ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అట్లీ ఒకడు. తొలి సినిమా ‘రాజా రాణి’తో మొదలుపెడితే.. ‘తెరి’, ‘మెర్శల్’; ‘బిగిల్’ ఇలా తమిళంలో వరుసగా బ్లాక్బస్టర్లు ఇచ్చాడతను. ఈ ఏడాది అతని నుంచి వచ్చిన బాలీవుడ్ మూవీ ‘జవాన్’ సైతం పెద్ద హిట్ అయింది. అట్లీ ప్రతి సినిమాకూ డివైడ్ టాక్ రావడం.. రొటీన్గా ఉందనడం.. వేరే సినిమాలతో పోలికలు పెట్టడం మామూలే. కానీ ఈ కామెంట్లన్నింటినీ దాటుకుని తన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్నందుకోవడమూ మామూలే.
‘జవాన్’ విషయంలోనూ అదే జరిగింది. ఈ చిత్రం వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్బస్టర్ స్టేటస్ అందుకుంది. వరుసగా 5 బ్లాక్ బస్టర్లు ఇచ్చిన అట్లీ తర్వాత ఎవరితో సినిమా చేస్తాడని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వేర్వేరు ఇండస్ట్రీల నుంచి టాప్ స్టార్లు తనతో సినిమా చేయడానికి ఆసక్తితో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. తెలుగులో అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్లతో ఇంతకుముందే అట్లీ సంప్రదింపులు జరిపాడు. తమిళంలో విజయ్తో మళ్లీ ఇంకో సినిమా చేయొచ్చనే ప్రచారమూ జరిగింది. కానీ ఆయా హీరోలకు ఉన్న వేరే కమిట్మెంట్లు అట్లీతో వెంటనే జట్టు కట్టడానికి అవకాశం ఇవ్వట్లేదట. ఈ పరిస్థితుల్లో మళ్లీ షారుఖ్ తోనే సినిమా చేయడానికి అట్లీ రెడీ అయినట్లు సమాచారం.
‘జవాన్’తో తనకు హీరోగా, నిర్మాతగా కోరుకున్నదానికంటే పెద్ద హిట్ ఇవ్వడంతో షారుఖ్.. అట్లీతో ఇంకో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడట. మళ్లీ తన రెడ్ చిల్లీస్ బ్యానర్లోనే అట్లీతో షారుఖ్ సినిమా చేయబోతున్నాడట. ప్రస్తుతం అట్లీ కథ రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నట్లు సమాచారం. త్వరలోనే సినిమాను చేస్తారని.. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో సినిమా సెట్స్ మీదికి వెళ్తుందని బాలీవుడ్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. దీని తర్వాత అట్లీ.. బన్నీ లేదా తారక్ తో ఓ సినిమా చేసే అవకాశం ఉంది.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…