పుష్ప సినిమా ద్వారా గుర్తింపు పొందిన నటుడు కేశవ అలియాస్ జగదీష్, అలియాస్ బండారు ప్రతాప్.. తాజాగా ఓ యువతి ఆత్మహత్య, ఆమెకు సంబంధించిన నగ్న వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి వేధించిన కేసులో అరెస్టయి.. జైలు పాలైన విషయం తెలిసిందే. అతని నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు రెండు రోజులు కస్టడీకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో కేశవ విచారించారు.ఈ సందర్భంగా పోలీసులకే కేశవం సంచలన విషయాలు వెల్లడించాడు.
ఇలా మొదలైంది..
సినీ అవకాశాల కోసం హైదరాబాద్కి వచ్చిన కేశవకు అయిదేళ్ల క్రితం ఒక యువతితో పరిచయమైంది. కొంతకాలానికి అది ప్రేమగా మారి.. శారీరకంగానూ దగ్గరయ్యారు. ఈ క్రమంలో పుష్ప సినిమాతో ఒక్కసారిగా గుర్తింపు రావటంతో సినిమా అవకాశాలు పెరిగి అతను మారిపోయాడు. ఆమె ఉండగానే మరొకరిని రూమ్కు తెచ్చుకునేవాడు. ఇది నచ్చని యువతి మరో యువకుడికి దగ్గరైంది.
ఈ విషయం తెలుసుకున్న కేశవ ఏదో విధంగా ఆమెను మళ్లీ దారిలోకి తెచ్చుకోవాలనుకున్నాడు. గత నెల 27న పంజాగుట్ట ఠాణా పరిధిలో నివాసం ఉంటున్న యువతి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో సదరు యువకుడితో ఆమె సెక్స్లో ఉండటం చూసి సెల్ఫోన్తో ఫొటోలు తీశాడు. వాటిని ఆమెకు పంపి తన మాట వినకుంటే సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ బెదిరించాడు.
దీన్ని అవమానంగా భావించిన యువతి గత నెల 29న ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. జగదీశ్ బెదిరింపులతోనే అఘాయిత్యానికి పాల్పడినట్లుగా గుర్తించిన ఆమె తండ్రి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ నెల 6న జగదీశ్ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ముందు తనకు ఏమీ తెలియదని బుకాయించినా.. పోలీసుల శైలిని రుచిచూశాక.. నేరాన్ని అంగీకరించాడు. ఇక, కస్టడీ ముగియటంతో తిరిగి రిమాండుకు తరలించారు.
This post was last modified on December 17, 2023 2:14 pm
కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.…
ఒకప్పుడు మెలోడీ బ్రహ్మ మణిశర్మ అంటే టాలీవుడ్ ప్రేక్షకులకు ఒక గూస్ బంప్స్ ఎమోషన్. కమర్షియల్ సినిమాలను తన నేపధ్య…
దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, పరీక్షల నిర్వహణలో అక్రమాల వివాదం చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి…
‘బాహుబలి’ ప్రభంజనం తర్వాత ఇండియన్ సినిమాలో సీక్వెల్స్, ఫ్రాంఛైజీ సినిమాల జోరు ఎంతగా పెరిగిందో తెలిసిందే. అవసరం ఉన్నా లేకపోయినా పార్ట్-2లు…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరో వారంలో ఏపీకి రానున్నారు. ఆగస్టు 1వ తేదీన ఆయన విజయనగరం జిల్లా భోగాపురానికి…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమైన వేళ ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన అర్థరాత్రి సెల్ఫీ…