మాములుగా వరస డిజాస్టర్లు ఇచ్చిన దర్శకులకు అవకాశాలు పుట్టడం కష్టం. ఒకప్పటి ట్రాక్ రికార్డు ఎంత ఘనంగా ఉన్నా ఇప్పుడేంటి అనేదే ప్రస్తుత హీరోల ఆలోచనా ధోరణి. అయినా సరే తేజకు ఇంకా ఆఫర్లు రావడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇటీవలే దగ్గుబాటి అభిరాంని పరిచయం చేస్తూ తీసిన అహింస ప్రేక్షకులను ఎంత హింస పెట్టిందో చెప్పనవసరం లేదు. మొన్న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యే దాకా ఇదొకటి వచ్చిందన్న సంగతే కామన్ ఆడియన్స్ కి తెలియనంత వేగంగా థియేటర్లలో వచ్చి వెళ్ళింది. అంతకు ముందు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సీత కూడా ఇదే ఫలితం.
ఇంత జరిగినా రానాకు మాత్రం తేజ మీద గురి తగ్గలేదు. తాజాగా రాక్షస రాజాని ప్రకటించారు. ఇదెప్పుడో ఓ ఫంక్షన్ లో తేజ స్టేజి మీద అనౌన్స్ చేశాడు కానీ కార్యరూపం దాల్చడానికి నెలలు పట్టింది. రానా ఇంత స్పెషల్ ఇంటరెస్ట్ చూపించడానికి కారణం ఒకటే. బాహుబలి తర్వాత సోలోగా తనకు సరైన హిట్టు లేని టైంలో నేనే రాజు నేనా మంత్రితో మంచి విజయం అందించాడు. తనలో మరో పెర్ఫార్మర్ ని బయటికి తీశాడు. ఆ కృతజ్ఞతే కాబోలు రానా, సురేష్ బాబులను మళ్ళీ ఇంకో ఆఫర్ ఇచ్చేలా చేసింది. హీరోయిన్, ఇతర టీమ్ కు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
ఒకరకంగా ఇది తేజకు డూ ఆర్ డై లాంటిది. చావో రేవో తేల్చుకోవాల్సిందే. ఒకేరకమైన ప్రేమకథలుతో మూసధోరణికి అలవాటు పడ్డ ఈ విలక్షణ దర్శకుడు పొలిటికల్ సబ్జెక్టుని బాగా హ్యాండిల్ చేయగలనని నేనే రాజు నేనే మంత్రితో రుజువు చేశారు. మళ్ళీ ఇప్పుడీ రాక్షస రాజాతో రానా నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఇక రానా సైతం కెరీర్ మీద సీరియస్ గా దృష్టి పెట్టాలి. చిరంజీవి విశ్వంభరలో విలన్ గా చేయబోతున్న సంగతి ఆల్రెడీ లీకైపోయింది. రెండు రకాలుగా బ్యాలన్స్ చేస్తూ వరసగా సినిమాలు చేస్తూ ఉంటే మరిన్ని ఛాలెంజింగ్ పాత్రలు దక్కుతాయి.
This post was last modified on December 14, 2023 10:36 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…