మాస్ మహారాజా రవితేజ ఈగల్ జనవరి 13 విడుదలకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటోంది. పోటీ మరీ తీవ్రంగా ఉండటంతో వాయిదా పడి రిపబ్లిక్ డేకి వెళ్లొచ్చనే వార్తలు నెల రోజులుగా వస్తూనే ఉన్నాయి కానీ నిర్మాతలు మాత్రం వాటిని పూర్తిగా కొట్టి పారేస్తున్నారు. నిజానికి ఈగల్ రెండు వైపులా ఒత్తిడి వ్యూహంలో ఇరుక్కుంటోంది. గుంటూరు కారంని ఢీ కొట్టడం అంత సులభం కాదు. దీని తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ఛాయస్ ఒకవేళ టాక్ బాగుంటే హనుమాన్ వైపు వెళ్తుంది. మాస్ ని నేను లాగుతానంటూ నాగార్జున నా సామిరంగాని ఆఘమేఘాల మీద సిద్ధం చేయిస్తున్నారు.
ఇక వెంకటేష్ సైంధవ్ ఎంచక్కా ప్రమోషన్లు చేసుకుంటూ పక్కా ప్లానింగ్ తో ఉంది. గణేష్ రేంజ్ మాస్ ఇందులో ఉంటుందనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది. ఎటొచ్చి ఈగల్ రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాదు. మాస్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ ఒక డిఫరెంట్ స్టైల్ లో యాక్షన్ డ్రామాగా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తీశారని ఇన్ సైడ్ టాక్. అలాంటప్పుడు ఈ జానర్ పండగ బరికి సూట్ కాదు. కానీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మాత్రమే రాజీ పడే ప్రసక్తే లేదని డౌటొచ్చి అడిగిన బయ్యర్లతో అన్నట్టు సమాచారం. ఒకవేళ నిజంగా జనవరి 26కి వెళదాం అనుకున్నా అక్కడ కూడా రిస్క్ పొంచి ఉంది.
హృతిక్ రోషన్ ఫైటర్, విక్రమ్ తంగలాన్, మోహన్ లాల్ మలైకోట్టై వాలిబన్ లు ప్యాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. తెలుగు మార్కెట్ వరకు వీటితో రవితేజకు ఇబ్బంది లేదు కానీ బయట రాష్ట్రాల్లో సమస్యలొస్తాయి. కాకపోతే సంక్రాంతి కంటే బెటర్ ఆప్షన్ అవ్వొచ్చనే కామెంట్స్ ని కొట్టిపారేయలేం. లేదూ ఇవన్నీ ఎందుకు జనవరి 13కే దొరికినన్ని స్క్రీన్లే చాలు అనుకుంటే ఈగల్ కంటెంట్ ఎంత బాగున్నా సరే ఓపెనింగ్స్, కలెక్షన్లు రెండింటిలోనూ కాస్త తగ్గుదలకు సిద్ధపడాల్సి ఉంటుంది. ఇంకో రెండు మూడు వారాల దాకా పండగ చిత్రాల విడుదల సస్పెన్సులు కొనసాగేలానే ఉంది.
This post was last modified on December 11, 2023 9:34 pm
మాములుగా ఒక సినిమా రిలీజయ్యాక దాని ఫలితంతో సంబంధం లేకుండా సక్సెస్ మీట్ల పేరుతో బాణా సంచా కాల్చడం, మీడియా…
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్.. మంగళవారం మధ్యాహ్నం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో…
ఏపీలో అరటి పండ్ల ధర ఎంత..? ఎందుకీ రాద్దాంతం..? అరటి రైతులు కష్టాలు పడుతున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చకు…
ఉప ముఖ్యమంత్రి మాటలను వక్రీకరించ వద్దంటూ జనసేన ఓ పార్టీ ప్రకటన విడుదల చేసింది. కొద్దిరోజుల కిందట పవన్ కళ్యాణ్…
దేశంలో పురాతన, బ్రిటీష్ కాలం నాటి పేర్లను, ఊర్లను కూడా మారుస్తున్న కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం…
ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి మహానగరంగా నిర్మించాలని నిర్ణయించుకున్న సీఎం చంద్రబాబు.. ఆదిశగా వడి వడిగా అడుగులు వేస్తున్నారు.…