ఒక ట్రైలర్ వచ్చాక రెండో వెర్షన్ కోసం అంతకన్నా విపరీతమైన ఉత్సుకతతో ఎదురు చూడటం సలార్ విషయంలోనే జరిగింది. డిసెంబర్ 22 విడుదల కాబోతున్న ఈ యాక్షన్ గ్రాండియర్ నుంచి మరిన్ని విజువల్స్ కోసం ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఎగ్జైట్ మెంట్ తో ఉన్నారో చెప్పడం కష్టం. ఒకే రోజు రెండుసార్లు వాయిదా వేసినప్పటికీ ఫైనల్ గా హోంబాలే ఫిలిమ్స్ సలార్ ట్రైలర్ 2ని రిలీజ్ చేసింది. కథేంటో ముందే చెప్పేశారు కాబట్టి ఇందులో ఫోకస్ మొత్తం ఫైట్ల మీదే ఉంది. దానికి తగ్గట్టే మరికొన్ని డీటెయిల్స్ ని పొందుపరుస్తూ దర్శకుడు ప్రశాంత్ నీల్ విధ్వంసాన్ని ఆవిష్కరించారు.
ఖన్సార్ నగరాన్ని గుప్పిట్లో ఉంచుకున్న మన్నార్(పృథ్విరాజ్ సుకుమారన్) కు శత్రువుల నుంచి ముప్పు పొంచి ఉంటుంది. ఎంత పెద్ద సైన్యం ఉన్నా తెగించి పోరాడేందుకు సరిపడా సత్తువా, ధైర్యం వాళ్లలో ఉండదు. అప్పుడు తన చిన్ననాటి స్నేహితుడు దేవా(ప్రభాస్)ని పిలిపిస్తాడు మన్నార్. గన్ను, కత్తి, సుత్తి ఏ ఆయుధం పట్టుకున్నా ముందు వెనుక చూడకుండా నరమేథం చేసే ఇతన్ని స్నేహం పట్ల పిచ్చి ఉన్నోడిగా మన్నార్ నమ్మకాన్ని దేవా నిలబెట్టుకుంటాడు. అయితే ఇదంతా ఒకవైపే. ఇద్దరు శత్రువులుగా మారే తరుణం వస్తుంది. అదే సలార్ లో చూడాల్సిన అసలు కథ.
విజువల్స్ ని దర్శకుడు ప్రశాంత్ నీల్ నెత్తురు, బులెట్లతో నింపేశాడు. ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ ని ఎక్కువగా చూపించి అభిమానులను సంతృప్తి పరిచాడు. ముఖ్యంగా భారీ యుద్ధ ట్యాంకర్లు, వాహనాలు, భీతి గొలిపే వందలాది రౌడీ మూకలతో దేవా చేసే పోరాటాలు ఒకటేమిటి గూస్ బంప్స్ స్టఫ్ ని పూర్తిగా ట్రైలర్ 2లో జొప్పించారు. బాబీ సింహా, శ్రేయ రెడ్డి, జగపతిబాబు తదితరులను గతంలో కన్నా ఎక్కువగా రివీల్ చేశారు. మొత్తానికి బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ ని ఖచ్చితంగా డిమాండ్ చేసే స్థాయిలో సలార్ ఉందనే నమ్మకాన్ని సంపూర్ణంగా నెరవేర్చారు. ఈ అంచనా నిలబెట్టుకుంటే వసూళ్ల ఊచకోతే
This post was last modified on December 18, 2023 4:29 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…