భారీ అంచనాల మధ్య సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజ్ లో జరుగుతున్నాయి. మళ్లీ బాహుబలి రోజులు గుర్తుకు వస్తున్నాయి జనాలకు. ఈ సినిమా మీద చిత్ర బృందం మొత్తం పూర్తి ధీమాతో ఉన్నట్లే కనిపిస్తోంది. అయితే దర్శకుడు ప్రశాంతిని మాత్రం కొంచెం టెన్షన్ పడుతున్నట్లున్నాడు. అందుకు కారణం సలార్ సినిమా అతడికి నచ్చేయడమేనట.
సినిమా నచ్చితే సక్సెస్ మీద ఇంకా ధీమాగా ఉండాలి కదా టెన్షన్ పడడం ఏంటి అనిపించవచ్చు. కానీ అదే ట్విస్టు అంటున్నాడు ప్రశాంత్. సలార్ ప్రశాంత్ నాలుగో సినిమా కాగా.. ఇంతకు ముందు అతను తీసిన ఉగ్రం, కేజిఎఫ్ -1, కేజీఎఫ్ -2 చిత్రాలను రిలీజ్ ముందు చూసుకున్నప్పుడు అతడికవి అంతగా నచ్చలేదట. ప్రేక్షకులకు మాత్రం ఆ సినిమాలు విపరీతంగా వచ్చి బ్లాక్ బస్టర్లు అయ్యాయి. కానీ సలార్ మాత్రం చూసుకుంటే తనకు బాగా నచ్చిందని.. ప్రేక్షకులు ఈ సినిమా చూసి ఎలా ఫీల్ అవుతారో అని టెన్షన్ పడుతున్నానని ప్రశాంత్.. ప్రభాస్, పృథ్వీరాజ్, రాజమౌళిలతో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు.
తొలి 3 సినిమాల అనుభవంతో తనకు ఇకపై ఏ సినిమా కూడా నచ్చకూడదని ఒక మూఢనమ్మకం పెట్టుకున్నానని.. కానీ సలార్ మాత్రం తనకు నచ్చడంతో నెర్వస్ ఫీల్ అవుతున్నానని ప్రశాంత్ తెలిపాడు. ఇక తొలి మూడు సినిమాల్లో ఎక్కువగా ఎలివేషన్లు, యాక్షన్ కట్టాలపై ఆధారపడిన తాను సలార్ లో మాత్రం ఒక బలమైన కథ చెప్పానని… ఇందులో డ్రామా ప్రధానంగా ఉంటుందని, నిజానికి అది తన బలం కాకపోయినా ఈసారి కొత్తగా ప్రయత్నిద్దామని డ్రామా మీద దృష్టి సారించానని.. ఈ విషయంలో రాజమౌళి కూడా తాను స్ఫూర్తిగా తీసుకున్నానని.. ట్రైలర్లో పాత్రలు తప్ప డ్రామా కనిపించలేదని.. కానీ సినిమాలో చాలా డ్రామా ఉంటుందని ప్రశాంత్ పేర్కొన్నాడు.
This post was last modified on December 20, 2023 4:22 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…