యానిమల్ రూపంలో బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ఒకటి అందుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రేంజ్ ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయింది. క్రేజీ ఆఫర్లతో ఎందరో నిర్మాతలు సిద్ధంగా ఉన్నా ముందే చేసుకున్న కమిట్ మెంట్ ప్రకారం ప్రభాస్ స్పిరిట్, యానిమల్ పార్క్, అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా మూవీ మూడూ టి సిరీస్ నిర్మాణ భాగస్వామ్యంలోనే చేయబోతున్నాడు. ఈ మేరకు నిన్న భూషణ్ కుమార్ తో కలిసి అధికారిక ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సందీప్ వంగా తాజాగా ఒక హిందీ ఇంటర్వ్యూలో ముంబై రివ్యూయర్లు, క్రిటిక్స్ ని ఓ రేంజ్ లో ఎటాక్ చేశాడు.
దీనికి కారణం ఉంది. కబీర్ సింగ్ రిలీజయ్యాక మొదటి రోజే ఉద్దేశపూర్వకంగా కొందరు క్రిటిక్స్ సినిమాను తీవ్రంగా విమర్శిస్తూ వ్యాసాలు రాశారు. అందులో హీరో క్యారెక్టరైజేషన్ గురించి. హీరోయిన్ పాత్ర డిజైన్ గురించి ఏవేవో క్లాసులు తీసుకున్నారు. ఒకటి రెండు రేటింగ్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. తెలుగు వెర్షన్ బ్లాక్ బస్టరని తెలిసి కూడా ఇలా టార్గెట్ చేసిన వైనం స్పష్టంగా కనిపించింది. అయితే జనం వీటిని పట్టించుకోలేదు. కబీర్ సింగ్ ఏకంగా రెండు వందల కోట్లకు పైగా వసూళ్లతో ఆ ఏడాది టాప్ హిట్స్ లో ఒకటిగా నిలచి నిద్రపోతున్న షాహిద్ కపూర్ కెరీర్ ని పరుగులు పెట్టించింది.
తాజాగా సందీప్ వంగా అవన్నీ గుర్తు పెట్టుకుని తిరిగి ఇచ్చేశాడు. తన సినిమా గురించి గతంలో కొందరు ఏ మాత్రం అర్హత లేని నిరక్షరాస్యులు కంటెంట్ గురించి కామెంట్ చేశారని, వాళ్ళు అంత దారుణంగా తిట్టిపోయడం వల్లే గొప్ప సక్సెస్ అందుకున్నాని వెటకారంగా కౌంటర్ వేశాడు. ఏ సినిమా గురించి అయినా సహేతుకంగా విమర్శించే హక్కు అందరికీ ఉంటుంది కానీ కబీర్ సింగ్ విషయంలో నార్త్ మీడియా వ్యవహరించిన తీరు విమర్శలపాలైంది. ఇప్పుడు అదే బృందం యానిమల్ ని ఏమనలేక ఎనిమిది వందల కోట్లు దాటడం చూసి మౌనంగా ఉంది. విజయం తాలూకు దెబ్బ మరి.
This post was last modified on December 20, 2023 10:46 am
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…