అదేంటి బిగ్ బాస్ షోకి ఇంద్ర సినిమాకు కనెక్షన్ ఏంటని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ పూర్తిగా చదివితే మీకే అర్థమవుతుంది. చిరంజీవి కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా పేరున్న ఇంద్ర శాటిలైట్ ఛానల్స్ లో రాక ఏళ్ళు గడిచిపోయాయి. 2014లో చివరి సారి జెమినిలో ప్రసారమయ్యాక హక్కుల రెన్యూవల్ దగ్గర ఏదో సమస్య వచ్చి నిర్మాత అశ్వినీదత్ రైట్స్ తన దగ్గరే ఉంచుకున్నారు. యూట్యూబ్ లో అందుబాటులో ఉన్నా సరే సరైన క్వాలిటీ ప్రింట్ తో చూడలేకపోతున్నామనే బాధ ఫ్యాన్స్ ని వెంటాడుతూ వచ్చింది. ఫైనల్ గా బుల్లి తెర ఇంద్ర ని జీ తెలుగు ఛానల్ సొంతం చేసుకుంది.
ముందు అనుకున్న ప్లానింగ్ ప్రకారం అయితే డిసెంబర్ 17 సాయంత్రం వేద్దామని అనుకున్నారు. ఆ మేరకు సోషల్ మీడియాలో లీకులు వదిలారు. ఫ్యాన్స్ కూడా హంగామా చేశారు. తీరా చూస్తే ఇప్పుడిది రావడం లేదు. కారణం ఏంటంటే బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫైనల్ ఎపిసోడ్ అదే సమయంలో ఉండటంతో రేటింగ్స్ మీద ప్రభావం పడుతుందని నిర్ణయం మార్చుకున్నారు. తిరిగి 24న సలార్ హడావిడి ఉంటుంది కాబట్టి అది కూడా వదిలేసి ఫైనల్ గా డిసెంబర్ 30 ప్రీమియర్ కు రంగం సిద్ధం చేశారు. తొమ్మిదేళ్ల తర్వాత టెలికాస్ట్ కాబట్టి ప్రమోషన్లు భారీగా చేయాలని ప్లాన్ చేశారట.
దీన్ని బట్టే బిగ్ బాస్ షో ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. విజేత పల్లవి ప్రశాంత్ అని ఆల్రెడీ జనాలకు తెలిసిపోయింది. మహేష్ బాబు అతిథిగా వస్తున్నాడనే వార్తలో నిజం లేదని లేటెస్ట్ అప్డేట్. గుంటూరు కారం టీమ్ నుంచి శ్రీలీల ఒకటే రావొచ్చు. షూటింగ్ అయిపోయింది కాబట్టి ఇందులో పెద్దగా సస్పెన్స్ ఏమి లేదు. ఒక టీవీ షో కోసం సినిమా ప్రీమియర్ ని మార్చుకోవడం అరుదే. నిజానికి ఇంద్రని థియేట్రికల్ రీ రిలీజ్ చేయాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు కానీ వైజయంతి మూవీస్ వచ్చే ఏడాది సంస్థ యాభై వార్షికోత్సవ సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో ఉందని టాక్.
This post was last modified on December 17, 2023 4:53 pm
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…