ఇవాళ డంకీ గురించి ఎక్కువ ఆలోచించి రేపు సలార్ ఎలా చూడాలా అని ప్లాన్ చేసుకుంటున్నాం కానీ మధ్యలో హాలీవుడ్ మూవీ ఆక్వామెన్ ది ఫాలెన్ కింగ్ డం ఈ రోజే విడుదలైంది. దీని మీద విదేశాల్లో ఏమో కానీ ఇండియాలో ఆశించిన క్రేజ్ తెచ్చుకోలేదు. ప్రభాస్ ఒక రోజు ఆలస్యంగా వస్తున్నాడు కాబట్టి సరిపడా థియేటర్లైతే దొరికాయి కానీ ప్రేక్షకుల స్పందన మాత్రం అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. రివ్యూలు సైతం యావరేజ్ లేదా అంతకంటే తక్కువని చెప్పేశాయి. దీంతో త్రీడి వెర్షన్ లో పిల్లలకు మంచి వినోదాన్ని ఇస్తుందన్న సముద్ర పుత్రుడు పరాభవం చెందేలా ఉన్నాడు.
మాములుగా ఇలాంటి కథల్లో పెద్దగా వైవిధ్యం ఉండదు. పాత స్టోరీకే రెండు మూడు అదనపు హంగులు జోడించి విజువల్ ఎఫెక్ట్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెడతారు. కానీ ఆక్వామెన్ 2లో చివరి అరగంట తప్ప మిగిలిన తొంబై నిముషాలు సాగదీసిన స్క్రీన్ ప్లేతో విసుగు పుట్టించారు. 205 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్ తో ఇది రూపొందింది. గ్రాఫిక్స్ మీద శ్రద్ధ పెట్టారు కానీ అసలైన కంటెంట్ ఎంగేజింగ్ గా ఉందో లేదో చూసుకోలేదు. హీరో జేసన్ మెమో ఫ్యాన్స్ ని నిరాశపరచకపోయినా తెరపై చూపించిన విధానం తేడా కొట్టడంతో ఒకదశ దాటాక నిస్సహాయుడిగా మారిపోయాడు.
లోతైన సముద్రపు అగాథం, చిత్ర విచిత్రమైన జలచరాలు, ఊహల్లో మాత్రమే కనిపించే సరికొత్త ప్రపంచం, నమ్మశక్యం కానీ ఫైట్లు ఇలాంటి హంగులు ఎన్ని ఉన్నా సముద్రపుత్రుడు విసుగు పుట్టకుండా చేయలేకపోయాడు. సో సలార్ కు మొదటి రూటు డంకీ మిక్స్డ్ అండ్ నెగటివ్ టాక్ తో క్లియర్ కాగా ఇప్పుడు రెండో దారి ఆక్వామెన్ రివ్యూలతో స్పష్టమైంది. రేపు ఉదయం కనక ప్రభాస్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంటే వసూళ్ల సునామి మాములుగా ఉండదు. ఓవర్సీస్ లో ఎక్కువ థియేటర్లు, షోలు రాబట్టుకున్న ఆక్వామెన్ ఇప్పుడీ ఫలితం చూశాకైనా సలారోడికి అదనంగా కేటాయిస్తాడేమో చూడాలి
This post was last modified on December 21, 2023 7:25 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…