తెలుగు సినిమాలకు విలన్ల కొరత తీరడం కోసం దర్శకులు క్రమంగా ఇతర బాషల నుంచి ఆర్టిస్టులను తీసుకురావడం తీవ్రతరం చేశారు. ఇటీవలే భగవంత్ కేసరిలో ‘అర్జున్ రామ్ పాల్’ పాత్ర రెగ్యులర్ షేడ్స్ లో ఉన్నా అతను పోషించడం వల్ల డిఫరెంట్ షేడ్ వచ్చింది. యానిమల్ లో అబ్రార్ గా మాటలే లేకుండా క్రూరత్వాన్ని పలికించిన ‘బాబీ డియోల్’ బాలకృష్ణ 109లో ఛాన్స్ కొట్టేశాడు. ఆల్రెడీ చిత్రీకరణ మొదలైపోయింది. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లులో ఔరంగజేబుగా మరో ముఖ్యమైన క్యారెక్టర్ చేస్తున్నాడు. ఈ రెండూ భారీ బడ్జెట్ తో రూపొందుతున్న క్రేజీ చిత్రాలే.
ప్రభాస్ మారుతీ కాంబోలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం ఆల్రెడీ ‘సంజయ్ దత్’ లాకైపోయాడు. ఇటీవలే ఫోటో షూట్ చేసుకుని ఓకే చేసుకున్నారు. కెజిఎఫ్, లియో తాలూకు ఎఫెక్ట్ ఇది. ఆదిపురుష్ తో మనకు పరిచయమైన ‘సైఫ్ అలీ ఖాన్’ తారక్ దేవరలో పూర్తి స్థాయి ప్రతినాయకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ‘జాకీ శ్రోఫ్’ ఎప్పటి నుంచో నటిస్తున్నప్పటికీ తనకు ఇక్కడ సరైన బ్రేక్ దక్కలేదు. ‘వివేక్ ఒబెరాయ్’ వినయ విధేయ రామ తర్వాత ఇక్కడ అంతగా ఆసక్తి చూపించడం లేదు. మహేష్ మంజ్రేకర్ లాంటి సీనియర్లు అడపాదడపా కనిపిస్తున్నారు. నానా పాటేకర్ కాలాలో కనిపించాక మళ్ళీ సౌత్ లో చేయలేదు. జాన్ అబ్రహం, సునీల్ శెట్టిలను మనోళ్లు రెండుమూడు సార్లు ట్రై చేశారు కానీ వర్కౌట్ కాలేదు.
ఇప్పుడీ పరిణామాల పుణ్యమాని హిందీ విలన్లు భారీ రెమ్యునరేషన్లు డిమాండ్ చేస్తున్నారు. కనీసం కోటి రూపాయల నుంచి వీళ్ళ ధర మొదలవుతోంది. బాబీ డియోల్, సంజయ్ దత్ ల కోసం కనీసం అయిదు కోట్లు ఖర్చు పెట్టాల్సిందే. ఇప్పుడు పారితోషికం మరింతగా పెరిగింది. ప్రకాష్ రాజ్, రావు రమేష్, మురళీశర్మ లాంటి లోకల్ విలన్లు మనోళ్లకు బోర్ కొట్టేస్తున్నారు. అందుకే కొత్తదనం కోసం దిగుమతి చేసుకోక తప్పడం లేదు. ఈ ట్రెండ్ ఇకపై కూడా కొనసాగనుంది. త్వరలో ఒక పెద్ద స్టార్ హీరో ప్యాన్ ఇండియా మూవీ కోసం అనిల్ కపూర్ ని అడిగారట కానీ ఆయన ససేమిరా అన్నట్టు వినికిడి.
This post was last modified on December 12, 2023 5:40 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…