కమర్షియల్ సక్సెస్ సంగతి పక్కన పెడితే ఈ మధ్యకాలంలో తెలుగులో వచ్చిన సినిమాల్లో కంటెంట్ పరంగా సెన్సేషన్ అంటే మంగళవారం చిత్రమే. రిలీజ్ టైమింగ్ తేడా కొట్టి ఈ సినిమా అనుకున్నంతగా ఆడలేదు కానీ.. అజయ్ భూపతి ఒక డిఫరెంట్, బోల్డ్ అటెంప్ట్ తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. ఆర్ఎక్స్ 100 తర్వాత మహాసముద్రంతో నిరాశపరిచిన అజయ్.. మంగళవారం మూవీతో దర్శకుడిగా తనేంటో రుజువు చేసుకున్నాడు. అదే సమయంలో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ సైతం ఎంతగానో ఇంప్రెస్ చేసింది. అయితే భూపతికి మంచి అవకాశాలే వస్తున్నట్లుగా సంకేతాలు కనిపిస్తున్నాయి కానీ.. పాయల్ పరిస్థితే ఆశాజనకంగా కనిపించడం లేదు.
మంగళవారం మూవీలో శైలు పాత్రను పాయల్ రాజ్పుత్ గొప్పగా పోషించింది. ఇలాంటి పాత్రలు చేయడానికి హీరోయిన్లు బెంబేలెత్తిపోతారు. కన్విన్సింగ్గా ఆ పాత్రను పెర్ఫామ్ చేయడం అంత తేలిక కాదు. పాయల్ బోల్డ్ పెర్ఫామెన్స్తో మంచి మార్కులు వేయించుకుంది. కానీ ఎంతో రిస్క్ చేసి ఈ పాత్రలో బోల్డ్ అండ్ స్టనింగ్ పర్ఫామెన్స్ ఇచ్చిన పాయల్.. ఈ సినిమా తర్వాత మళ్లీ తన కెరీర్ ఊపందుకుంటుందని ఆశించింది.
కానీ పాయల్ కు పెద్దగా అవకాశాలు వస్తున్నట్లు ఏమీ కనిపించడం లేదు. మంగళవారం రిలీజ్ తర్వాత ఆమె గురించి పెద్దగా డిస్కషన్లు కూడా లేవు. తాను కోరుకున్నట్లుగా రాకపోవడంతో కాంతార చాప్టర్-1లో ఛాన్స్ కోసం ఆడిషన్స్ జరుగుతున్న విషయం తెలిసి.. ఓపెన్ గా సోషల్ మీడియాలో దర్శకుడు రిషబ్ శెట్టికి ఆమె రిక్వెస్ట్ పెట్టింది. ఇది ఆమె డెస్పరేషన్ ను సూచించేదే. అయితే ఎలా ప్రయత్నిస్తేనేమి పాయల్ కు ఏదో ఒక ఛాన్స్ వస్తుందేమో ఏమో చూడాలి.
This post was last modified on December 13, 2023 11:14 am
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…