కమర్షియల్ సక్సెస్ సంగతి పక్కన పెడితే ఈ మధ్యకాలంలో తెలుగులో వచ్చిన సినిమాల్లో కంటెంట్ పరంగా సెన్సేషన్ అంటే మంగళవారం చిత్రమే. రిలీజ్ టైమింగ్ తేడా కొట్టి ఈ సినిమా అనుకున్నంతగా ఆడలేదు కానీ.. అజయ్ భూపతి ఒక డిఫరెంట్, బోల్డ్ అటెంప్ట్ తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. ఆర్ఎక్స్ 100 తర్వాత మహాసముద్రంతో నిరాశపరిచిన అజయ్.. మంగళవారం మూవీతో దర్శకుడిగా తనేంటో రుజువు చేసుకున్నాడు. అదే సమయంలో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ సైతం ఎంతగానో ఇంప్రెస్ చేసింది. అయితే భూపతికి మంచి అవకాశాలే వస్తున్నట్లుగా సంకేతాలు కనిపిస్తున్నాయి కానీ.. పాయల్ పరిస్థితే ఆశాజనకంగా కనిపించడం లేదు.
మంగళవారం మూవీలో శైలు పాత్రను పాయల్ రాజ్పుత్ గొప్పగా పోషించింది. ఇలాంటి పాత్రలు చేయడానికి హీరోయిన్లు బెంబేలెత్తిపోతారు. కన్విన్సింగ్గా ఆ పాత్రను పెర్ఫామ్ చేయడం అంత తేలిక కాదు. పాయల్ బోల్డ్ పెర్ఫామెన్స్తో మంచి మార్కులు వేయించుకుంది. కానీ ఎంతో రిస్క్ చేసి ఈ పాత్రలో బోల్డ్ అండ్ స్టనింగ్ పర్ఫామెన్స్ ఇచ్చిన పాయల్.. ఈ సినిమా తర్వాత మళ్లీ తన కెరీర్ ఊపందుకుంటుందని ఆశించింది.
కానీ పాయల్ కు పెద్దగా అవకాశాలు వస్తున్నట్లు ఏమీ కనిపించడం లేదు. మంగళవారం రిలీజ్ తర్వాత ఆమె గురించి పెద్దగా డిస్కషన్లు కూడా లేవు. తాను కోరుకున్నట్లుగా రాకపోవడంతో కాంతార చాప్టర్-1లో ఛాన్స్ కోసం ఆడిషన్స్ జరుగుతున్న విషయం తెలిసి.. ఓపెన్ గా సోషల్ మీడియాలో దర్శకుడు రిషబ్ శెట్టికి ఆమె రిక్వెస్ట్ పెట్టింది. ఇది ఆమె డెస్పరేషన్ ను సూచించేదే. అయితే ఎలా ప్రయత్నిస్తేనేమి పాయల్ కు ఏదో ఒక ఛాన్స్ వస్తుందేమో ఏమో చూడాలి.
స్టార్ హీరోలు లేని బాక్సాఫీస్ క్లాష్ మాములుగా అయితే అంత ఆసక్తికరంగా ఉండదు. కానీ జూలై మొదటి మూడో తేదీ…
దురంధర్ ది రివెంజ్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ బాక్సాఫీస్ కు…
అరవింద సమేత వీరరాఘవ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.…
మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న ఇరుముడి ఆగస్ట్ 21 విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఒక టీజర్ రూపంలో…
ఎప్పుడో గజిని తర్వాత అంత పెద్ద బ్లాక్ బస్టర్ మళ్ళీ చూడలేకపోయాననే సూర్య కొరతని కరుప్పు మూడు వందల కోట్లు…
అమరావతి రాజధానిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. రాజధానికి కేంద్రం నుంచి భారీగా…