నిన్న సాయంత్రం గుంటూరు కారం నుంచి ఓ మై బేబీ లిరికల్ వీడియో రిలీజ్ కావడం ఆలస్యం నిమిషాల వ్యవధిలో పాట మీద నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఓ రేంజ్ లో సోషల్ మీడియా మొత్తం హల్చల్ చేసింది. విచిత్రంగా మహేష్ బాబు అభిమానులే అధికశాతం ఈ ట్రెండ్స్ లో పాలు పంచుకోవడం ట్విస్టు. ఇది మితిమీరిన అంచనాల వల్ల జరిగిందా లేక నిజంగా అవుట్ ఫుట్ తేడా కొట్టిందానే విశ్లేషణలో టీమ్ బిజీగా ఉంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం మీద కూడా విమర్శలు గట్టిగానే వస్తున్నాయి. ఇంకా చిత్రీకరణలో ఉన్న పాట కాబట్టి విజువల్స్ గురించి ఏమంత పెద్ద చర్చ జరగలేదు.
ఇంతగా ఈ టాపిక్ వైరల్ కావడానికో ఫ్లాష్ బ్యాక్ ఉంది. సర్కారు వారి పాటకు తమన్ ఆశించిన స్థాయిలో మ్యూజిక్ ఇవ్వలేదనే అసంతృప్తి ఫ్యాన్స్ లో ఉంది. కళావతి మినహాయించి మిగిలిన సాంగ్స్ అంతగా క్లిక్ కాకపోవడం వాస్తవమే. మహేష్, సితార కలిసి డాన్స్ చేసిన పెన్ని సాంగ్ సైతం నిరాశపరిచింది. ఇక సినిమాలో కీలకమైన బీచ్ ఫైట్ కి కొట్టిన బీజీఎమ్ దాని స్థాయిని తగ్గించిందనేది అప్పట్లోనే అభిమానులు కంప్లయింట్ చేశారు. ప్రీ క్లైమాక్స్ బ్యాంకులో తాళాల గుత్తి పట్టుకునే ఫైట్ లోనూ ఇదే జరిగిందని వాళ్ళ ఫీలింగ్. అక్కడ మొదలైన ఈ అసంతృప్తి పర్వం ఇక్కడి దాకా తీసుకొచ్చింది.
అసలు గుంటూరు కారం ఇంకా రిలీజ్ కాలేదు. కేవలం రెండు పాటలను పట్టుకుని మ్యూజిక్ డైరెక్టర్ పనితనం మీద ఇంత దాడి చేయాలా అనేది తమన్ ఫ్యాన్స్ నుంచి వస్తున్న ప్రశ్న. దం మసాలా బిర్యానీని ఎంజాయ్ చేసి ఇప్పుడు ఓ మై బేబీ మీద ఇంత ఎదురు దాడి ఎందుకని అడుగుతున్నారు. ఇంకో రెండు బ్యాలన్స్ ఉన్నాయి. ఈ నెలాఖరులోపు అవి వస్తాయి. అసలైన ట్రైలర్ చూశాక ఒక అంచనాకు రావొచ్చు కానీ ఇంత నెగటివిటీ తొందరపాటేనని కొందరు నెటిజెన్ల వెర్షన్. ఏది ఏమైనా తమన్ కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ ట్రోలింగ్ బారిన పడ్డాడు. దానికి సమాధానం చెప్పాల్సింది గుంటూరు కారం స్కోర్ తోనే.
This post was last modified on December 14, 2023 10:44 am
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…