యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఇప్పటికే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోతున్నారు. గత కొన్ని నెలల్లో రెండు భారీ ప్రాజెక్టులను ప్రభాస్ అనౌన్స్ చేశాడు. అందులో ఒకటి ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వైజయంతీ మూవీస్ నిర్మించబోయే చిత్రం. రూ.300 కోట్లకు పైగా బడ్జెట్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.
దీనికి దీపికా పదుకొనే లాంటి అగ్ర బాలీవుడ్ హీరోయిన్ కథానాయికగా ఖరారైంది. ఇటీవలే దీన్ని మించిన భారీ చిత్రం ఒకటి అనౌన్స్ అయింది ప్రభాస్ హీరోగా. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్తో కలిసి అతను ‘ఆదిపురుష్’ అనే రామాయణ నేపథ్య సినిమా చేయబోతున్నాడు. దీని బడ్జెట్ ఏకంగా రూ.500 కోట్లంటున్నారు. ‘సాహో’ లాంటి నిరాశాజనక సినిమా చేసి.. ఆపై ‘రాధేశ్యామ్’ లాంటి కాస్త హైప్ తక్కువున్న మూవీ చేస్తున్న ప్రభాస్.. ఆ తర్వాతి రెండు ప్రాజెక్టుల విషయంలో మాత్రం సరిగ్గానే ప్లాన్ చేసినట్లున్నాడు.
ఈ అనౌన్స్మెంట్లతోనే ప్రభాస్ అభిమానుల ఆనందం పట్టలేకుండా ఉంది. ఐతే ఇప్పుడు ప్రభాస్.. ఇంకో అనౌన్స్మెంట్కు రెడీ అవుతున్నట్లు బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్తో అతను పని చేయబోతున్నట్లు ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది. ‘కేజీఎఫ్’ తర్వాత ప్రశాంత్ సినిమా ప్రభాస్తోనే అన్నారు. కానీ మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా లైన్లోకి వచ్చింది. ఆ సినిమా గురించి అధికారిక ప్రకటన చేయలేదు కానీ.. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అయితే ఆ దిశగా సంకేతాలైతే ఇచ్చింది.
కానీ దాని గురించి పూర్తిగా వెల్లడి కాకముందే ప్రభాస్.. ప్రశాంత్ నీల్తో సినిమాను అనౌన్స్ చేయబోతున్నాడని గట్టిగా ప్రచారం జరుగుతోందిప్పుడు. ప్రభాస్ నుంచి ఇంకో సర్ప్రైజ్.. అతి త్వరలో అనౌన్స్మెంట్ అంటూ సోషల్ మీడియాలో ఊదరగొట్టేస్తున్నారు. నిజంగా తారక్ సినిమా కంటే ముందు దీని గురించి అధికారిక ప్రకటన వస్తే మాత్రం జూనియర్ అభిమానులు తట్టుకోవడం కష్టమే. ఐతే ప్రభాస్కు ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్ల ప్రకారం చూస్తే తారక్ సినిమాను పూర్తి చేశాక ప్రశాంత్ ఈ చిత్రం చేసే అవకాశముంది.
This post was last modified on September 1, 2020 11:47 am
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారమే సమయం ఉంది. ఈ ఎన్నికలు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్కు, అటు ప్రతిపక్ష…
‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…
ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జగన్ ప్రబుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎన్నికల…
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…