Movie News

ప్రభాస్.. తారక్ అభిమానుల్ని హర్ట్ చేస్తాడా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఇప్పటికే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోతున్నారు. గత కొన్ని నెలల్లో రెండు భారీ ప్రాజెక్టులను ప్రభాస్ అనౌన్స్ చేశాడు. అందులో ఒకటి ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వైజయంతీ మూవీస్ నిర్మించబోయే చిత్రం. రూ.300 కోట్లకు పైగా బడ్జెట్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.

దీనికి దీపికా పదుకొనే లాంటి అగ్ర బాలీవుడ్ హీరోయిన్ కథానాయికగా ఖరారైంది. ఇటీవలే దీన్ని మించిన భారీ చిత్రం ఒకటి అనౌన్స్ అయింది ప్రభాస్ హీరోగా. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌తో కలిసి అతను ‘ఆదిపురుష్’ అనే రామాయణ నేపథ్య సినిమా చేయబోతున్నాడు. దీని బడ్జెట్ ఏకంగా రూ.500 కోట్లంటున్నారు. ‘సాహో’ లాంటి నిరాశాజనక సినిమా చేసి.. ఆపై ‘రాధేశ్యామ్’ లాంటి కాస్త హైప్ తక్కువున్న మూవీ చేస్తున్న ప్రభాస్.. ఆ తర్వాతి రెండు ప్రాజెక్టుల విషయంలో మాత్రం సరిగ్గానే ప్లాన్ చేసినట్లున్నాడు.

ఈ అనౌన్స్‌మెంట్లతోనే ప్రభాస్ అభిమానుల ఆనందం పట్టలేకుండా ఉంది. ఐతే ఇప్పుడు ప్రభాస్.. ఇంకో అనౌన్స్‌మెంట్‌కు రెడీ అవుతున్నట్లు బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌తో అతను పని చేయబోతున్నట్లు ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది. ‘కేజీఎఫ్’ తర్వాత ప్రశాంత్ సినిమా ప్రభాస్‌తోనే అన్నారు. కానీ మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా లైన్లోకి వచ్చింది. ఆ సినిమా గురించి అధికారిక ప్రకటన చేయలేదు కానీ.. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అయితే ఆ దిశగా సంకేతాలైతే ఇచ్చింది.

కానీ దాని గురించి పూర్తిగా వెల్లడి కాకముందే ప్రభాస్.. ప్రశాంత్‌ నీల్‌తో సినిమాను అనౌన్స్ చేయబోతున్నాడని గట్టిగా ప్రచారం జరుగుతోందిప్పుడు. ప్రభాస్ నుంచి ఇంకో సర్ప్రైజ్.. అతి త్వరలో అనౌన్స్‌మెంట్ అంటూ సోషల్ మీడియాలో ఊదరగొట్టేస్తున్నారు. నిజంగా తారక్ సినిమా కంటే ముందు దీని గురించి అధికారిక ప్రకటన వస్తే మాత్రం జూనియర్ అభిమానులు తట్టుకోవడం కష్టమే. ఐతే ప్రభాస్‌కు ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్ల ప్రకారం చూస్తే తారక్ సినిమాను పూర్తి చేశాక ప్రశాంత్ ఈ చిత్రం చేసే అవకాశముంది.

This post was last modified on September 1, 2020 11:47 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేవంత్ రెడ్డి `వ‌న్ మ్యాన్ ఆర్మీ`… సరిపోవట్లేదా?

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో వ‌న్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి క‌నిపిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి…

4 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో ఎవరిది పైచేయి?

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌న్న టాక్ వినిపిస్తోంది. కీల‌క నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

4 hours ago

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

8 hours ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

8 hours ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

9 hours ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

9 hours ago