పుష్ప సినిమా ద్వారా గుర్తింపు పొందిన నటుడు కేశవ అలియాస్ జగదీష్, అలియాస్ బండారు ప్రతాప్.. తాజాగా ఓ యువతి ఆత్మహత్య, ఆమెకు సంబంధించిన నగ్న వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి వేధించిన కేసులో అరెస్టయి.. జైలు పాలైన విషయం తెలిసిందే. అతని నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు రెండు రోజులు కస్టడీకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో కేశవ విచారించారు.ఈ సందర్భంగా పోలీసులకే కేశవం సంచలన విషయాలు వెల్లడించాడు.
ఇలా మొదలైంది..
సినీ అవకాశాల కోసం హైదరాబాద్కి వచ్చిన కేశవకు అయిదేళ్ల క్రితం ఒక యువతితో పరిచయమైంది. కొంతకాలానికి అది ప్రేమగా మారి.. శారీరకంగానూ దగ్గరయ్యారు. ఈ క్రమంలో పుష్ప సినిమాతో ఒక్కసారిగా గుర్తింపు రావటంతో సినిమా అవకాశాలు పెరిగి అతను మారిపోయాడు. ఆమె ఉండగానే మరొకరిని రూమ్కు తెచ్చుకునేవాడు. ఇది నచ్చని యువతి మరో యువకుడికి దగ్గరైంది.
ఈ విషయం తెలుసుకున్న కేశవ ఏదో విధంగా ఆమెను మళ్లీ దారిలోకి తెచ్చుకోవాలనుకున్నాడు. గత నెల 27న పంజాగుట్ట ఠాణా పరిధిలో నివాసం ఉంటున్న యువతి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో సదరు యువకుడితో ఆమె సెక్స్లో ఉండటం చూసి సెల్ఫోన్తో ఫొటోలు తీశాడు. వాటిని ఆమెకు పంపి తన మాట వినకుంటే సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ బెదిరించాడు.
దీన్ని అవమానంగా భావించిన యువతి గత నెల 29న ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. జగదీశ్ బెదిరింపులతోనే అఘాయిత్యానికి పాల్పడినట్లుగా గుర్తించిన ఆమె తండ్రి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ నెల 6న జగదీశ్ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ముందు తనకు ఏమీ తెలియదని బుకాయించినా.. పోలీసుల శైలిని రుచిచూశాక.. నేరాన్ని అంగీకరించాడు. ఇక, కస్టడీ ముగియటంతో తిరిగి రిమాండుకు తరలించారు.
This post was last modified on December 17, 2023 2:14 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…