Movie News

కౌంటర్లోనే టికెట్లు కొనాలంటే రచ్చ ఖాయం

సలార్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్ మొదటి రోజు టికెట్ల అమ్మకాలకు పాత కాలానికి చెందిన కొత్త ఎత్తుగడను ఎంచుకోవడం ఆసక్తి రేపుతోంది. ఆన్ లైన్ బుకింగ్ యాప్స్ లో కాకుండా నేరుగా థియేటర్ వద్ద కౌంటర్లో కొనేలా ఒకప్పటి ట్రెండ్ తీసుకొస్తున్నామని ప్రకటించడం అభిమానుల్లో చర్చకు దారి తీస్తోంది. ఎందుకంటే చాలా కాలంగా జనాలు పేటిఎం, బుక్ మై షోలకు అలవాటు పడ్డారు. అదేపనిగా హాలు దాకా వెళ్లి క్యూలో నిలబడి కొనుక్కుని సమయం, ప్రయాణం రెండూ ఖర్చు పెట్టుకోవడం కన్నా ఓ ముప్పై రూపాయలు అదనంగా పోతే పోయిందని కంఫర్ట్ కి అలవాటు పడ్డారు.

ఇప్పుడు సలార్ కోసం కౌంటర్ల దగ్గరికి రండని పిలుపునివ్వడం బాగానే ఉంది కానీ ప్రాక్టికల్ గా సమస్యలొచ్చే అవకాశాలు లేకపోలేదు. మొదటిది బ్లాక్ మార్కెట్. బలవంతుడి రాజన్నట్టు దూసుకెళ్లేవాడికే టికెట్లు దొరుకుతాయి. అవి బ్లాక్ లో బయటికొస్తాయి. పైగా గంటల తరబడి క్యూలో నిలబడి కొనేంత సహనం జనాల్లో తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ స్ట్రాటజీతో ఇబ్బందులకు సిద్ధపడాల్సి ఉంటుంది. ట్రేడ్ టాక్ ప్రకారం తెలంగాణలోని సింగల్ స్క్రీన్లకు ఈ పద్దతి అమలు చేస్తారట. మల్టీప్లెక్సుల వరకు అంత రిస్క్ అవసరం లేకుండా నేరుగా ఆన్ లైన్ కొనే సౌలభ్యం కొనసాగొచ్చు.

ఓపెనింగ్స్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వంద నుంచి నూటా యాభై కోట్ల గ్రాస్ సులభంగా వస్తుందని బయ్యర్లు అంచనా వేస్తున్నారు. అయితే డంకీ, ఆక్వామెన్ ల ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందనే దాన్ని బట్టి ఫిగర్లలో హెచ్చు తగ్గులు ఆధారపడి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ పెంపుకి సంబందించి ఇంకా అనుమతులు రావాలి. ఏ నిమిషమైనా వచ్చే ఛాన్స్ ఉంది. తెలంగాణలో ఇంకా అఫీషియల్ చేయలేదు కానీ తెరవెనుక ఏర్పాట్లు చేసుకుని ఎగ్జిబిటర్లు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు మొదలైనా యాప్స్ క్రాష్ అయ్యే రేంజ్ లో జనాలు మీదపడటం ఖాయం.

This post was last modified on December 18, 2023 7:49 pm

Share
Show comments

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

7 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

9 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

9 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

10 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

11 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

13 hours ago