ఇప్పుడున్న టెక్నాలజీలో హీరో అయినా దర్శకుడైనా సినిమాలకు సంబంధించి మరెవరైనా సోషల్ మీడియాలో ఉండటం అవసరమే. నేరుగా కలిసే అవకాశం లేకపోయినా పైసా ఖర్చు లేకుండా అభిమానులు, మూవీ లవర్స్ తో మాట్లాడి అప్డేట్స్ ఇచ్చే వెసులుబాటు ఇందులోనే ఉంటుంది. నాణేనికి రెండో వైపులా దీనికి మరో పార్శ్యం ఉంది. అదే నెగటివిటీ. నిన్న దర్శకుడు వెంకటేష్ మహా డంకీ టికెట్ ని పోస్ట్ చేసి తన ఆసక్తిని ప్రదర్శించడం ప్రభాస్ అభిమానులకు ఆగ్రహం కలిగించింది. గతంలో కెజిఎఫ్ గురించి తను చేసిన కామెంట్స్ అప్పట్లో ఎంత హాట్ టాపిక్ గా మారాయో తెలిసిన విషయమే.
దీంతో ఒక్కసారిగా ఇతని మీద ట్వీట్ల దాడి జరిగిపోయింది. సలార్ టికెట్ షేర్ చేయకుండా అదే పనిగా డంకీ మాత్రమే హైలైట్ చేయడం పట్ల కొందరు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా లాభం లేకపోవడంతో వెంకటేష్ మహా చివరికి అకౌంట్ డీ యాక్టివేట్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఇటీవలే గుంటూరు కారం పాట ఫీడ్ బ్యాక్ గురించి గీత రచయిత రామజోగయ్య శాస్త్రి చేసిన హాట్ కామెంట్స్ పట్ల నెటిజెన్ల నుంచి నిరసన వ్యక్తమయ్యింది. ఆయన నాకీ రొంపి వద్దు బాబోయ్ అంటూ సెలవు తీసుకున్నారు. రెండు ట్వీట్లను డిలీట్ చేసిన నిర్మాత నాగవంశీ సైతం ఇబ్బందులు ఎదురుకున్నవాళ్లే.
ఒకరకంగా చెప్పాలంటే ట్విట్టర్, ఇన్స్ టాలు ఫేక్ ప్రపంచాలు. ఒరిజినల్ ఐడిలతో అకౌంట్లు రన్ చేసే వాళ్ళు మహా అయితే పది ఇరవై శాతం ఉంటారు. మిగిలిన బ్యాచ్ మొత్తం నకిలీ బాపతు. వాళ్ళ పని ఫాలోయింగ్ పెంచుకోవడానికి ఎంత దూరమైనా వెళ్లడం, ఏ సెలబ్రిటీ మీదైనా నోరు జారడం. చాలా మంది చూసి చూడనట్టు ఉంటారు. మరికొందరు పర్సనల్ గా తీసుకుని అనవసరంగా టెన్షన్ తెచ్చుకుంటారు. పూరి జగన్నాథ్ సైతం వీటి బారిన పడి సైలెంట్ అయ్యారు. ఆచార్య తర్వాత కొరటాల శివ నో ఆన్ లైన్ అనేశారు. మొహాలు కనిపించని వర్చువల్ వరల్డ్ లో పరిణామాలు ఇలాగే ఉంటాయి మరి.
This post was last modified on December 19, 2023 4:19 pm
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…