాప్ బాపతులోకి చేరింది.
తిరిగి ఇంత సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత శ్రేయ రెడ్డికి ఆఫర్లొస్తున్నాయి. ఇవాళ రిలీజైన ప్రభాస్ సలార్ లో జగపతి బాబు కూతురిగా చెప్పుకోదగ్గ స్పేస్ దొరికింది. కథ పరంగా పాత్ర బ్రతికే ఉంది కాబట్టి రెండో భాగంలో ప్రాధాన్యం ఇంకా పెరగనుంది. బాక్సాఫీస్ దగ్గర ప్రస్తుతం సునామి వసూళ్లతో దూసుకుపోతున్న సలార్ తర్వాత శ్రేయ రెడ్డి చేస్తున్న మరో సినిమా పవన్ కళ్యాణ్ ఓజి. ఇందులో కూడా ప్రాముఖ్యం ఉన్న పాత్రే దర్శకుడు సుజిత్ ఇచ్చాడని ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. వీటికన్నా ముందు ప్రైమ్ లో వచ్చిన సుజల్ వెబ్ సిరీస్ మంచి పాపులారిటీ తెచ్చింది.
ప్రభాస్, పవన్ కళ్యాణ్ సినిమాలు రెండూ బ్లాక్ బస్టర్ అయితే శ్రేయ రెడ్డి దశ తిరిగినట్టే. ఎందుకంటే ప్రస్తుతం లేడీ ఆర్టిస్టుల కొరత చాలా ఉంది. అందులోనూ నెగటివ్ షేడ్స్ ఇంత బాగా పలికించే వాళ్ళు దొరకడం కష్టం. అయితే ఈవిడ అన్ని కథలను ఒప్పుకోదట. బాగా నచ్చితే తప్ప అంగీకరించదనే పేరుండటంతో దర్శకులు పెద్దగా కలవడం లేదని చెన్నై టాక్. సరే ఇప్పటికైనా కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే కెరీర్ ని సెటిల్ చేసుకోవచ్చు. సలార్ లో ఈశ్వరిరావు, ఝాన్సీలకన్నా ఎక్కువ శ్రేయ రెడ్డినే హైలైట్ కావడం తనకు ఏ మేరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి.
This post was last modified on December 22, 2023 2:10 pm
ఇటీవల కేరళలో జరిగిన ఒక కార్యక్రమంలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి…
వైసీపీ అధినేత జగన్ను అధికారంలోకి రాకుండా చేస్తానని.. అవసరమైతే.. చంద్రబాబు ఓకే అంటే.. తాను కూడా పాదయాత్రకు రెడీ అంటూ..…
హీరో తిరువీర్ కథల ఎంపిక పట్ల ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఉంది. మాసూద లాంటి హారర్ మూవీ, ది గ్రేట్…
ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్లలో ఒకడు అక్షయ్ కుమార్. ఒక దశలో ఏడాదిలో అత్యధిక ఆదాయం అందుకునే, అత్యధికంగా పన్ను…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా కొనసాగుతున్న టీమిండియా మాజీ కెప్టెన్…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున దక్షిణాదిలో ప్రచారం చేయనున్న…