కొన్ని నెలల క్రితం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో సినిమా ప్రకటించినప్పుడు ఒకరకమైన అనుమానం తలెత్తింది. సందీప్ తీసిన అర్జున్ రెడ్డి ఎంత క్లాసిక్ బ్లాక్ బస్టర్ అయినా అందులో నటించింది కమర్షియల్ హీరో కాదు. పైగా ఫైట్లు గట్రా లేని ఒక బోల్డ్ లవ్ స్టోరీ కాబట్టి ఆ క్యారెక్టరైజేషన్ కి యూత్ ఫిదా అయిపోయి బ్లాక్ బస్టర్ చేసి పెట్టారు. అలాంటి డైరెక్టర్ కి ఎస్ చెప్పడం రిస్క్ అవుతుందేమోననే సందేహాలు లేకపోలేదు. పుష్ప ప్యాన్ ఇండియా సక్సెస్ తర్వాత ఆ ఇమేజ్ ని కాపాడుకునేందుకు బన్నీ ఎంత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడో చూస్తున్నాం.
నిన్న యానిమల్ రివ్యూ పెట్టిన అల్లు అర్జున్ అన్ని డౌట్లు తీర్చేశాడు. పేరు పేరునా సినిమాలో నటించినవాళ్ల గురించి, టెక్నికల్ టీమ్ గురించి ఇంత సుదీర్ఘంగా రివ్యూ చేసిన స్టార్ హీరో ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. బన్నీ ప్రతి మాటలో తాను సందీప్ వంగా కథ వినకుండానే ఎస్ చెప్పడం ఎంత గొప్ప నిర్ణయమో తెలియజేయడం అంతర్లీనంగా కనిపించింది. దీని కన్నా ముందు ప్రభాస్ స్పిరిట్ ఉంది. దానికో రెండేళ్లు పడుతుంది. ఈలోగా బన్నీ పుష్ప 2 పూర్తి చేసుకుని త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా మొదలుపెట్టొచ్చు. ఇదంతా కుదురుకునే లోపు సందీప్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తాడు.
ప్రభాస్ ని పోలీస్ ఆఫీసర్ గా చూపించబోతున్న సందీప్ వంగా అల్లు అర్జున్ ని ఏ పాత్రలో ప్రెజెంట్ చేస్తాడనేది సస్పెన్సే. ఇదంతా చాలా టైం పట్టే వ్యవహారం. పుష్ప 2 షూటింగ్ కు వద్దనుకుంటున్నా బ్రేకులు పడుతూనే ఉన్నాయి. కొన్ని వారాలుగా నిర్విరామంగా జరుగుతుంటే కీలక పాత్ర పోషిస్తున్న జగదీశ్ అరెస్ట్ అయ్యాడు. బెయిల్ త్వరగా వస్తే టెన్షన్ తీరిపోతుంది. లేదంటే అతను లేని భాగాలు ముందు పూర్తి చేసేలా దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేసుకుంటున్నారు. వచ్చే ఆగస్ట్ లో విడుదల కాబోతున్న పుష్ప 2 ది రూల్ మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడం కష్టం.
This post was last modified on December 9, 2023 12:11 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…