Movie News

కౌంటర్లోనే టికెట్లు కొనాలంటే రచ్చ ఖాయం

సలార్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్ మొదటి రోజు టికెట్ల అమ్మకాలకు పాత కాలానికి చెందిన కొత్త ఎత్తుగడను ఎంచుకోవడం ఆసక్తి రేపుతోంది. ఆన్ లైన్ బుకింగ్ యాప్స్ లో కాకుండా నేరుగా థియేటర్ వద్ద కౌంటర్లో కొనేలా ఒకప్పటి ట్రెండ్ తీసుకొస్తున్నామని ప్రకటించడం అభిమానుల్లో చర్చకు దారి తీస్తోంది. ఎందుకంటే చాలా కాలంగా జనాలు పేటిఎం, బుక్ మై షోలకు అలవాటు పడ్డారు. అదేపనిగా హాలు దాకా వెళ్లి క్యూలో నిలబడి కొనుక్కుని సమయం, ప్రయాణం రెండూ ఖర్చు పెట్టుకోవడం కన్నా ఓ ముప్పై రూపాయలు అదనంగా పోతే పోయిందని కంఫర్ట్ కి అలవాటు పడ్డారు.

ఇప్పుడు సలార్ కోసం కౌంటర్ల దగ్గరికి రండని పిలుపునివ్వడం బాగానే ఉంది కానీ ప్రాక్టికల్ గా సమస్యలొచ్చే అవకాశాలు లేకపోలేదు. మొదటిది బ్లాక్ మార్కెట్. బలవంతుడి రాజన్నట్టు దూసుకెళ్లేవాడికే టికెట్లు దొరుకుతాయి. అవి బ్లాక్ లో బయటికొస్తాయి. పైగా గంటల తరబడి క్యూలో నిలబడి కొనేంత సహనం జనాల్లో తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ స్ట్రాటజీతో ఇబ్బందులకు సిద్ధపడాల్సి ఉంటుంది. ట్రేడ్ టాక్ ప్రకారం తెలంగాణలోని సింగల్ స్క్రీన్లకు ఈ పద్దతి అమలు చేస్తారట. మల్టీప్లెక్సుల వరకు అంత రిస్క్ అవసరం లేకుండా నేరుగా ఆన్ లైన్ కొనే సౌలభ్యం కొనసాగొచ్చు.

ఓపెనింగ్స్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వంద నుంచి నూటా యాభై కోట్ల గ్రాస్ సులభంగా వస్తుందని బయ్యర్లు అంచనా వేస్తున్నారు. అయితే డంకీ, ఆక్వామెన్ ల ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందనే దాన్ని బట్టి ఫిగర్లలో హెచ్చు తగ్గులు ఆధారపడి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ పెంపుకి సంబందించి ఇంకా అనుమతులు రావాలి. ఏ నిమిషమైనా వచ్చే ఛాన్స్ ఉంది. తెలంగాణలో ఇంకా అఫీషియల్ చేయలేదు కానీ తెరవెనుక ఏర్పాట్లు చేసుకుని ఎగ్జిబిటర్లు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు మొదలైనా యాప్స్ క్రాష్ అయ్యే రేంజ్ లో జనాలు మీదపడటం ఖాయం.

This post was last modified on December 18, 2023 7:49 pm

Share
Show comments

Recent Posts

సరైన దారిలో విజయ్ దేవరకొండ

ఇటీవలే ది ఫ్యామిలీ స్టార్ రూపంలో ఊహించని డిజాస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండ నిజానికి గీత గోవిందంని మించిన అంచనాలు…

1 hour ago

పవన్ ని తప్పయితే, మోడీది కూడా తప్పే కదా జగన్

తాజాగా ఒక ప్రముఖ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన సీఎం జగన్మోహన్ రెడ్డి.. జనసేన అధినేత పవన్…

3 hours ago

బీహార్ లో బీజేపీ కోటకు బీటలు !

బీహార్ లో బీజేపీ కోటకు బీటలు వారుతున్నాయి. 2019 ఎన్నికలలో బీజేపీ, జేడీయూ, ఎల్జేపీలతో కూడిన ఎన్డీఏ కూటమి బీహార్…

3 hours ago

సికందర్ జోడిగా రష్మిక మందన్న

గతంలో పుష్పలో శ్రీవల్లి పాత్రతోనే ప్యాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్నకు బాలీవుడ్ లో పెద్ద బ్రేక్ ఇచ్చింది…

3 hours ago

రొటీన్ అంటూనే 50 కోట్లు లాగేసింది

మొన్న శుక్రవారం విడుదలైన సినిమాల్లో ఏదీ సూపర్ హిట్ అనిపించుకోలేదు. అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు మొదటి రెండు…

3 hours ago

ఆస్ట్రేలియా వెళ్లే విద్యార్థులకు షాకింగ్ న్యూస్ !

ఆస్ట్రేలియాలో చదువుకునేందుకు వెళ్లాలనుకునే విద్యార్థులకు అక్కడ ప్రభుత్వం ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. మే 10 నుండి ఆస్ట్రేలియాలో చదువుకోవాలనుకునే…

4 hours ago