భారీ అంచనాల మధ్య సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజ్ లో జరుగుతున్నాయి. మళ్లీ బాహుబలి రోజులు గుర్తుకు వస్తున్నాయి జనాలకు. ఈ సినిమా మీద చిత్ర బృందం మొత్తం పూర్తి ధీమాతో ఉన్నట్లే కనిపిస్తోంది. అయితే దర్శకుడు ప్రశాంతిని మాత్రం కొంచెం టెన్షన్ పడుతున్నట్లున్నాడు. అందుకు కారణం సలార్ సినిమా అతడికి నచ్చేయడమేనట.
సినిమా నచ్చితే సక్సెస్ మీద ఇంకా ధీమాగా ఉండాలి కదా టెన్షన్ పడడం ఏంటి అనిపించవచ్చు. కానీ అదే ట్విస్టు అంటున్నాడు ప్రశాంత్. సలార్ ప్రశాంత్ నాలుగో సినిమా కాగా.. ఇంతకు ముందు అతను తీసిన ఉగ్రం, కేజిఎఫ్ -1, కేజీఎఫ్ -2 చిత్రాలను రిలీజ్ ముందు చూసుకున్నప్పుడు అతడికవి అంతగా నచ్చలేదట. ప్రేక్షకులకు మాత్రం ఆ సినిమాలు విపరీతంగా వచ్చి బ్లాక్ బస్టర్లు అయ్యాయి. కానీ సలార్ మాత్రం చూసుకుంటే తనకు బాగా నచ్చిందని.. ప్రేక్షకులు ఈ సినిమా చూసి ఎలా ఫీల్ అవుతారో అని టెన్షన్ పడుతున్నానని ప్రశాంత్.. ప్రభాస్, పృథ్వీరాజ్, రాజమౌళిలతో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు.
తొలి 3 సినిమాల అనుభవంతో తనకు ఇకపై ఏ సినిమా కూడా నచ్చకూడదని ఒక మూఢనమ్మకం పెట్టుకున్నానని.. కానీ సలార్ మాత్రం తనకు నచ్చడంతో నెర్వస్ ఫీల్ అవుతున్నానని ప్రశాంత్ తెలిపాడు. ఇక తొలి మూడు సినిమాల్లో ఎక్కువగా ఎలివేషన్లు, యాక్షన్ కట్టాలపై ఆధారపడిన తాను సలార్ లో మాత్రం ఒక బలమైన కథ చెప్పానని… ఇందులో డ్రామా ప్రధానంగా ఉంటుందని, నిజానికి అది తన బలం కాకపోయినా ఈసారి కొత్తగా ప్రయత్నిద్దామని డ్రామా మీద దృష్టి సారించానని.. ఈ విషయంలో రాజమౌళి కూడా తాను స్ఫూర్తిగా తీసుకున్నానని.. ట్రైలర్లో పాత్రలు తప్ప డ్రామా కనిపించలేదని.. కానీ సినిమాలో చాలా డ్రామా ఉంటుందని ప్రశాంత్ పేర్కొన్నాడు.
This post was last modified on December 20, 2023 4:22 pm
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు(అసెంబ్లీ+పార్లమెంటు) ప్రశాంతంగా జరిగాయని ఎన్నికలు సంఘం చెబుతోంది. అయితే.. ప్రశాంతత కొన్ని నియోజకవర్గాలకు.. జిల్లాలకు మాత్రమే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన శిల్పా రవికి ప్రచారం…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల అధికార వైఎస్సార్ పార్టీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డ ఉదంతాలు మీడియాలో…
ఎన్నికల అంకం ముగింపుకొస్తున్న తరుణంలో అందరి దృష్టి క్రమంగా సినిమాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా…
కీలకమైన నాలుగోదశ ఎన్నికల పోలింగ్ సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవా ల్.. సంచలన ప్రకటన చేశారు.…