ఇప్పుడున్న టెక్నాలజీలో హీరో అయినా దర్శకుడైనా సినిమాలకు సంబంధించి మరెవరైనా సోషల్ మీడియాలో ఉండటం అవసరమే. నేరుగా కలిసే అవకాశం లేకపోయినా పైసా ఖర్చు లేకుండా అభిమానులు, మూవీ లవర్స్ తో మాట్లాడి అప్డేట్స్ ఇచ్చే వెసులుబాటు ఇందులోనే ఉంటుంది. నాణేనికి రెండో వైపులా దీనికి మరో పార్శ్యం ఉంది. అదే నెగటివిటీ. నిన్న దర్శకుడు వెంకటేష్ మహా డంకీ టికెట్ ని పోస్ట్ చేసి తన ఆసక్తిని ప్రదర్శించడం ప్రభాస్ అభిమానులకు ఆగ్రహం కలిగించింది. గతంలో కెజిఎఫ్ గురించి తను చేసిన కామెంట్స్ అప్పట్లో ఎంత హాట్ టాపిక్ గా మారాయో తెలిసిన విషయమే.
దీంతో ఒక్కసారిగా ఇతని మీద ట్వీట్ల దాడి జరిగిపోయింది. సలార్ టికెట్ షేర్ చేయకుండా అదే పనిగా డంకీ మాత్రమే హైలైట్ చేయడం పట్ల కొందరు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా లాభం లేకపోవడంతో వెంకటేష్ మహా చివరికి అకౌంట్ డీ యాక్టివేట్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఇటీవలే గుంటూరు కారం పాట ఫీడ్ బ్యాక్ గురించి గీత రచయిత రామజోగయ్య శాస్త్రి చేసిన హాట్ కామెంట్స్ పట్ల నెటిజెన్ల నుంచి నిరసన వ్యక్తమయ్యింది. ఆయన నాకీ రొంపి వద్దు బాబోయ్ అంటూ సెలవు తీసుకున్నారు. రెండు ట్వీట్లను డిలీట్ చేసిన నిర్మాత నాగవంశీ సైతం ఇబ్బందులు ఎదురుకున్నవాళ్లే.
ఒకరకంగా చెప్పాలంటే ట్విట్టర్, ఇన్స్ టాలు ఫేక్ ప్రపంచాలు. ఒరిజినల్ ఐడిలతో అకౌంట్లు రన్ చేసే వాళ్ళు మహా అయితే పది ఇరవై శాతం ఉంటారు. మిగిలిన బ్యాచ్ మొత్తం నకిలీ బాపతు. వాళ్ళ పని ఫాలోయింగ్ పెంచుకోవడానికి ఎంత దూరమైనా వెళ్లడం, ఏ సెలబ్రిటీ మీదైనా నోరు జారడం. చాలా మంది చూసి చూడనట్టు ఉంటారు. మరికొందరు పర్సనల్ గా తీసుకుని అనవసరంగా టెన్షన్ తెచ్చుకుంటారు. పూరి జగన్నాథ్ సైతం వీటి బారిన పడి సైలెంట్ అయ్యారు. ఆచార్య తర్వాత కొరటాల శివ నో ఆన్ లైన్ అనేశారు. మొహాలు కనిపించని వర్చువల్ వరల్డ్ లో పరిణామాలు ఇలాగే ఉంటాయి మరి.
This post was last modified on December 19, 2023 4:19 pm
ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్ను పక్కన పెడితే.. అల్లు…
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…
పిల్లల విషయంలో తల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్యవహరించాలో చెప్పే ఉదంతమిది. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాలని, వారిలో భయం పెంచాలని…
హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…
సీఎం రేవంత్ రెడ్డిపై, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన…
నందమూరి అభిమానుల ఎదురు చూపులను రెన్యూవల్ చేయడమే తప్ప ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడో చెప్పకుండా దోబూచులాడుతున్న మోక్షజ్ఞ మరోసారి వార్తల్లోకి…