నిన్న సాయంత్రం గుంటూరు కారం నుంచి ఓ మై బేబీ లిరికల్ వీడియో రిలీజ్ కావడం ఆలస్యం నిమిషాల వ్యవధిలో పాట మీద నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఓ రేంజ్ లో సోషల్ మీడియా మొత్తం హల్చల్ చేసింది. విచిత్రంగా మహేష్ బాబు అభిమానులే అధికశాతం ఈ ట్రెండ్స్ లో పాలు పంచుకోవడం ట్విస్టు. ఇది మితిమీరిన అంచనాల వల్ల జరిగిందా లేక నిజంగా అవుట్ ఫుట్ తేడా కొట్టిందానే విశ్లేషణలో టీమ్ బిజీగా ఉంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం మీద కూడా విమర్శలు గట్టిగానే వస్తున్నాయి. ఇంకా చిత్రీకరణలో ఉన్న పాట కాబట్టి విజువల్స్ గురించి ఏమంత పెద్ద చర్చ జరగలేదు.
ఇంతగా ఈ టాపిక్ వైరల్ కావడానికో ఫ్లాష్ బ్యాక్ ఉంది. సర్కారు వారి పాటకు తమన్ ఆశించిన స్థాయిలో మ్యూజిక్ ఇవ్వలేదనే అసంతృప్తి ఫ్యాన్స్ లో ఉంది. కళావతి మినహాయించి మిగిలిన సాంగ్స్ అంతగా క్లిక్ కాకపోవడం వాస్తవమే. మహేష్, సితార కలిసి డాన్స్ చేసిన పెన్ని సాంగ్ సైతం నిరాశపరిచింది. ఇక సినిమాలో కీలకమైన బీచ్ ఫైట్ కి కొట్టిన బీజీఎమ్ దాని స్థాయిని తగ్గించిందనేది అప్పట్లోనే అభిమానులు కంప్లయింట్ చేశారు. ప్రీ క్లైమాక్స్ బ్యాంకులో తాళాల గుత్తి పట్టుకునే ఫైట్ లోనూ ఇదే జరిగిందని వాళ్ళ ఫీలింగ్. అక్కడ మొదలైన ఈ అసంతృప్తి పర్వం ఇక్కడి దాకా తీసుకొచ్చింది.
అసలు గుంటూరు కారం ఇంకా రిలీజ్ కాలేదు. కేవలం రెండు పాటలను పట్టుకుని మ్యూజిక్ డైరెక్టర్ పనితనం మీద ఇంత దాడి చేయాలా అనేది తమన్ ఫ్యాన్స్ నుంచి వస్తున్న ప్రశ్న. దం మసాలా బిర్యానీని ఎంజాయ్ చేసి ఇప్పుడు ఓ మై బేబీ మీద ఇంత ఎదురు దాడి ఎందుకని అడుగుతున్నారు. ఇంకో రెండు బ్యాలన్స్ ఉన్నాయి. ఈ నెలాఖరులోపు అవి వస్తాయి. అసలైన ట్రైలర్ చూశాక ఒక అంచనాకు రావొచ్చు కానీ ఇంత నెగటివిటీ తొందరపాటేనని కొందరు నెటిజెన్ల వెర్షన్. ఏది ఏమైనా తమన్ కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ ట్రోలింగ్ బారిన పడ్డాడు. దానికి సమాధానం చెప్పాల్సింది గుంటూరు కారం స్కోర్ తోనే.
This post was last modified on December 14, 2023 10:44 am
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా జరిగిన అత్యంత క్రేజీ ఫైట్లో టీమిండియా తన ఆధిపత్యాన్ని చాటుకుంది. కొలంబోలోని ఆర్.…
ఉత్కంఠ పోరుతో సాగుతుందనుకున్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ నీరసంగా జరిగింది. 175 పరుగులు చేసిన భారత్ సేన.. పాక్ ను…
వేలంటైన్స్ డే వీకెండ్లో తెలుగులో మూడు పేరున్న చిత్రాలు రిలీజయ్యాయి. ఐతే అందులో ‘ఫంకీ’, ‘సీతాపయనం’ ప్రేక్షకుల నుంచి ఆశించిన…
గత వారం పది రోజులుగా తెరచాటునే ఉన్న `కోవా బన్` వివాదం.. రెండురోజుల నుంచి తీవ్రస్థాయిలో రాజకీయ రంగు పులుముకుంది.…
ఒక సినిమా ఫలితంలో దర్శకత్వం తర్వాత ప్రధానంగా బాధ్యత వహించే విభాగం ఎడిటింగ్. పైకి ఏదో కత్తిరింపులు అతికింపులు అనే…
మాస్ రాజా రవితేజ చివరి హిట్ ఏది అంటే ఆయన అభిమానులు కూడా తడుముకునే పరిస్థితి. 2022లో వచ్చిన ‘ధమాకా’…