ఇప్పుడున్న టెక్నాలజీలో హీరో అయినా దర్శకుడైనా సినిమాలకు సంబంధించి మరెవరైనా సోషల్ మీడియాలో ఉండటం అవసరమే. నేరుగా కలిసే అవకాశం లేకపోయినా పైసా ఖర్చు లేకుండా అభిమానులు, మూవీ లవర్స్ తో మాట్లాడి అప్డేట్స్ ఇచ్చే వెసులుబాటు ఇందులోనే ఉంటుంది. నాణేనికి రెండో వైపులా దీనికి మరో పార్శ్యం ఉంది. అదే నెగటివిటీ. నిన్న దర్శకుడు వెంకటేష్ మహా డంకీ టికెట్ ని పోస్ట్ చేసి తన ఆసక్తిని ప్రదర్శించడం ప్రభాస్ అభిమానులకు ఆగ్రహం కలిగించింది. గతంలో కెజిఎఫ్ గురించి తను చేసిన కామెంట్స్ అప్పట్లో ఎంత హాట్ టాపిక్ గా మారాయో తెలిసిన విషయమే.
దీంతో ఒక్కసారిగా ఇతని మీద ట్వీట్ల దాడి జరిగిపోయింది. సలార్ టికెట్ షేర్ చేయకుండా అదే పనిగా డంకీ మాత్రమే హైలైట్ చేయడం పట్ల కొందరు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా లాభం లేకపోవడంతో వెంకటేష్ మహా చివరికి అకౌంట్ డీ యాక్టివేట్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఇటీవలే గుంటూరు కారం పాట ఫీడ్ బ్యాక్ గురించి గీత రచయిత రామజోగయ్య శాస్త్రి చేసిన హాట్ కామెంట్స్ పట్ల నెటిజెన్ల నుంచి నిరసన వ్యక్తమయ్యింది. ఆయన నాకీ రొంపి వద్దు బాబోయ్ అంటూ సెలవు తీసుకున్నారు. రెండు ట్వీట్లను డిలీట్ చేసిన నిర్మాత నాగవంశీ సైతం ఇబ్బందులు ఎదురుకున్నవాళ్లే.
ఒకరకంగా చెప్పాలంటే ట్విట్టర్, ఇన్స్ టాలు ఫేక్ ప్రపంచాలు. ఒరిజినల్ ఐడిలతో అకౌంట్లు రన్ చేసే వాళ్ళు మహా అయితే పది ఇరవై శాతం ఉంటారు. మిగిలిన బ్యాచ్ మొత్తం నకిలీ బాపతు. వాళ్ళ పని ఫాలోయింగ్ పెంచుకోవడానికి ఎంత దూరమైనా వెళ్లడం, ఏ సెలబ్రిటీ మీదైనా నోరు జారడం. చాలా మంది చూసి చూడనట్టు ఉంటారు. మరికొందరు పర్సనల్ గా తీసుకుని అనవసరంగా టెన్షన్ తెచ్చుకుంటారు. పూరి జగన్నాథ్ సైతం వీటి బారిన పడి సైలెంట్ అయ్యారు. ఆచార్య తర్వాత కొరటాల శివ నో ఆన్ లైన్ అనేశారు. మొహాలు కనిపించని వర్చువల్ వరల్డ్ లో పరిణామాలు ఇలాగే ఉంటాయి మరి.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…