తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సలార్ అడ్వాన్స్ బుకింగ్ మొదలుకావడం ఆలస్యం ఆన్ లైన్ యాప్స్ హోరెత్తిపోతున్నాయి. నిన్న రాత్రి 8 గంటల తర్వాత నైజాం టికెట్లు అందుబాటులో ఉంచిన క్షణాల వ్యవథిలో బుక్ మై షో ఏకంగా క్రాష్ కావడం చూసి అభిమానులు షాక్ తిన్నారు. నిజానికి ఇలాంటి స్పందన ఊహించే సదరు యాప్ యాజమాన్యాలు తమ సర్వర్లను అప్ గ్రేడ్ చేసుకుని సిద్ధంగా ఉంటాయి. కాని దాన్ని మించిన ఊచకోత ప్రభాస్ డిసైడ్ అయినప్పుడు ఎవరు మాత్రం చేయగలిగేది ఏముంది. ఇంకా అన్ని థియేటర్లు లిస్ట్ అవుట్ కాలేదు. సగానికి పైగానే అందుబాటులో రావాల్సి ఉంది.
సగటుకు గంటకు 25 వేలకు పైగానే టికెట్లు అమ్ముడుపోవడం సలార్ క్రేజ్ కు నిదర్శనం. తెల్లవారుఝాము ఒంటి, నాలుగు గంటల షోల టికెట్లు రెప్పపాటు వ్యవధిలో అయిపోతున్నాయి. మిగిలిన షోల పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమి లేదు. ప్రధాన మల్టీప్లెక్సులు, మంచి వసతులున్న సింగల్ స్క్రీన్లలో మూడు లేదా ఆపై రోజే టికెట్లు దొరికే పరిస్థితి నెలకొంది. మైత్రి సంస్థ విన్నూత్నంగా కౌంటర్లలో టికెట్లు అమ్మే సంప్రదాయాన్ని అమలు పరిచారు కానీ క్షేత్ర స్థాయిలో చాలా సమస్యలొచ్చాయి. రద్దీని అదుపు చేయలేక పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. కొందరు ఫ్యాన్స్ గాయపడ్డారు.
ఎల్లుండి ఉదయం సూర్యుడు రాకముందే సలార్ టాక్ వచ్చేస్తుంది. దాన్ని బట్టి ట్రెండ్ ఇంకా పైకి వెళ్లడమో లేదో డిసైడ్ అవుతుంది. ప్రస్తుతం సిచువేషన్ చూస్తుంటే మాత్రం టాక్ తో సంబంధం లేకుండా కనీసం వారం రోజుల పాటు థియేటర్లు హోరెత్తిపోయేలా ఉన్నాయి. తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు వంద రూపాయలు అదనంగా ఉన్నా సరే చెల్లించేందుకు ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారని ట్రెండ్స్ చూస్తే అర్థమవుతోంది. పలు చోట్ల మిడ్ నైట్ షో టికెట్ బ్లాక్ లో రెండు నుంచి మూడు వేల రూపాయల దాకా పలుకుతోందట. ఆర్ఆర్ఆర్ తర్వాత దాన్ని మించిన మేనియా సలార్ కు కనిపిస్తోంది
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…