అదేంటి బిగ్ బాస్ షోకి ఇంద్ర సినిమాకు కనెక్షన్ ఏంటని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ పూర్తిగా చదివితే మీకే అర్థమవుతుంది. చిరంజీవి కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా పేరున్న ఇంద్ర శాటిలైట్ ఛానల్స్ లో రాక ఏళ్ళు గడిచిపోయాయి. 2014లో చివరి సారి జెమినిలో ప్రసారమయ్యాక హక్కుల రెన్యూవల్ దగ్గర ఏదో సమస్య వచ్చి నిర్మాత అశ్వినీదత్ రైట్స్ తన దగ్గరే ఉంచుకున్నారు. యూట్యూబ్ లో అందుబాటులో ఉన్నా సరే సరైన క్వాలిటీ ప్రింట్ తో చూడలేకపోతున్నామనే బాధ ఫ్యాన్స్ ని వెంటాడుతూ వచ్చింది. ఫైనల్ గా బుల్లి తెర ఇంద్ర ని జీ తెలుగు ఛానల్ సొంతం చేసుకుంది.
ముందు అనుకున్న ప్లానింగ్ ప్రకారం అయితే డిసెంబర్ 17 సాయంత్రం వేద్దామని అనుకున్నారు. ఆ మేరకు సోషల్ మీడియాలో లీకులు వదిలారు. ఫ్యాన్స్ కూడా హంగామా చేశారు. తీరా చూస్తే ఇప్పుడిది రావడం లేదు. కారణం ఏంటంటే బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫైనల్ ఎపిసోడ్ అదే సమయంలో ఉండటంతో రేటింగ్స్ మీద ప్రభావం పడుతుందని నిర్ణయం మార్చుకున్నారు. తిరిగి 24న సలార్ హడావిడి ఉంటుంది కాబట్టి అది కూడా వదిలేసి ఫైనల్ గా డిసెంబర్ 30 ప్రీమియర్ కు రంగం సిద్ధం చేశారు. తొమ్మిదేళ్ల తర్వాత టెలికాస్ట్ కాబట్టి ప్రమోషన్లు భారీగా చేయాలని ప్లాన్ చేశారట.
దీన్ని బట్టే బిగ్ బాస్ షో ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. విజేత పల్లవి ప్రశాంత్ అని ఆల్రెడీ జనాలకు తెలిసిపోయింది. మహేష్ బాబు అతిథిగా వస్తున్నాడనే వార్తలో నిజం లేదని లేటెస్ట్ అప్డేట్. గుంటూరు కారం టీమ్ నుంచి శ్రీలీల ఒకటే రావొచ్చు. షూటింగ్ అయిపోయింది కాబట్టి ఇందులో పెద్దగా సస్పెన్స్ ఏమి లేదు. ఒక టీవీ షో కోసం సినిమా ప్రీమియర్ ని మార్చుకోవడం అరుదే. నిజానికి ఇంద్రని థియేట్రికల్ రీ రిలీజ్ చేయాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు కానీ వైజయంతి మూవీస్ వచ్చే ఏడాది సంస్థ యాభై వార్షికోత్సవ సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో ఉందని టాక్.
This post was last modified on December 17, 2023 4:53 pm
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…
అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…
వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…