నిన్న సాయంత్రం గుంటూరు కారం నుంచి ఓ మై బేబీ లిరికల్ వీడియో రిలీజ్ కావడం ఆలస్యం నిమిషాల వ్యవధిలో పాట మీద నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఓ రేంజ్ లో సోషల్ మీడియా మొత్తం హల్చల్ చేసింది. విచిత్రంగా మహేష్ బాబు అభిమానులే అధికశాతం ఈ ట్రెండ్స్ లో పాలు పంచుకోవడం ట్విస్టు. ఇది మితిమీరిన అంచనాల వల్ల జరిగిందా లేక నిజంగా అవుట్ ఫుట్ తేడా కొట్టిందానే విశ్లేషణలో టీమ్ బిజీగా ఉంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం మీద కూడా విమర్శలు గట్టిగానే వస్తున్నాయి. ఇంకా చిత్రీకరణలో ఉన్న పాట కాబట్టి విజువల్స్ గురించి ఏమంత పెద్ద చర్చ జరగలేదు.
ఇంతగా ఈ టాపిక్ వైరల్ కావడానికో ఫ్లాష్ బ్యాక్ ఉంది. సర్కారు వారి పాటకు తమన్ ఆశించిన స్థాయిలో మ్యూజిక్ ఇవ్వలేదనే అసంతృప్తి ఫ్యాన్స్ లో ఉంది. కళావతి మినహాయించి మిగిలిన సాంగ్స్ అంతగా క్లిక్ కాకపోవడం వాస్తవమే. మహేష్, సితార కలిసి డాన్స్ చేసిన పెన్ని సాంగ్ సైతం నిరాశపరిచింది. ఇక సినిమాలో కీలకమైన బీచ్ ఫైట్ కి కొట్టిన బీజీఎమ్ దాని స్థాయిని తగ్గించిందనేది అప్పట్లోనే అభిమానులు కంప్లయింట్ చేశారు. ప్రీ క్లైమాక్స్ బ్యాంకులో తాళాల గుత్తి పట్టుకునే ఫైట్ లోనూ ఇదే జరిగిందని వాళ్ళ ఫీలింగ్. అక్కడ మొదలైన ఈ అసంతృప్తి పర్వం ఇక్కడి దాకా తీసుకొచ్చింది.
అసలు గుంటూరు కారం ఇంకా రిలీజ్ కాలేదు. కేవలం రెండు పాటలను పట్టుకుని మ్యూజిక్ డైరెక్టర్ పనితనం మీద ఇంత దాడి చేయాలా అనేది తమన్ ఫ్యాన్స్ నుంచి వస్తున్న ప్రశ్న. దం మసాలా బిర్యానీని ఎంజాయ్ చేసి ఇప్పుడు ఓ మై బేబీ మీద ఇంత ఎదురు దాడి ఎందుకని అడుగుతున్నారు. ఇంకో రెండు బ్యాలన్స్ ఉన్నాయి. ఈ నెలాఖరులోపు అవి వస్తాయి. అసలైన ట్రైలర్ చూశాక ఒక అంచనాకు రావొచ్చు కానీ ఇంత నెగటివిటీ తొందరపాటేనని కొందరు నెటిజెన్ల వెర్షన్. ఏది ఏమైనా తమన్ కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ ట్రోలింగ్ బారిన పడ్డాడు. దానికి సమాధానం చెప్పాల్సింది గుంటూరు కారం స్కోర్ తోనే.
This post was last modified on December 14, 2023 10:44 am
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం తాడిపత్రిలో ఎన్నికల అనంతరం తీవ్ర హింస చెలరేగింది. ఇక్కడ పోటీలో ఉన్న జేసీ…