పుష్ప సినిమా ద్వారా గుర్తింపు పొందిన నటుడు కేశవ అలియాస్ జగదీష్, అలియాస్ బండారు ప్రతాప్.. తాజాగా ఓ యువతి ఆత్మహత్య, ఆమెకు సంబంధించిన నగ్న వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి వేధించిన కేసులో అరెస్టయి.. జైలు పాలైన విషయం తెలిసిందే. అతని నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు రెండు రోజులు కస్టడీకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో కేశవ విచారించారు.ఈ సందర్భంగా పోలీసులకే కేశవం సంచలన విషయాలు వెల్లడించాడు.
ఇలా మొదలైంది..
సినీ అవకాశాల కోసం హైదరాబాద్కి వచ్చిన కేశవకు అయిదేళ్ల క్రితం ఒక యువతితో పరిచయమైంది. కొంతకాలానికి అది ప్రేమగా మారి.. శారీరకంగానూ దగ్గరయ్యారు. ఈ క్రమంలో పుష్ప సినిమాతో ఒక్కసారిగా గుర్తింపు రావటంతో సినిమా అవకాశాలు పెరిగి అతను మారిపోయాడు. ఆమె ఉండగానే మరొకరిని రూమ్కు తెచ్చుకునేవాడు. ఇది నచ్చని యువతి మరో యువకుడికి దగ్గరైంది.
ఈ విషయం తెలుసుకున్న కేశవ ఏదో విధంగా ఆమెను మళ్లీ దారిలోకి తెచ్చుకోవాలనుకున్నాడు. గత నెల 27న పంజాగుట్ట ఠాణా పరిధిలో నివాసం ఉంటున్న యువతి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో సదరు యువకుడితో ఆమె సెక్స్లో ఉండటం చూసి సెల్ఫోన్తో ఫొటోలు తీశాడు. వాటిని ఆమెకు పంపి తన మాట వినకుంటే సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ బెదిరించాడు.
దీన్ని అవమానంగా భావించిన యువతి గత నెల 29న ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. జగదీశ్ బెదిరింపులతోనే అఘాయిత్యానికి పాల్పడినట్లుగా గుర్తించిన ఆమె తండ్రి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ నెల 6న జగదీశ్ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ముందు తనకు ఏమీ తెలియదని బుకాయించినా.. పోలీసుల శైలిని రుచిచూశాక.. నేరాన్ని అంగీకరించాడు. ఇక, కస్టడీ ముగియటంతో తిరిగి రిమాండుకు తరలించారు.
This post was last modified on December 17, 2023 2:14 pm
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం పుంజుకుంటోంది. ప్రధానంగా ఐటీ సంస్థల నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు కూడా ఏఐ ఆధారిత…
ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 ది థర్డ్ కేస్ పూర్తి చేసే పనిలో ఉన్న న్యాచురల్ స్టార్…
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్కు సొంత బాబాయి.. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు లో తాజాగా…
గత ఏడాది సంక్రాంతికి ‘హనుమాన్’తో సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ జోడీ. పాన్ ఇండియా స్థాయిలో పెద్ద…
మాటల మాంత్రికుడు.. సోషల్ మీడియాలో దుమ్మురేపి.. ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా శాసన మండలిలో ఉన్న తీన్మార్ మల్లన్న తన వాయిస్ ద్వారా…