ఇవాళ డంకీ గురించి ఎక్కువ ఆలోచించి రేపు సలార్ ఎలా చూడాలా అని ప్లాన్ చేసుకుంటున్నాం కానీ మధ్యలో హాలీవుడ్ మూవీ ఆక్వామెన్ ది ఫాలెన్ కింగ్ డం ఈ రోజే విడుదలైంది. దీని మీద విదేశాల్లో ఏమో కానీ ఇండియాలో ఆశించిన క్రేజ్ తెచ్చుకోలేదు. ప్రభాస్ ఒక రోజు ఆలస్యంగా వస్తున్నాడు కాబట్టి సరిపడా థియేటర్లైతే దొరికాయి కానీ ప్రేక్షకుల స్పందన మాత్రం అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. రివ్యూలు సైతం యావరేజ్ లేదా అంతకంటే తక్కువని చెప్పేశాయి. దీంతో త్రీడి వెర్షన్ లో పిల్లలకు మంచి వినోదాన్ని ఇస్తుందన్న సముద్ర పుత్రుడు పరాభవం చెందేలా ఉన్నాడు.
మాములుగా ఇలాంటి కథల్లో పెద్దగా వైవిధ్యం ఉండదు. పాత స్టోరీకే రెండు మూడు అదనపు హంగులు జోడించి విజువల్ ఎఫెక్ట్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెడతారు. కానీ ఆక్వామెన్ 2లో చివరి అరగంట తప్ప మిగిలిన తొంబై నిముషాలు సాగదీసిన స్క్రీన్ ప్లేతో విసుగు పుట్టించారు. 205 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్ తో ఇది రూపొందింది. గ్రాఫిక్స్ మీద శ్రద్ధ పెట్టారు కానీ అసలైన కంటెంట్ ఎంగేజింగ్ గా ఉందో లేదో చూసుకోలేదు. హీరో జేసన్ మెమో ఫ్యాన్స్ ని నిరాశపరచకపోయినా తెరపై చూపించిన విధానం తేడా కొట్టడంతో ఒకదశ దాటాక నిస్సహాయుడిగా మారిపోయాడు.
లోతైన సముద్రపు అగాథం, చిత్ర విచిత్రమైన జలచరాలు, ఊహల్లో మాత్రమే కనిపించే సరికొత్త ప్రపంచం, నమ్మశక్యం కానీ ఫైట్లు ఇలాంటి హంగులు ఎన్ని ఉన్నా సముద్రపుత్రుడు విసుగు పుట్టకుండా చేయలేకపోయాడు. సో సలార్ కు మొదటి రూటు డంకీ మిక్స్డ్ అండ్ నెగటివ్ టాక్ తో క్లియర్ కాగా ఇప్పుడు రెండో దారి ఆక్వామెన్ రివ్యూలతో స్పష్టమైంది. రేపు ఉదయం కనక ప్రభాస్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంటే వసూళ్ల సునామి మాములుగా ఉండదు. ఓవర్సీస్ లో ఎక్కువ థియేటర్లు, షోలు రాబట్టుకున్న ఆక్వామెన్ ఇప్పుడీ ఫలితం చూశాకైనా సలారోడికి అదనంగా కేటాయిస్తాడేమో చూడాలి
This post was last modified on December 21, 2023 7:25 pm
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…
ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు పెద్ద వివాదానికి…