Movie News

డబ్బింగ్ సినిమాలకు థియేటర్ల పంచాయితీ

సంక్రాంతికి నెలకొన్న విపరీతమైన పోటీ నేపథ్యంలో థియేటర్ల సర్దుబాటు జఠిలమైన సమస్యగా మారుతోంది. పైకి ఎవరికి వారు మేం థియేటర్లు మాట్లాడుకున్నాం, అగ్రిమెంట్లు చేసుకున్నాం అని చెబుతున్నారు కానీ గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితి వేరుగా ఉందని ట్రేడ్ టాక్. గుంటూరు కారం, సైంధ‌వ్‌ మాత్రమే ఈ విషయంలో పక్కా ప్రణాళికతో ఉన్నాయని, బయ్యర్లు పూర్తి సహకారం అందిస్తున్నారని సమాచారం. నా సామిరంగ ఇంకా డేట్ లాక్ చేయలేదు కాబట్టి దాని వ్యవహారం తేలాల్సి ఉంది. హనుమాన్, ఈగల్ మాకు సరిపడా ఉన్నాయని వాటితో సర్దుకుంటామని అంటున్నాయి.

వీటి సంగతి కాసేపలా పక్కనపెడితే ఇదే పండగకు మూడు డబ్బింగ్ సినిమాలున్నాయి. అవేవో ఆషామాషీ చిన్న హీరోలవి కాదు. తెలుగులో మార్కెట్ ఉన్నవాళ్లవే. ధనుష్ కెప్టెన్ మిల్లర్, రజనీకాంత్ లాల్ సలామ్, శివ కార్తికేయన్ అయలన్ లు ఇక్కడ కూడా సమాంతర రిలీజ్ కు ప్లాన్ చేసుకున్నాయి. నిర్మాతలు ఇంకా ఫైనల్ కాలేదు. సో డిస్ట్రిబ్యూటర్లెవరో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. అలా అని ఎవరూ కొనకుండా ఉండరు. అన్నీ పెద్ద బ్యానర్లే. ఆయా నిర్మాతలకు టాలీవుడ్ లో బలమైన లింకులున్నాయి. ఏదో ఒకరకంగా దొరికినన్ని స్క్రీన్లతో వేయించేలా తెరవెనుక వ్యవహారం నడిపిస్తారు.

పోనీ మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఇలాంటి టైంలో డబ్బింగులు అనుమతులు లేవు లేదా థియేటర్ల సర్దుబాటు కుదరదు లాంటి కండీషన్లు పెడతారా అంటే అదీ లేదు. తమిళనాడులో అయితే నిర్మొహమాటంగా ఇతర బాషా చిత్రాలను పండగ సీజన్ లో పక్కకు తోసేస్తారు. కానీ మనదగ్గర అలా కుదరదు.అనువాదాలే కాబట్టి లేట్ రిలీజ్ చేసుకోవచ్చు కదాని అడగొచ్చు. కానీ అగ్రిమెంట్ల టైంలో అన్ని భాషల్లో సమాంతర విడుదలకు పట్టుబడుతున్నాయి ఓటిటి సంస్థలు. అందుకే ఈ చిక్కులు. గతంలో వారసుడు,పేట లాంటివి వచ్చినప్పుడు తలెత్తిన ఇబ్బంది ఈసారి తీవ్రస్థాయిలో ఉండనుంది. చూడాలి ఏం జరుగుతుందో.

This post was last modified on December 18, 2023 2:47 pm

Share
Show comments

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

19 minutes ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

3 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

6 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

6 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

9 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

11 hours ago