తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సలార్ అడ్వాన్స్ బుకింగ్ మొదలుకావడం ఆలస్యం ఆన్ లైన్ యాప్స్ హోరెత్తిపోతున్నాయి. నిన్న రాత్రి 8 గంటల తర్వాత నైజాం టికెట్లు అందుబాటులో ఉంచిన క్షణాల వ్యవథిలో బుక్ మై షో ఏకంగా క్రాష్ కావడం చూసి అభిమానులు షాక్ తిన్నారు. నిజానికి ఇలాంటి స్పందన ఊహించే సదరు యాప్ యాజమాన్యాలు తమ సర్వర్లను అప్ గ్రేడ్ చేసుకుని సిద్ధంగా ఉంటాయి. కాని దాన్ని మించిన ఊచకోత ప్రభాస్ డిసైడ్ అయినప్పుడు ఎవరు మాత్రం చేయగలిగేది ఏముంది. ఇంకా అన్ని థియేటర్లు లిస్ట్ అవుట్ కాలేదు. సగానికి పైగానే అందుబాటులో రావాల్సి ఉంది.
సగటుకు గంటకు 25 వేలకు పైగానే టికెట్లు అమ్ముడుపోవడం సలార్ క్రేజ్ కు నిదర్శనం. తెల్లవారుఝాము ఒంటి, నాలుగు గంటల షోల టికెట్లు రెప్పపాటు వ్యవధిలో అయిపోతున్నాయి. మిగిలిన షోల పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమి లేదు. ప్రధాన మల్టీప్లెక్సులు, మంచి వసతులున్న సింగల్ స్క్రీన్లలో మూడు లేదా ఆపై రోజే టికెట్లు దొరికే పరిస్థితి నెలకొంది. మైత్రి సంస్థ విన్నూత్నంగా కౌంటర్లలో టికెట్లు అమ్మే సంప్రదాయాన్ని అమలు పరిచారు కానీ క్షేత్ర స్థాయిలో చాలా సమస్యలొచ్చాయి. రద్దీని అదుపు చేయలేక పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. కొందరు ఫ్యాన్స్ గాయపడ్డారు.
ఎల్లుండి ఉదయం సూర్యుడు రాకముందే సలార్ టాక్ వచ్చేస్తుంది. దాన్ని బట్టి ట్రెండ్ ఇంకా పైకి వెళ్లడమో లేదో డిసైడ్ అవుతుంది. ప్రస్తుతం సిచువేషన్ చూస్తుంటే మాత్రం టాక్ తో సంబంధం లేకుండా కనీసం వారం రోజుల పాటు థియేటర్లు హోరెత్తిపోయేలా ఉన్నాయి. తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు వంద రూపాయలు అదనంగా ఉన్నా సరే చెల్లించేందుకు ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారని ట్రెండ్స్ చూస్తే అర్థమవుతోంది. పలు చోట్ల మిడ్ నైట్ షో టికెట్ బ్లాక్ లో రెండు నుంచి మూడు వేల రూపాయల దాకా పలుకుతోందట. ఆర్ఆర్ఆర్ తర్వాత దాన్ని మించిన మేనియా సలార్ కు కనిపిస్తోంది
This post was last modified on December 20, 2023 10:19 am
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…
అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…
వైసీపీ అధినేత జగన్ హయాంలో ఓ కుటుంబం రోడ్డున పడింది. కేవలం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి…