Movie News

సుకుమార్ మళ్లీ లేటే

టాలీవుడ్లో బాగా నెమ్మదిగా తీసే స్టార్ డైరెక్టర్లలో సుకుమార్ ఒక్కడు. ఆయన స్క్రిప్ట రెడీ చేసుకోవడానికి బాగా టైం తీసుకుంటాడు. మేకింగ్ దశలోనూ అంతే. ప్రతి సన్నివేశం విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించి.. రకరకాల వెర్షన్లు రాయించి.. ఫైన్ ట్యూన్ చేయించి.. ఆన్ లొకేషన్ కూడా బెటర్మెంట్లు చేసి.. సినిమాను లేటు చేస్తాడని ఆయనకు పేరుంది.

ఐతే ‘రంగస్థలం’ సినిమా తర్వాత తనపై అంచనాలు భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో ఈసారి సుకుమార్ స్క్రిప్టు విషయంలో మరీ జాగ్రత్తకు పోయాడని.. దీంతో ‘పుష్ప’ పట్టాలెక్కడానికి బాగా సమయం పట్టేసిందని చిత్ర వర్గాలు చెప్పుకొచ్చాయి. ఐతే అన్నీ పూర్తి చేసుకుని సినిమాను మొదలుపెడదామని చూస్తే కరోనా వచ్చి బ్రేక్ వేసేసింది. ఇక అప్పట్నుంచి ఎప్పుడూ పరిస్థితులు చక్కబడతాయా అని చూస్తున్నారు.

ఐతే కరోనా తీవ్రత మరీ ఏమీ తగ్గిపోకున్నా.. ఇండస్ట్రీలో చాలామంది సెప్టెంబర్లో తమ సినిమాలను మళ్లీ సెట్స్ మీదికి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేసేస్తున్నారు. కొన్ని చిత్రాల బృందాలు ఆల్రెడీ షూటింగ్ మొదలుపెట్టేశాయి కూడా. రాధేశ్యామ్, ఆచార్య, బాలయ్య-బోయపాటి మూవీ లాంటి భారీ ప్రాజెక్టులు ఈ నెలలోనే మళ్లీ చిత్రీకరణకు వెళ్లబోతున్నాయి.

కానీ ‘పుష్ప’ టీం మాత్రం ఇప్పుడిప్పుడే కదిలే సూచనలు కనిపించట్లేదని సమాచారం. అనేక పరిమితుల మధ్య, భయం భయంగా షూటింగ్ చేయడానికి ఇటు అల్లు అర్జున్ కానీ, అటు సుకుమార్ కానీ సిద్ధంగా లేరని చిత్ర వర్గాల సమాచారం. కొంత కాలంగా మూత పడి ఉన్న మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీస్ రెండు రోజుల కిందటే తెరుచుకున్న నేపథ్యంలో మరి కొన్ని రోజుల్లోనే ‘పుష్ప’ షూటింగ్ మొదలుపెడతారని అనుకున్నారు.

కానీ చిత్ర బృందానికి మాత్రం సుకుమార్ నవంబరులోనే షూటింగ్ అని సమాచారం ఇచ్చాడట. ఆరంభంలోనే కీలకమైన ఎపిసోడ్లు తీయాల్సి ఉండటం, రెండు నెలల పాటు అటవీ ప్రాంతంలో నిర్విరామంగా షూటింగ్ చేయడానికి పక్కాగా షెడ్యూల్స్ వేసుకున్న నేపథ్యంలో ఏమాత్రం డిస్టర్బెన్స్ ఉండొద్దన్నది సుకుమార్-బన్నీ ఉద్దేశంగా కనిపిస్తోంది.

This post was last modified on September 3, 2020 1:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

54 minutes ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

4 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

4 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

6 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

8 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

9 hours ago