కమర్షియల్ సక్సెస్ సంగతి పక్కన పెడితే ఈ మధ్యకాలంలో తెలుగులో వచ్చిన సినిమాల్లో కంటెంట్ పరంగా సెన్సేషన్ అంటే మంగళవారం చిత్రమే. రిలీజ్ టైమింగ్ తేడా కొట్టి ఈ సినిమా అనుకున్నంతగా ఆడలేదు కానీ.. అజయ్ భూపతి ఒక డిఫరెంట్, బోల్డ్ అటెంప్ట్ తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. ఆర్ఎక్స్ 100 తర్వాత మహాసముద్రంతో నిరాశపరిచిన అజయ్.. మంగళవారం మూవీతో దర్శకుడిగా తనేంటో రుజువు చేసుకున్నాడు. అదే సమయంలో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ సైతం ఎంతగానో ఇంప్రెస్ చేసింది. అయితే భూపతికి మంచి అవకాశాలే వస్తున్నట్లుగా సంకేతాలు కనిపిస్తున్నాయి కానీ.. పాయల్ పరిస్థితే ఆశాజనకంగా కనిపించడం లేదు.
మంగళవారం మూవీలో శైలు పాత్రను పాయల్ రాజ్పుత్ గొప్పగా పోషించింది. ఇలాంటి పాత్రలు చేయడానికి హీరోయిన్లు బెంబేలెత్తిపోతారు. కన్విన్సింగ్గా ఆ పాత్రను పెర్ఫామ్ చేయడం అంత తేలిక కాదు. పాయల్ బోల్డ్ పెర్ఫామెన్స్తో మంచి మార్కులు వేయించుకుంది. కానీ ఎంతో రిస్క్ చేసి ఈ పాత్రలో బోల్డ్ అండ్ స్టనింగ్ పర్ఫామెన్స్ ఇచ్చిన పాయల్.. ఈ సినిమా తర్వాత మళ్లీ తన కెరీర్ ఊపందుకుంటుందని ఆశించింది.
కానీ పాయల్ కు పెద్దగా అవకాశాలు వస్తున్నట్లు ఏమీ కనిపించడం లేదు. మంగళవారం రిలీజ్ తర్వాత ఆమె గురించి పెద్దగా డిస్కషన్లు కూడా లేవు. తాను కోరుకున్నట్లుగా రాకపోవడంతో కాంతార చాప్టర్-1లో ఛాన్స్ కోసం ఆడిషన్స్ జరుగుతున్న విషయం తెలిసి.. ఓపెన్ గా సోషల్ మీడియాలో దర్శకుడు రిషబ్ శెట్టికి ఆమె రిక్వెస్ట్ పెట్టింది. ఇది ఆమె డెస్పరేషన్ ను సూచించేదే. అయితే ఎలా ప్రయత్నిస్తేనేమి పాయల్ కు ఏదో ఒక ఛాన్స్ వస్తుందేమో ఏమో చూడాలి.
This post was last modified on December 13, 2023 11:14 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…