భారీ అంచనాల మధ్య సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజ్ లో జరుగుతున్నాయి. మళ్లీ బాహుబలి రోజులు గుర్తుకు వస్తున్నాయి జనాలకు. ఈ సినిమా మీద చిత్ర బృందం మొత్తం పూర్తి ధీమాతో ఉన్నట్లే కనిపిస్తోంది. అయితే దర్శకుడు ప్రశాంతిని మాత్రం కొంచెం టెన్షన్ పడుతున్నట్లున్నాడు. అందుకు కారణం సలార్ సినిమా అతడికి నచ్చేయడమేనట.
సినిమా నచ్చితే సక్సెస్ మీద ఇంకా ధీమాగా ఉండాలి కదా టెన్షన్ పడడం ఏంటి అనిపించవచ్చు. కానీ అదే ట్విస్టు అంటున్నాడు ప్రశాంత్. సలార్ ప్రశాంత్ నాలుగో సినిమా కాగా.. ఇంతకు ముందు అతను తీసిన ఉగ్రం, కేజిఎఫ్ -1, కేజీఎఫ్ -2 చిత్రాలను రిలీజ్ ముందు చూసుకున్నప్పుడు అతడికవి అంతగా నచ్చలేదట. ప్రేక్షకులకు మాత్రం ఆ సినిమాలు విపరీతంగా వచ్చి బ్లాక్ బస్టర్లు అయ్యాయి. కానీ సలార్ మాత్రం చూసుకుంటే తనకు బాగా నచ్చిందని.. ప్రేక్షకులు ఈ సినిమా చూసి ఎలా ఫీల్ అవుతారో అని టెన్షన్ పడుతున్నానని ప్రశాంత్.. ప్రభాస్, పృథ్వీరాజ్, రాజమౌళిలతో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు.
తొలి 3 సినిమాల అనుభవంతో తనకు ఇకపై ఏ సినిమా కూడా నచ్చకూడదని ఒక మూఢనమ్మకం పెట్టుకున్నానని.. కానీ సలార్ మాత్రం తనకు నచ్చడంతో నెర్వస్ ఫీల్ అవుతున్నానని ప్రశాంత్ తెలిపాడు. ఇక తొలి మూడు సినిమాల్లో ఎక్కువగా ఎలివేషన్లు, యాక్షన్ కట్టాలపై ఆధారపడిన తాను సలార్ లో మాత్రం ఒక బలమైన కథ చెప్పానని… ఇందులో డ్రామా ప్రధానంగా ఉంటుందని, నిజానికి అది తన బలం కాకపోయినా ఈసారి కొత్తగా ప్రయత్నిద్దామని డ్రామా మీద దృష్టి సారించానని.. ఈ విషయంలో రాజమౌళి కూడా తాను స్ఫూర్తిగా తీసుకున్నానని.. ట్రైలర్లో పాత్రలు తప్ప డ్రామా కనిపించలేదని.. కానీ సినిమాలో చాలా డ్రామా ఉంటుందని ప్రశాంత్ పేర్కొన్నాడు.
This post was last modified on December 20, 2023 4:22 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…