నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం ‘డెవిల్’ క్రెడిట్ విషయంలో కొన్ని నెలలుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదలైనపుడేమో దర్శకుడిగా నవీన్ మేడారం పేరుంది. కానీ టీజర్ లాంచ్ అయినపుడు డైరెక్టెడ్ బై ‘అభిషేక్ నామా పిక్చర్స్ టీం’ అని వేశారు. కానీ సినిమా రిలీజ్ సమయానికేమో నిర్మాత అభిషేక్ నామానే దర్శకుడైపోయాడు. ఇప్పటిదాకా రైటింగ్, డైరెక్షన్లో ఎలాంటి అనుభవం లేని నిర్మాత.. ఉన్నట్లుండి ఎలా దర్శకుడు అయిపోయాడో జనాలకు అర్థం కావడం లేదు. దర్శకుడితో నిర్మాతకు విభేదాలు తలెత్తితే.. అతణ్ని తప్పించి మరొకరిని పెట్టిన ఉదంతాలు లేకపోలేదు. కానీ ఇలా నిర్మాతే దర్శకుడు అయిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.
టీజర్ లాంచ్ అయినప్పుడు దర్శకుడిగా నవీన్ పేరు తీసేసినప్పటికీ టెక్నికల్ టీంలో తన పేరు ఉంది. కానీ తర్వాత పూర్తిగా ఆ పేరును ప్రాజెక్ట్ నుంచి తొలగించారు. మొన్నటిదాకా ఈ ప్రాజెక్టులో ఏ మాత్రం భాగస్వామ్యం లేని శ్రీకాంత్ విస్సా ఇప్పుడు స్క్రిప్ట్ క్రెడిట్ మొత్తం తీసుకున్నాడు. అతడికే కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ క్రెడిట్ ఇచ్చారు ట్రైలర్లో. మరి మొదట్లో అభిషేక్ పిక్చర్స్ టీంతో కలిసి నవీన్ తయారు చేసిన స్క్రిప్టును పూర్తిగా పక్కన పెట్టారా లేక శ్రీకాంత్ దానికే మెరుగులు దిద్దాడా అన్నది తెలియదు.
మొత్తానికి డెవిల్ రైటింగ్, డైరెక్షన్ విషయంలో ఎప్పటికప్పుడు కొత్త ట్విస్టులతో ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. టైలర్ చూస్తే ఇది ఒక పర్ఫెక్ట్ థ్రిల్లర్ లాగా కనిపిస్తుండగా.. అంత కంటే ముందు ఈ పరిణామాలు ప్రేక్షకులకు ఎక్కువ థ్రిల్ కలిగిస్తున్నాయి. డెవిల్ టీం దర్శకుడి మార్పు విషయమై ఎవరు మాట్లాడకుండా వ్యూహాత్మక మౌనం పాటిస్తుండడం విశేషం. చివరికి నవీన్ సైతం ఈ వివాదంపై సైలెంట్ గానే ఉండడం.. తన ట్విట్టర్ అకౌంట్లో డెవిల్ కు సంబంధించిన పోస్టులన్నీ అలాగే కొనసాగిస్తుండడం గమనార్హం.
This post was last modified on December 13, 2023 12:26 pm
యూత్ హీరో రాజ్ తరుణ్ కు మంచి హిట్టు దక్కి ఎంత కాలమయ్యిందో చెప్పడం కష్టం. సీనియర్ హీరోలతో సపోర్టింగ్…
ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు ఇంకో పద్దెనిమిది రోజుల్లో రాబోతున్నాయి. ఎవరికి వారు విజయం పట్ల ధీమాగా ఉన్నారు. అధికార పార్టీ,…
మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…
ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…
తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…
ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో 681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…