ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అట్లీ ఒకడు. తొలి సినిమా ‘రాజా రాణి’తో మొదలుపెడితే.. ‘తెరి’, ‘మెర్శల్’; ‘బిగిల్’ ఇలా తమిళంలో వరుసగా బ్లాక్బస్టర్లు ఇచ్చాడతను. ఈ ఏడాది అతని నుంచి వచ్చిన బాలీవుడ్ మూవీ ‘జవాన్’ సైతం పెద్ద హిట్ అయింది. అట్లీ ప్రతి సినిమాకూ డివైడ్ టాక్ రావడం.. రొటీన్గా ఉందనడం.. వేరే సినిమాలతో పోలికలు పెట్టడం మామూలే. కానీ ఈ కామెంట్లన్నింటినీ దాటుకుని తన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్నందుకోవడమూ మామూలే.
‘జవాన్’ విషయంలోనూ అదే జరిగింది. ఈ చిత్రం వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్బస్టర్ స్టేటస్ అందుకుంది. వరుసగా 5 బ్లాక్ బస్టర్లు ఇచ్చిన అట్లీ తర్వాత ఎవరితో సినిమా చేస్తాడని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వేర్వేరు ఇండస్ట్రీల నుంచి టాప్ స్టార్లు తనతో సినిమా చేయడానికి ఆసక్తితో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. తెలుగులో అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్లతో ఇంతకుముందే అట్లీ సంప్రదింపులు జరిపాడు. తమిళంలో విజయ్తో మళ్లీ ఇంకో సినిమా చేయొచ్చనే ప్రచారమూ జరిగింది. కానీ ఆయా హీరోలకు ఉన్న వేరే కమిట్మెంట్లు అట్లీతో వెంటనే జట్టు కట్టడానికి అవకాశం ఇవ్వట్లేదట. ఈ పరిస్థితుల్లో మళ్లీ షారుఖ్ తోనే సినిమా చేయడానికి అట్లీ రెడీ అయినట్లు సమాచారం.
‘జవాన్’తో తనకు హీరోగా, నిర్మాతగా కోరుకున్నదానికంటే పెద్ద హిట్ ఇవ్వడంతో షారుఖ్.. అట్లీతో ఇంకో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడట. మళ్లీ తన రెడ్ చిల్లీస్ బ్యానర్లోనే అట్లీతో షారుఖ్ సినిమా చేయబోతున్నాడట. ప్రస్తుతం అట్లీ కథ రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నట్లు సమాచారం. త్వరలోనే సినిమాను చేస్తారని.. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో సినిమా సెట్స్ మీదికి వెళ్తుందని బాలీవుడ్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. దీని తర్వాత అట్లీ.. బన్నీ లేదా తారక్ తో ఓ సినిమా చేసే అవకాశం ఉంది.
టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…
బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…