మాములుగా ప్రభాస్ సినిమా అంటేనే పిల్లా పెద్ద తేడా లేకుండా అందరూ చూసేది. అలాంటిది సలార్ కు సెన్సార్ బోర్డ్ అడల్ట్స్ ఒన్లీ A ఇవ్వడం పట్ల అభిమానులు ఒకింత షాక్ కు గురైన మాట వాస్తవం. ఏదో యానిమల్ లాగా పెద్దలు మాత్రమే చూసే సన్నివేశాలు ఉంటే ఏదో అనుకోవచ్చు. కెజిఎఫ్ తో ఇండియా వైడ్ ఆడియన్స్ ని మెప్పించిన ప్రశాంత్ నీల్ ఇలాంటి కంటెంట్ తీయడనే నమ్మకమే అందరిదీ. దానికి సంబంధించిన క్లారిటీ స్వయంగా ఆయనే ఇచ్చారు. ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్ లతో కలిసి రాజమౌళి జాయింట్ గా చేసిన ఇంటర్వ్యూలో A ఎందుకు తీసుకున్నామో వివరించారు
ప్రివ్యూ అయ్యాక సెన్సార్ అధికారులు చాలా కట్స్ చెప్పారు. దానికి ఇష్టం లేకపోయినా ప్రశాంత్ నీల్ ఓకే చెప్పాడు. కానీ ప్రత్యేకంగా కొన్ని తొలగింపులు మాత్రం కథ వెళ్లే ఫ్లోని దెబ్బ తీస్తాయని భావించి ఏం చేద్దామని ప్రభాస్ ని అడిగితే సింపుల్ గా ఏ తీసుకోమని చెప్పాడట. అంతే ఇక మరుక్షణం ఆలోచించకుండా కత్తెరింపులు వద్దని చెప్పేశారు. ఫలితంగా యు/ఏ బదులు కేవలం ఏ మాత్రమే వచ్చింది. అయినా దీని వల్ల వసూళ్లు ప్రభావితం చెందుతాయని అనుకోవడానికి లేదు. ఎందుకంటే యానిమల్ కు ఎనిమిది వందల కోట్లు వచ్చాయంటే కేవలం పెద్దలు చూసినందు వల్ల కాదు.
అయినా మల్టీప్లెక్సులు ఎంత ప్రయత్నించినా సలార్ కు వచ్చే తాకిడిలో ప్రతి ప్రేక్షకుడి వయసు చూసి చెక్ చేసేంత తీరిక, వెసులుబాటు ఉండవు. ఏదో చిన్న పిల్లలను నిలువరించే ప్రయత్నం చేసినా వాళ్ళను తీసుకొచ్చిన పెద్దలతో ఆర్గుమెంట్ తప్ప ఇంకే ప్రయోజనం ఉండదు. ఎందుకంటే బాహుబలి, ఆదిపురుష్ హీరో మీద నమ్మకం అలాంటిది. అయినా సలార్ లో తాను చూపించింది అవసరమైన రక్తపాతమే తప్ప బలవంతంగా ఇరికించిన హింస ఏ మాత్రం కాదని స్పష్టంగా చెప్పారు నీల్. రొమాన్స్, సెక్స్, సెట్ సాంగ్స్ ఇవేవి ఉండవని మరోసారి నొక్కి చెప్పారు.
అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…
అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు ఎప్పుడు కష్టం వచ్చినా… ఆదుకునేందుకు కర్ణాకట కొత్త సీఎం డీకే శివకుమార్ సదా…
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ కు…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో సోమవారం భారీ ప్రమాదం సంభవించింది. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు.…