మాములుగా ప్రభాస్ సినిమా అంటేనే పిల్లా పెద్ద తేడా లేకుండా అందరూ చూసేది. అలాంటిది సలార్ కు సెన్సార్ బోర్డ్ అడల్ట్స్ ఒన్లీ A ఇవ్వడం పట్ల అభిమానులు ఒకింత షాక్ కు గురైన మాట వాస్తవం. ఏదో యానిమల్ లాగా పెద్దలు మాత్రమే చూసే సన్నివేశాలు ఉంటే ఏదో అనుకోవచ్చు. కెజిఎఫ్ తో ఇండియా వైడ్ ఆడియన్స్ ని మెప్పించిన ప్రశాంత్ నీల్ ఇలాంటి కంటెంట్ తీయడనే నమ్మకమే అందరిదీ. దానికి సంబంధించిన క్లారిటీ స్వయంగా ఆయనే ఇచ్చారు. ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్ లతో కలిసి రాజమౌళి జాయింట్ గా చేసిన ఇంటర్వ్యూలో A ఎందుకు తీసుకున్నామో వివరించారు
ప్రివ్యూ అయ్యాక సెన్సార్ అధికారులు చాలా కట్స్ చెప్పారు. దానికి ఇష్టం లేకపోయినా ప్రశాంత్ నీల్ ఓకే చెప్పాడు. కానీ ప్రత్యేకంగా కొన్ని తొలగింపులు మాత్రం కథ వెళ్లే ఫ్లోని దెబ్బ తీస్తాయని భావించి ఏం చేద్దామని ప్రభాస్ ని అడిగితే సింపుల్ గా ఏ తీసుకోమని చెప్పాడట. అంతే ఇక మరుక్షణం ఆలోచించకుండా కత్తెరింపులు వద్దని చెప్పేశారు. ఫలితంగా యు/ఏ బదులు కేవలం ఏ మాత్రమే వచ్చింది. అయినా దీని వల్ల వసూళ్లు ప్రభావితం చెందుతాయని అనుకోవడానికి లేదు. ఎందుకంటే యానిమల్ కు ఎనిమిది వందల కోట్లు వచ్చాయంటే కేవలం పెద్దలు చూసినందు వల్ల కాదు.
అయినా మల్టీప్లెక్సులు ఎంత ప్రయత్నించినా సలార్ కు వచ్చే తాకిడిలో ప్రతి ప్రేక్షకుడి వయసు చూసి చెక్ చేసేంత తీరిక, వెసులుబాటు ఉండవు. ఏదో చిన్న పిల్లలను నిలువరించే ప్రయత్నం చేసినా వాళ్ళను తీసుకొచ్చిన పెద్దలతో ఆర్గుమెంట్ తప్ప ఇంకే ప్రయోజనం ఉండదు. ఎందుకంటే బాహుబలి, ఆదిపురుష్ హీరో మీద నమ్మకం అలాంటిది. అయినా సలార్ లో తాను చూపించింది అవసరమైన రక్తపాతమే తప్ప బలవంతంగా ఇరికించిన హింస ఏ మాత్రం కాదని స్పష్టంగా చెప్పారు నీల్. రొమాన్స్, సెక్స్, సెట్ సాంగ్స్ ఇవేవి ఉండవని మరోసారి నొక్కి చెప్పారు.
This post was last modified on December 20, 2023 1:05 pm
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…